Political News

వైసీపీ త‌ప్పులు స‌రిచేస్తున్నాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుతున్నామ‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. జ‌గన‌న్న కాల‌నీల పేరుతో ఊరికి దూరంగా ఇచ్చిన ఇళ్లు ఇప్పుడు నీట మునిగాయ‌ని.. వీటి వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అప్ప‌టి త‌ప్పులు స‌రిదిద్దేందుకు కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు. తాజాగా ఆయ‌న సోమ‌వారం కాకినాడ జిల్లాలోని గొల్ల‌ప్రోలులో ప‌ర్య‌టించారు. ఏలేరు రిజ‌ర్వాయ‌ర్ పొంగ‌డంతో గొల్ల‌ప్రోలు ప‌రిధిలోని సుద్ద‌గ‌డ్డ వాగుకు వ‌ర‌ద పెరిగి.. స‌మీపగ్రామాలు నీట మునిగాయి.

ఆయా గ్రామాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టించారు. విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగం అధికారుల సాయంతో ప్ర‌త్యేక బోటులో అక్క‌డ‌కు చేరుకున్నారు. అయితే.. బాధితుల గోడు వినేందుకు కొంత దూరం మోకాల్లోతు నీటిలో నే ముందుకు న‌డిచి.. వారిని ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారికి అందుతున్న ఆహారం, తాగునీటి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అంద‌రికీ న్యాయం చేస్తామ‌ని.. బాధితుల‌ను ఆదుకుంటామ‌ని చెప్పారు. త‌న‌కు ఆరోగ్యం బాగోలేద‌ని.. జ్వ‌రంతో బాద‌ప‌డుతున్నాన‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు.

జ‌గ‌న‌న్న కాల‌నీల పేరుతో గ‌త ప్ర‌భుత్వం చేసి త‌ప్పుల‌ను స‌రిచేస్తామ‌ని ప‌వ‌న్ చెప్పారు. సుద్ద‌గ‌డ్డ వాగు ప‌రిస్థితిని, ఏలేరు రిజ‌ర్వాయ‌ర్ ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నామ‌ని తెలిపారు. బాధితులకు ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. పంచాయ‌తీల‌ను బ‌లోపేతం చేస్తామని.. వాటికి నిధులు కూడా ఇస్తామ‌ని ప‌వ‌న్ చెప్పారు. వైసీపీ హ‌యాంలో పంచాయ‌తీలు నిర్వీర్యం అయ్యాయ‌ని.. అందుకే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌న్నారు.

విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద‌లు అరిక‌ట్టేందుకు చంద్ర‌బాబు నిరంత‌రం శ్ర‌మిస్తున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పా రు. బుడ‌మేరు వ‌ర‌ద బాధితుల‌ను ఆయ‌న ఆదుకున్న‌ట్టు తెలిపారు. ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. హైడ్రా వంటి బ‌ల‌మైన వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని.. అయితే.. ఆక్ర‌మ‌ణ దారుల్లో పేద‌లు ఉంటే వారిని ముందుగా ఆదుకుని.. ఆ త‌ర్వాత చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట‌.. ప‌లువురు అధికారులు ఉన్నారు.

This post was last modified on September 10, 2024 9:44 am

Share

Recent Posts

పార్టీ అధిష్టానానికే బోండా ఉమ సవాల్?

ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…

40 minutes ago

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

3 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

5 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

5 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

6 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

10 hours ago