విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి డ్యామేజీ జరిగింది. బ్యారేజీకి ఉన్న 67, 69, 70వ నెంబరు గేట్ల వద్ద ఉన్న కౌంటర్ వెయిట్లు(సిమెంటు దిమ్మెలు) దెబ్బతిన్నాయి. దీంతో వాటిని రీప్లేస్ చేసే కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రబుత్వ సలహాదారు, ప్రాజెక్టు గేట్ల అమరిక నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే.. 69వ నెంబరు గేటు వద్ద మూడు ఐరన్ పడవల వ్యవహారం మాత్రం రాజకీయంగా దుమారం రేపుతోంది.
ఈ ఐరన్ బోట్లు బలంగా గుద్దడం వల్లే బ్యారేజీ గేట్లకు నష్టం వాటిల్లిందనేది అధికారులు చెబుతున్న మాట. దీనివెనుక ఎవరో ఉన్నారని..వారు వైసీపీ నాయకులేనని టీడీపీ నాయకులు చెబుతున్న వాదన. మొత్తానికి ఈ వ్యవహారంపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వారు విచారణ కూడా ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ.. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడుగా ఉన్న తలశిల రఘురాం మేనల్లుడివిగా పోలీసులు గుర్తించారు.
దీంతో రాజకీయ దుమారం మరింత రేగింది. ఈ బోట్ల వెనుక కుట్ర కోణం ఉందని తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. అంతేకాదు… వైసీపీ నాయకుల హస్తం కూడా ఉందని చెప్పారు. ఈ మూడు బోట్లు వైసీపీ నేతలకు చెందినవేనని.. వరదల సమయంలో ఇతర బోట్లు ఏవీ నదిలోకి రాలేదని.. ఈ మూడు మాత్రమే వచ్చాయని.. కాబట్టి వీటి వెనుక కుట్ర కోణం ఉందని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు.. ఈ బోట్లకు లంగర్ వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారంటే ఉద్దేశ పూర్వకమేనని వ్యాఖ్యానించారు.
ఇదే విషయంపై సీఎం చంద్రబాబు కూడా గత రెండు రోజులుగా తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలన్న కుట్ర ఉందని.. దీనివెనుక ఎవరు ఉన్నా వదిలి పెట్టేది లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలతో ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న బోట్ల వ్యవహారం రాజకీయంగా పలు మలుపులు తిరుగుతోంది. చివరకు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 9, 2024 5:13 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…