విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి డ్యామేజీ జరిగింది. బ్యారేజీకి ఉన్న 67, 69, 70వ నెంబరు గేట్ల వద్ద ఉన్న కౌంటర్ వెయిట్లు(సిమెంటు దిమ్మెలు) దెబ్బతిన్నాయి. దీంతో వాటిని రీప్లేస్ చేసే కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రబుత్వ సలహాదారు, ప్రాజెక్టు గేట్ల అమరిక నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే.. 69వ నెంబరు గేటు వద్ద మూడు ఐరన్ పడవల వ్యవహారం మాత్రం రాజకీయంగా దుమారం రేపుతోంది.
ఈ ఐరన్ బోట్లు బలంగా గుద్దడం వల్లే బ్యారేజీ గేట్లకు నష్టం వాటిల్లిందనేది అధికారులు చెబుతున్న మాట. దీనివెనుక ఎవరో ఉన్నారని..వారు వైసీపీ నాయకులేనని టీడీపీ నాయకులు చెబుతున్న వాదన. మొత్తానికి ఈ వ్యవహారంపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వారు విచారణ కూడా ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ.. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడుగా ఉన్న తలశిల రఘురాం మేనల్లుడివిగా పోలీసులు గుర్తించారు.
దీంతో రాజకీయ దుమారం మరింత రేగింది. ఈ బోట్ల వెనుక కుట్ర కోణం ఉందని తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. అంతేకాదు… వైసీపీ నాయకుల హస్తం కూడా ఉందని చెప్పారు. ఈ మూడు బోట్లు వైసీపీ నేతలకు చెందినవేనని.. వరదల సమయంలో ఇతర బోట్లు ఏవీ నదిలోకి రాలేదని.. ఈ మూడు మాత్రమే వచ్చాయని.. కాబట్టి వీటి వెనుక కుట్ర కోణం ఉందని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు.. ఈ బోట్లకు లంగర్ వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారంటే ఉద్దేశ పూర్వకమేనని వ్యాఖ్యానించారు.
ఇదే విషయంపై సీఎం చంద్రబాబు కూడా గత రెండు రోజులుగా తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలన్న కుట్ర ఉందని.. దీనివెనుక ఎవరు ఉన్నా వదిలి పెట్టేది లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలతో ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న బోట్ల వ్యవహారం రాజకీయంగా పలు మలుపులు తిరుగుతోంది. చివరకు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 9, 2024 5:13 pm
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…