విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి డ్యామేజీ జరిగింది. బ్యారేజీకి ఉన్న 67, 69, 70వ నెంబరు గేట్ల వద్ద ఉన్న కౌంటర్ వెయిట్లు(సిమెంటు దిమ్మెలు) దెబ్బతిన్నాయి. దీంతో వాటిని రీప్లేస్ చేసే కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రబుత్వ సలహాదారు, ప్రాజెక్టు గేట్ల అమరిక నిపుణుడు కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. అయితే.. 69వ నెంబరు గేటు వద్ద మూడు ఐరన్ పడవల వ్యవహారం మాత్రం రాజకీయంగా దుమారం రేపుతోంది.
ఈ ఐరన్ బోట్లు బలంగా గుద్దడం వల్లే బ్యారేజీ గేట్లకు నష్టం వాటిల్లిందనేది అధికారులు చెబుతున్న మాట. దీనివెనుక ఎవరో ఉన్నారని..వారు వైసీపీ నాయకులేనని టీడీపీ నాయకులు చెబుతున్న వాదన. మొత్తానికి ఈ వ్యవహారంపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వారు విచారణ కూడా ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ.. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడుగా ఉన్న తలశిల రఘురాం మేనల్లుడివిగా పోలీసులు గుర్తించారు.
దీంతో రాజకీయ దుమారం మరింత రేగింది. ఈ బోట్ల వెనుక కుట్ర కోణం ఉందని తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. అంతేకాదు… వైసీపీ నాయకుల హస్తం కూడా ఉందని చెప్పారు. ఈ మూడు బోట్లు వైసీపీ నేతలకు చెందినవేనని.. వరదల సమయంలో ఇతర బోట్లు ఏవీ నదిలోకి రాలేదని.. ఈ మూడు మాత్రమే వచ్చాయని.. కాబట్టి వీటి వెనుక కుట్ర కోణం ఉందని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు.. ఈ బోట్లకు లంగర్ వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారంటే ఉద్దేశ పూర్వకమేనని వ్యాఖ్యానించారు.
ఇదే విషయంపై సీఎం చంద్రబాబు కూడా గత రెండు రోజులుగా తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలన్న కుట్ర ఉందని.. దీనివెనుక ఎవరు ఉన్నా వదిలి పెట్టేది లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలతో ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న బోట్ల వ్యవహారం రాజకీయంగా పలు మలుపులు తిరుగుతోంది. చివరకు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 9, 2024 5:13 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…