విజయవాడలో ఒక వైపు వరదలు.. మరోవైపు విశాఖలో పెరుగుతున్న వర్షాలు.. వెరసి సీఎం చంద్రబాబు కు టెన్షన్ పెరుగుతోంది. మరి అలాంటిది.. ఆయన ఈ విపత్కర సమయం మురిసిపోవడం ఏంటి? అనే సందేహాలు వ్యక్తమవుతాయి. అయితే.. ఆయన నిజంగానే మురిసిపోయారు.. తన హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి వారినే నేనుకోరుకుంటున్నాను అని ప్రత్యేకంగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరి చంద్రబాబును అంతగా కదిలించిన సన్నివేశం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
విజయవాడలో గత వారం రోజులుగా వరద బీభత్సంతో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు సాయం అందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అనేక మంది సంపన్నులు, వ్యాపార వేత్తలు.. పారిశ్రామిక వేత్తలు కూడా ముందుకు వచ్చారు. రూ. కోట్ల రూపాయల సాయం చేస్తున్నారు. అయితే.. బు డిబుడి అడుగులు వేసే చిన్నారుల నుంచి 5వ తరగతి చదివే విద్యార్థుల వరకు.. తమకు తల్లిదండ్రులు ఇచ్చిన ప్యాకెట్ మనీని దాచుకోకుండా.. వరద బాధితులకు సాయం చేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని కోట్ చేసిన చంద్రబాబు.. ఇది తనను ఎంతో మురిసిపోయేలా చేసిందని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడుమండ లం, పడమర విప్పర్రు గ్రామంలోని ఓ స్కూల్ చిన్నారులు.. విజయవాడ వరద బాధితులకు సాయం అందించారు. ఇంట్లో తల్లిదండ్రులు వారికి ఇచ్చిన పాకెట్ మనీని కూడా వారు వరద సాయం కోసం అందించారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకునే చంద్రబాబు మురిసిపోయారు.
విద్యార్తుల్లో చిన్ననాటి నుంచే ఇలాంటి అత్యున్నత విలువలు పెంపొదిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా. అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలన్న గుణాన్ని నేర్పడం సంతోషకర విషయం. మానవత్వంపై విశ్వాసం, భవిష్యత్తుపై నమ్మకం పెంచుతాయి. ఉత్తమ పౌరులను ఈ సమాజానికి అందిస్తాయి అని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
This post was last modified on September 9, 2024 5:03 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…