కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న త్రిభాషా సూత్రాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ… బీజేపీపై విమర్శలు గుప్పించారు.
తెలుగు భాష గొప్పదనం అంటే.. ఆ భాషతోపాటు భాష చరిత్రను.. సంస్కృతిని కూడా గౌరవించా ల్సి ఉందన్నారు. కానీ, ఈ విషయం తెలియని కొందరు(బీజేపీనాయకులు) హిందేనే ప్రధానమని భావిస్తారని విమర్శించారు.
తాజాగా అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ డల్లాస్లోని తెలుగువారితో భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన త్రిభాషా సూత్రాన్ని ప్రస్తావించారు. తమిళం మాట్లాడే వారంటే ఉత్తరాది వారికి నచ్చరని.. అలాగని భాషలను ఏవగించుకుంటారా? అని ప్రశ్నించారు.
దేశంలో అందరూ సమానమేనని.. అదేవి ధంగా అన్ని భాషలూ.. సంస్కృతులు, రాష్ట్రాలు కూడా సమానమేనని చెప్పారు. జాతీయ గీతం ఏ భాషలో ఉందని చూస్తామా? అని ప్రశ్నించారు. దానిలో భాష కంటే దేశ భక్తి ప్రధానంగా చూస్తామన్నారు.
అదేవిధంగా తెలుగు భాషలోనూ.. సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర వంటివి ఉన్నాయని తెలిపారు. ఇది తెలియనికొందరు.. భాషల పేరుతో హిందీని రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఒక ప్రాంతం గొప్పదని.. ఒక హిందీనే గొప్పదని భావిస్తే.. ఇతర ప్రాంతాలను, ఇతర భాషలను కూడా తక్కువ చేసి చూసినట్టే కదా? కానీ అలాంటిదేమీ మన రాజ్యాంగంలో లేదన్నారు. ఏ భాషనైనా గౌరవించాల్సిందే నని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క భాషా సమానమేనని రాహుల్గాంధీ స్పష్టం చేశారు.
This post was last modified on September 9, 2024 5:07 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…