కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న త్రిభాషా సూత్రాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ… బీజేపీపై విమర్శలు గుప్పించారు.
తెలుగు భాష గొప్పదనం అంటే.. ఆ భాషతోపాటు భాష చరిత్రను.. సంస్కృతిని కూడా గౌరవించా ల్సి ఉందన్నారు. కానీ, ఈ విషయం తెలియని కొందరు(బీజేపీనాయకులు) హిందేనే ప్రధానమని భావిస్తారని విమర్శించారు.
తాజాగా అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ డల్లాస్లోని తెలుగువారితో భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన త్రిభాషా సూత్రాన్ని ప్రస్తావించారు. తమిళం మాట్లాడే వారంటే ఉత్తరాది వారికి నచ్చరని.. అలాగని భాషలను ఏవగించుకుంటారా? అని ప్రశ్నించారు.
దేశంలో అందరూ సమానమేనని.. అదేవి ధంగా అన్ని భాషలూ.. సంస్కృతులు, రాష్ట్రాలు కూడా సమానమేనని చెప్పారు. జాతీయ గీతం ఏ భాషలో ఉందని చూస్తామా? అని ప్రశ్నించారు. దానిలో భాష కంటే దేశ భక్తి ప్రధానంగా చూస్తామన్నారు.
అదేవిధంగా తెలుగు భాషలోనూ.. సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర వంటివి ఉన్నాయని తెలిపారు. ఇది తెలియనికొందరు.. భాషల పేరుతో హిందీని రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఒక ప్రాంతం గొప్పదని.. ఒక హిందీనే గొప్పదని భావిస్తే.. ఇతర ప్రాంతాలను, ఇతర భాషలను కూడా తక్కువ చేసి చూసినట్టే కదా? కానీ అలాంటిదేమీ మన రాజ్యాంగంలో లేదన్నారు. ఏ భాషనైనా గౌరవించాల్సిందే నని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క భాషా సమానమేనని రాహుల్గాంధీ స్పష్టం చేశారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…