కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న త్రిభాషా సూత్రాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ… బీజేపీపై విమర్శలు గుప్పించారు.
తెలుగు భాష గొప్పదనం అంటే.. ఆ భాషతోపాటు భాష చరిత్రను.. సంస్కృతిని కూడా గౌరవించా ల్సి ఉందన్నారు. కానీ, ఈ విషయం తెలియని కొందరు(బీజేపీనాయకులు) హిందేనే ప్రధానమని భావిస్తారని విమర్శించారు.
తాజాగా అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ డల్లాస్లోని తెలుగువారితో భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన త్రిభాషా సూత్రాన్ని ప్రస్తావించారు. తమిళం మాట్లాడే వారంటే ఉత్తరాది వారికి నచ్చరని.. అలాగని భాషలను ఏవగించుకుంటారా? అని ప్రశ్నించారు.
దేశంలో అందరూ సమానమేనని.. అదేవి ధంగా అన్ని భాషలూ.. సంస్కృతులు, రాష్ట్రాలు కూడా సమానమేనని చెప్పారు. జాతీయ గీతం ఏ భాషలో ఉందని చూస్తామా? అని ప్రశ్నించారు. దానిలో భాష కంటే దేశ భక్తి ప్రధానంగా చూస్తామన్నారు.
అదేవిధంగా తెలుగు భాషలోనూ.. సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర వంటివి ఉన్నాయని తెలిపారు. ఇది తెలియనికొందరు.. భాషల పేరుతో హిందీని రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఒక ప్రాంతం గొప్పదని.. ఒక హిందీనే గొప్పదని భావిస్తే.. ఇతర ప్రాంతాలను, ఇతర భాషలను కూడా తక్కువ చేసి చూసినట్టే కదా? కానీ అలాంటిదేమీ మన రాజ్యాంగంలో లేదన్నారు. ఏ భాషనైనా గౌరవించాల్సిందే నని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క భాషా సమానమేనని రాహుల్గాంధీ స్పష్టం చేశారు.
This post was last modified on September 9, 2024 5:07 pm
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…