Political News

అమెరికాలో తెలుగు గొప్పతనం చెప్పిన రాహుల్

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న త్రిభాషా సూత్రాన్ని ఆది నుంచి వ్య‌తిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తాజాగా ఈ విష‌యాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ… బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

తెలుగు భాష గొప్ప‌ద‌నం అంటే.. ఆ భాష‌తోపాటు భాష చ‌రిత్ర‌ను.. సంస్కృతిని కూడా గౌర‌వించా ల్సి ఉంద‌న్నారు. కానీ, ఈ విష‌యం తెలియ‌ని కొంద‌రు(బీజేపీనాయ‌కులు) హిందేనే ప్ర‌ధాన‌మ‌ని భావిస్తార‌ని విమ‌ర్శించారు.

తాజాగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న రాహుల్ గాంధీ డ‌ల్లాస్‌లోని తెలుగువారితో భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా ఆయ‌న త్రిభాషా సూత్రాన్ని ప్ర‌స్తావించారు. త‌మిళం మాట్లాడే వారంటే ఉత్త‌రాది వారికి న‌చ్చ‌ర‌ని.. అలాగ‌ని భాష‌ల‌ను ఏవ‌గించుకుంటారా? అని ప్ర‌శ్నించారు.

దేశంలో అంద‌రూ స‌మాన‌మేన‌ని.. అదేవి ధంగా అన్ని భాష‌లూ.. సంస్కృతులు, రాష్ట్రాలు కూడా స‌మాన‌మేన‌ని చెప్పారు. జాతీయ గీతం ఏ భాష‌లో ఉంద‌ని చూస్తామా? అని ప్ర‌శ్నించారు. దానిలో భాష కంటే దేశ భ‌క్తి ప్ర‌ధానంగా చూస్తామ‌న్నారు.

అదేవిధంగా తెలుగు భాష‌లోనూ.. సంస్కృతి, సంప్ర‌దాయాలు, చ‌రిత్ర వంటివి ఉన్నాయ‌ని తెలిపారు. ఇది తెలియ‌నికొంద‌రు.. భాష‌ల పేరుతో హిందీని రుద్దాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఒక ప్రాంతం గొప్ప‌ద‌ని.. ఒక హిందీనే గొప్ప‌ద‌ని భావిస్తే.. ఇత‌ర ప్రాంతాల‌ను, ఇత‌ర భాషల‌ను కూడా త‌క్కువ చేసి చూసిన‌ట్టే క‌దా? కానీ అలాంటిదేమీ మ‌న రాజ్యాంగంలో లేద‌న్నారు. ఏ భాష‌నైనా గౌర‌వించాల్సిందే న‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌తి ఒక్క భాషా స‌మాన‌మేన‌ని రాహుల్‌గాంధీ స్ప‌ష్టం చేశారు.

This post was last modified on September 9, 2024 5:07 pm

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

41 minutes ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

1 hour ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago