కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న త్రిభాషా సూత్రాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ… బీజేపీపై విమర్శలు గుప్పించారు.
తెలుగు భాష గొప్పదనం అంటే.. ఆ భాషతోపాటు భాష చరిత్రను.. సంస్కృతిని కూడా గౌరవించా ల్సి ఉందన్నారు. కానీ, ఈ విషయం తెలియని కొందరు(బీజేపీనాయకులు) హిందేనే ప్రధానమని భావిస్తారని విమర్శించారు.
తాజాగా అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ డల్లాస్లోని తెలుగువారితో భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన త్రిభాషా సూత్రాన్ని ప్రస్తావించారు. తమిళం మాట్లాడే వారంటే ఉత్తరాది వారికి నచ్చరని.. అలాగని భాషలను ఏవగించుకుంటారా? అని ప్రశ్నించారు.
దేశంలో అందరూ సమానమేనని.. అదేవి ధంగా అన్ని భాషలూ.. సంస్కృతులు, రాష్ట్రాలు కూడా సమానమేనని చెప్పారు. జాతీయ గీతం ఏ భాషలో ఉందని చూస్తామా? అని ప్రశ్నించారు. దానిలో భాష కంటే దేశ భక్తి ప్రధానంగా చూస్తామన్నారు.
అదేవిధంగా తెలుగు భాషలోనూ.. సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర వంటివి ఉన్నాయని తెలిపారు. ఇది తెలియనికొందరు.. భాషల పేరుతో హిందీని రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఒక ప్రాంతం గొప్పదని.. ఒక హిందీనే గొప్పదని భావిస్తే.. ఇతర ప్రాంతాలను, ఇతర భాషలను కూడా తక్కువ చేసి చూసినట్టే కదా? కానీ అలాంటిదేమీ మన రాజ్యాంగంలో లేదన్నారు. ఏ భాషనైనా గౌరవించాల్సిందే నని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క భాషా సమానమేనని రాహుల్గాంధీ స్పష్టం చేశారు.
This post was last modified on September 9, 2024 5:07 pm
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…