తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాలు గడువు విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు పెట్టాలని శాసనసభ కార్యదర్శికి హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇరుపక్షాల వాదనలు గత నెల 7వ తేదీన విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారడంతో పాటు సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి ఎంపీగా పోటీ చేశాడు. ఇక స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల మీద బీఆర్ఎస్ పార్టీ మొదట కోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది.
ఇక వీరి తర్వాత చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిల అనర్హత అంశం మీద కోర్టులో వాదనలు నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాలలో నిర్ణయం తీసుకోవాలని, దానికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఒక వేళ రిపోర్ట్ సమర్పించని యొడల సుమోటోగా స్వీకరించి మరోసారి విచారణ చేస్తామని వెల్లడించింది. హైకోర్టు తీర్పు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది అన్నది వేచిచూడాలి.
This post was last modified on September 9, 2024 12:52 pm
మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు అతడికి…
యూట్యూబ్ వీడియోల ద్వారా చాలా చిన్న వయసులోనే మంచి పాపులారిటీ సంపాదించిన వైష్ణవి అనే తెలంగాణ అమ్మాయి ఈ ఏడాది…
అల్లు అర్జున్ ఒక కొత్త సినిమా మొదలుపెట్టాడు అంటే ప్రమోషన్ల పరంగా మొదట్నుంచి బాగా హడావుడి ఉంటుంది. రెగ్యులర్గా అప్డేట్స్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆళ్ల కాళీకృష్ణ…
అమెరికా ఎఫ్బీఐ పేరుతో సోషల్ మీడియా పోస్టుల తొలగింపునకు ఎక్స్ కు అభ్యర్థనలు పంపారని ఏపీ పోలీసులపై, ఎన్డీఏ ప్రభుత్వంపై…
వాయిదాల పుకార్లు ఎన్ని తిరుగుతున్నా మా పని మాదే అన్న తరహాలో దసరా విడుదలని టార్గెట్ చేసుకున్న రెండు ప్యాన్…