Political News

హైకోర్ట్ తీర్పు .. గోడ దూకితే అంతే మరి

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాలు గడువు విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు పెట్టాలని శాసనసభ కార్యదర్శికి హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇరుపక్షాల వాదనలు గత నెల 7వ తేదీన విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచిన విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారడంతో పాటు సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి ఎంపీగా పోటీ చేశాడు. ఇక స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల మీద బీఆర్ఎస్ పార్టీ మొదట కోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది.

ఇక వీరి తర్వాత చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిల అనర్హత అంశం మీద కోర్టులో వాదనలు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాలలో నిర్ణయం తీసుకోవాలని, దానికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఒక వేళ రిపోర్ట్ సమర్పించని యొడల సుమోటోగా స్వీకరించి మరోసారి విచారణ చేస్తామని వెల్లడించింది. హైకోర్టు తీర్పు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది అన్నది వేచిచూడాలి.

This post was last modified on September 9, 2024 12:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

2 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

3 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

6 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

6 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

7 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

9 hours ago