ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా అనంతపురం. గత ఏడాది జగన్ సునామీలోనూ ఈ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో సైకిల్ పరుగులు తీసింది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ధర్మవరం సహా పలు నియోజకవర్గాలలో నాయకులు జంప్ చేసేశారు. దీంతో ఇక్కడ పార్టీని చక్కదిద్దడం అత్యంత అవసరం. దీనిని గమనించిన చంద్రబాబు.. తాజాగా అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం జిల్లా ఇంచార్జ్గా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు అవకాశం ఇచ్చారు. ఇది మంచి పరిణామమే. సౌమ్యుడు.. వివాద రహితుడు, అందరితోనూ సత్సంబంధాలు ఉన్న కాల్వ పరిపూర్ణంగా ఈ పదవికి తగిన నాయకుడే.
అయితే, ఈ విషయంలో పార్టీ నేతల మధ్య ఓ విషయంపై గుసగుస వినిపిస్తోంది. అనంతపురంలో రెండు కీలక రాజకీయ కుటుంబాలను చంద్రబాబు పక్కన పెట్టారని, కాల్వకు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక వ్యూహం వేరే ఉందని అంటున్నారు. నిజమే. ఈ జిల్లాలో టీడీపీకి రెండు కీలక కుటుంబాలు ఉన్నాయి. ఒకటి జేసీ, రెండు పరిటాల. తాజాగా ఎంపిక ఈ రెండు కుటుంబాలను బాబు పక్కన పెట్టి కాల్వ శ్రీనివాసులుకు కీలక బాధ్యత అప్పగించడంపై.. కొందరు నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. శ్రీనివాసులుకు వ్యతిరేకులు లేనప్పటికీ.. కొన్ని దశాబ్దాలుగా పరిటాల కుటుంబం పార్టీలో మమేకమైంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పక్కన పెట్టడం సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక, జేసీ దివాకర్రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు 2014కు ముందు పార్టీలోకి వచ్చినా.. పార్టీలో కీలకంగా నే ఉన్నారు. అయితే, ఇప్పుడు ఇచ్చిన పదవుల్లో వీరికి కూడా ప్రాధాన్యం లభించలేదు. దీంతో వీరిని పక్కన పెడుతున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, కాల్వ విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగానే అడుగులు వేశారని అంటున్నారు పరిశీలకులు.
జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గంపై మంచి పట్టుండడంతోపాటు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన జిల్లాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ఇస్తున్న ప్రతి పిలుపునకు స్పందిస్తున్నారు. ప్రభుత్వంపై నిర్వహిస్తున్న నిరసనల్లోనూ ఆయన పాలుపంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగానే కాల్వకు మంచి అవకాశం ఇచ్చారని అంటున్నారు. ఇలా.. అత్యంత కీలకమైన అనంతపురంలో నేతలు తాజా పరిణామాలపై చర్చిస్తుండడం గమనార్హం.
This post was last modified on September 29, 2020 10:42 am
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…