Political News

అనంత‌పురం టీడీపీలో కాల్వ మార్కు!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి కంచుకోట‌గా ఉన్న జిల్లాల్లో ప్ర‌థ‌మ స్థానంలో ఉన్న జిల్లా అనంత‌పురం. గ‌త ఏడాది జ‌గ‌న్ సునామీలోనూ ఈ జిల్లాలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో సైకిల్ ప‌రుగులు తీసింది. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ధ‌ర్మ‌వ‌రం స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌లో నాయ‌కులు జంప్ చేసేశారు. దీంతో ఇక్క‌డ పార్టీని చ‌క్క‌దిద్ద‌డం అత్యంత అవ‌స‌రం. దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. తాజాగా అనంత‌పురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం జిల్లా ఇంచార్జ్‌గా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు అవ‌కాశం ఇచ్చారు. ఇది మంచి ప‌రిణామ‌మే. సౌమ్యుడు.. వివాద ర‌హితుడు, అంద‌రితోనూ స‌త్సంబంధాలు ఉన్న కాల్వ ప‌రిపూర్ణంగా ఈ ప‌ద‌వికి త‌గిన నాయ‌కుడే.

అయితే, ఈ విష‌యంలో పార్టీ నేత‌ల మ‌ధ్య ఓ విష‌యంపై గుస‌గుస వినిపిస్తోంది. అనంత‌పురంలో రెండు కీల‌క రాజ‌కీయ కుటుంబాల‌ను చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టార‌ని, కాల్వ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం వెనుక వ్యూహం వేరే ఉంద‌ని అంటున్నారు. నిజ‌మే. ఈ జిల్లాలో టీడీపీకి రెండు కీల‌క కుటుంబాలు ఉన్నాయి. ఒక‌టి జేసీ, రెండు ప‌రిటాల‌. తాజాగా ఎంపిక ఈ రెండు కుటుంబాల‌ను బాబు ప‌క్క‌న పెట్టి కాల్వ శ్రీనివాసులుకు కీల‌క బాధ్య‌త అప్ప‌గించ‌డంపై.. కొంద‌రు నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. శ్రీనివాసులుకు వ్య‌తిరేకులు లేన‌ప్ప‌టికీ.. కొన్ని ద‌శాబ్దాలుగా ప‌రిటాల కుటుంబం పార్టీలో మ‌మేక‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆ కుటుంబాన్ని ప‌క్క‌న పెట్ట‌డం స‌రికాద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇక‌, జేసీ దివాక‌ర్‌రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డిలు 2014కు ముందు పార్టీలోకి వ‌చ్చినా.. పార్టీలో కీల‌కంగా నే ఉన్నారు. అయితే, ఇప్పుడు ఇచ్చిన ప‌ద‌వుల్లో వీరికి కూడా ప్రాధాన్యం ల‌భించ‌లేదు. దీంతో వీరిని ప‌క్క‌న పెడుతున్నారా? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక‌, కాల్వ విష‌యంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగానే అడుగులు వేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

జిల్లాలో రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంపై మంచి ప‌ట్టుండ‌డంతోపాటు ఓడిపోయిన త‌ర్వాత కూడా ఆయ‌న జిల్లాల్లో అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. చంద్ర‌బాబు ఇస్తున్న ప్ర‌తి పిలుపున‌కు స్పందిస్తున్నారు. ప్ర‌భుత్వంపై నిర్వ‌హిస్తున్న నిర‌స‌న‌ల్లోనూ ఆయ‌న పాలుపంచుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగానే కాల్వ‌కు మంచి అవ‌కాశం ఇచ్చార‌ని అంటున్నారు. ఇలా.. అత్యంత కీల‌క‌మైన అనంత‌పురంలో నేత‌లు తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 29, 2020 10:42 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

36 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago