Political News

మ‌రో ముప్పు: చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఏపీకి మ‌రో ముప్పు పొంచి ఉంద‌ని.. దీనిపై కూడా దృష్టి పెడుతున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. విజ‌య‌వాడ‌లో ఆదివారం రాత్రి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఉత్త‌రాంధ్ర జిల్లాలు కూడా ప్ర‌కృతి విల‌యానికి గుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం అందిన‌ట్టు చెప్పారు. విశాఖ‌ప‌ట్నం, అల్లూరి సీతారామ‌రాజు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని.. కొండ‌చ‌రియ‌లు విరిగి ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని స‌మాచారం అందిన‌ట్టు తెలిపారు.

ఈ నేప‌థ్యంలో కొండ ప్రాంతాల్లో ఉంటున్న‌వారిని అక్క‌డ నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించిన‌ట్టు సీఎం వివ‌రించారు. జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను కూడా అప్ర‌మ‌త్తం చేశామ‌న్నారు. ఏలేరు ప్రాజెక్టుకు వ‌రద ప్ర‌భావం పెరిగింద‌ని.. దీనివ‌ల్ల కాకినాడ జిల్లాకు కూడా ముప్పు పొంచి ఉంద‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆ జిల్లాలోనూ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. ఇక‌, తాజాగా విజ‌య‌వాడ‌, గుంటూరు, తెనాలి, నూజివీడు త‌దిత‌ర ప్రాంతాల్లో సంభ‌వించిన వ‌ర‌ద‌ల‌పై గ‌వ‌ర్న‌ర్‌కు కూడా నివేదిక స‌మ‌ర్పించిన‌ట్టు చెప్పారు.

ప్ర‌భుత్వం చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ సంతోషం వ్య‌క్తం చేసిన‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. అంతాపార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతోంద‌ని.. సోమ‌వారం నుంచి ఎన్యూమ‌రేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభి స్తున్న‌ట్టు తెలిపారు. బాధిత కుటుంబాల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందన్నారు. ఎన్యూమ‌రేష‌న్ ద్వారా వాస్త‌వ న‌ష్టం తెలుస్తంద‌న్నారు. దీంతో కేంద్రానికి మ‌రోసారి నివేదిక పంపించి.. పూర్తిస్థాయి న‌ష్టంపై ఒక అంచ‌నాకు వ‌స్తామ‌న్నారు.

వ‌ర‌ద త‌గ్గ‌లేదు…

విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద ప‌రిస్థితిపైనా చంద్ర‌బాబు స్పందించారు. శివారు ప్రాంతంలో ఇంకా వ‌ర‌ద త‌గ్గ‌లేద‌న్నారు. ఇంకా 0.51 టీఎంసీల వ‌ర‌ద నీరు నిలిచి ఉంద‌న్నారు. భారీ వ‌ర్షాలు రాక‌పోతే.. వ‌ర‌ద నీరు సోమ‌వారం సాయంత్రానికి త‌గ్గుతుంద‌ని తెలిపారు. ఇక‌, వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని.. దీని నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు వైద్య శిబిరాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.

This post was last modified on September 9, 2024 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

11 minutes ago

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

44 minutes ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

2 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

2 hours ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

3 hours ago

మారుతి అడ్రస్ ఛాలెంజ్… టోల్ మెటీరియల్ ఐపోయింది

సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…

4 hours ago