ఏపీకి మరో ముప్పు పొంచి ఉందని.. దీనిపై కూడా దృష్టి పెడుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా ప్రకృతి విలయానికి గురయ్యే అవకాశం ఉందని సమాచారం అందినట్టు చెప్పారు. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని సమాచారం అందినట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో ఉంటున్నవారిని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సీఎం వివరించారు. జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశామన్నారు. ఏలేరు ప్రాజెక్టుకు వరద ప్రభావం పెరిగిందని.. దీనివల్ల కాకినాడ జిల్లాకు కూడా ముప్పు పొంచి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలోనూ చర్యలు చేపట్టామన్నారు. ఇక, తాజాగా విజయవాడ, గుంటూరు, తెనాలి, నూజివీడు తదితర ప్రాంతాల్లో సంభవించిన వరదలపై గవర్నర్కు కూడా నివేదిక సమర్పించినట్టు చెప్పారు.
ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై గవర్నర్ అబ్దుల్ నజీర్ సంతోషం వ్యక్తం చేసినట్టు చంద్రబాబు తెలిపారు. అంతాపారదర్శకంగా జరుగుతోందని.. సోమవారం నుంచి ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రారంభి స్తున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందన్నారు. ఎన్యూమరేషన్ ద్వారా వాస్తవ నష్టం తెలుస్తందన్నారు. దీంతో కేంద్రానికి మరోసారి నివేదిక పంపించి.. పూర్తిస్థాయి నష్టంపై ఒక అంచనాకు వస్తామన్నారు.
వరద తగ్గలేదు…
విజయవాడలో వరద పరిస్థితిపైనా చంద్రబాబు స్పందించారు. శివారు ప్రాంతంలో ఇంకా వరద తగ్గలేదన్నారు. ఇంకా 0.51 టీఎంసీల వరద నీరు నిలిచి ఉందన్నారు. భారీ వర్షాలు రాకపోతే.. వరద నీరు సోమవారం సాయంత్రానికి తగ్గుతుందని తెలిపారు. ఇక, వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. దీని నుంచి ప్రజలను రక్షించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
This post was last modified on September 9, 2024 10:22 am
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…