ఏపీకి మరో ముప్పు పొంచి ఉందని.. దీనిపై కూడా దృష్టి పెడుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా ప్రకృతి విలయానికి గురయ్యే అవకాశం ఉందని సమాచారం అందినట్టు చెప్పారు. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని సమాచారం అందినట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో ఉంటున్నవారిని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సీఎం వివరించారు. జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశామన్నారు. ఏలేరు ప్రాజెక్టుకు వరద ప్రభావం పెరిగిందని.. దీనివల్ల కాకినాడ జిల్లాకు కూడా ముప్పు పొంచి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలోనూ చర్యలు చేపట్టామన్నారు. ఇక, తాజాగా విజయవాడ, గుంటూరు, తెనాలి, నూజివీడు తదితర ప్రాంతాల్లో సంభవించిన వరదలపై గవర్నర్కు కూడా నివేదిక సమర్పించినట్టు చెప్పారు.
ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై గవర్నర్ అబ్దుల్ నజీర్ సంతోషం వ్యక్తం చేసినట్టు చంద్రబాబు తెలిపారు. అంతాపారదర్శకంగా జరుగుతోందని.. సోమవారం నుంచి ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రారంభి స్తున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందన్నారు. ఎన్యూమరేషన్ ద్వారా వాస్తవ నష్టం తెలుస్తందన్నారు. దీంతో కేంద్రానికి మరోసారి నివేదిక పంపించి.. పూర్తిస్థాయి నష్టంపై ఒక అంచనాకు వస్తామన్నారు.
వరద తగ్గలేదు…
విజయవాడలో వరద పరిస్థితిపైనా చంద్రబాబు స్పందించారు. శివారు ప్రాంతంలో ఇంకా వరద తగ్గలేదన్నారు. ఇంకా 0.51 టీఎంసీల వరద నీరు నిలిచి ఉందన్నారు. భారీ వర్షాలు రాకపోతే.. వరద నీరు సోమవారం సాయంత్రానికి తగ్గుతుందని తెలిపారు. ఇక, వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. దీని నుంచి ప్రజలను రక్షించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
This post was last modified on September 9, 2024 10:22 am
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…