విజయవాడ అంటే.. వాణిజ్య కేంద్రం. విజయవాడ అంటే.. అన్ని రకాల వ్యాపారాలకు కేంద్రం. దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం గతం కొన్నాళ్లుగా పుంజుకుంటోంది. ముఖ్యంగా నగరంలో పరిస్థితి ఎలా ఉన్నా.. నున్న మార్గంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్-గన్నవరం ఫ్లైవోవర్.. హైదరాబాద్- ఏలూరు ఇన్నర్ రోడ్డు కారణంగా.. శివారులో ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంది. ఎటు చూసినా.. బహుళ అంతస్థులు కనిపిస్తున్నాయి.
ఇక, రాజకీయ నాయకులు.. పారిశ్రామిక వేత్తలు కూడా రైతుల నుంచి పొలాలు కొనుగోలు.. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా.. రామవరప్పాడు ఫ్లైవోవర్ దిగువన కూడా భారీ ఎత్తున విల్లాలు, అపార్ట్మెంటులు నిర్మించారు. నిర్మిస్తున్నారు కూడా. ఇక, సింగ్నగర్కు సమీపంలో నందమూరి నగర్లోనూ విల్లాలు, అపార్ట్మెంటులు జోరుగా వెలిశాయి. మొత్తంగా చూస్తే.. రాజధాని అమరావతి కారణంగా విజయవాడ విస్తరణ అయితే పెరిగింది. గన్నవరం ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉండడంతో ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది.
అపార్ట్మెంటు ఫ్లాట్లు 35-40 లక్షల మధ్య ఉన్నవి ఇటీవల సర్కారు మారిన తర్వాత.. ఏకంగా 60 లక్షలకు వెళ్లాయి. ఇక, 1.5 కోట్లు ఉన్న విల్లాలు.. రూ.3 కోట్లకు చేరాయి. ముఖ్యంగా ఉద్యోగులు.. మధ్య తరగతి ప్రజ లు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇదిమంచిదే. తద్వారా నగర విస్తరణ పెరిగి పెరుగుతున్న జనాభాకు ఆవాసం ఏర్పడుతోంది. అయితే.. ఇక్కడే ఇప్పుడు బుడమేరు వరద పొంగింది. నడుములోతు నుంచి నిలువెత్తు వరదలు సంభవించాయి. దీంతో శివారు ప్రాంతం మొత్తం మునిగిపోయింది.
ఈ ప్రభావం ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్పై భారీగా పడిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకం టే.. వందల కొద్దీ ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బడమేరు ముప్పు ఉందన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఫలితంగా మునిగిపోయిన అపార్ట్మెంట్లు, విల్లాలను ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలు మీడియాలో ప్రముఖంగా వస్తుండడంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఘోరంగా పడిపోవడం ఖాయమని అంటున్నారు. ఏదేమైనా.. బుడమేరు తంటాతో అన్ని వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
This post was last modified on September 9, 2024 4:18 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…