ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్కు చెందిన జయభేరి నిర్మాణ సంస్థకు సంబంధించి రంగలాల్ కుంటలో నిర్మించిన అపార్ట్మెంటుకు హైడ్రా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శనివారం మధ్యా హ్నమే ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆదివారం ముర ళీ మోహన్ స్పందించారు. తమ నిర్మాణాలు న్యాయ సమ్మతమేనని.. ఆక్రమణలు జరిగి ఉంటే.. తమే కూలుస్తామని ఆయన స్పష్టం చేశారు.
రంగలాల్ కుంట చెరువు సమీపంలో నిర్మించిన జయభేరి అపార్ట్మెంటు బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్న మాట వాస్తవమేనని.. దీనికోసం హైడ్రా రావాల్సిన అవసరం లేదని మురళీ మోహన్ తెలిపారు. దీనిని తామే కూల్చి వేస్తామన్నారు. తాము ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని చెప్పారు. నిబంధనల ప్రకారం తాము నడుచుకుంటున్నట్టు మురళీ మోహన్ తెలిపారు.
నోటీసుల్లో ఏముంది?
జయభేరి సంస్థకు హైడ్రా ఇచ్చిన నోటీసుల్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ లో ఈ సంస్థ నిర్మాణాలు చేసిందని.. ఇవి నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు స్పష్టం చేశారు. మీరు కూల్చకపోతే.. మేమే 15 రోజుల్లో సదరు నిర్మాణాలను కూల్చి వేస్తామని తెలిపారు. దీంతో మురళీ మోహన్ తామే కూల్చి వేస్తామని పేర్కొన్నారు.
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…