ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్కు చెందిన జయభేరి నిర్మాణ సంస్థకు సంబంధించి రంగలాల్ కుంటలో నిర్మించిన అపార్ట్మెంటుకు హైడ్రా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శనివారం మధ్యా హ్నమే ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆదివారం ముర ళీ మోహన్ స్పందించారు. తమ నిర్మాణాలు న్యాయ సమ్మతమేనని.. ఆక్రమణలు జరిగి ఉంటే.. తమే కూలుస్తామని ఆయన స్పష్టం చేశారు.
రంగలాల్ కుంట చెరువు సమీపంలో నిర్మించిన జయభేరి అపార్ట్మెంటు బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్న మాట వాస్తవమేనని.. దీనికోసం హైడ్రా రావాల్సిన అవసరం లేదని మురళీ మోహన్ తెలిపారు. దీనిని తామే కూల్చి వేస్తామన్నారు. తాము ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని చెప్పారు. నిబంధనల ప్రకారం తాము నడుచుకుంటున్నట్టు మురళీ మోహన్ తెలిపారు.
నోటీసుల్లో ఏముంది?
జయభేరి సంస్థకు హైడ్రా ఇచ్చిన నోటీసుల్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ లో ఈ సంస్థ నిర్మాణాలు చేసిందని.. ఇవి నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు స్పష్టం చేశారు. మీరు కూల్చకపోతే.. మేమే 15 రోజుల్లో సదరు నిర్మాణాలను కూల్చి వేస్తామని తెలిపారు. దీంతో మురళీ మోహన్ తామే కూల్చి వేస్తామని పేర్కొన్నారు.
This post was last modified on September 8, 2024 2:08 pm
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. పాలనా పరంగా…
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…