Political News

హైడ్రాతో ప‌నిలేదు..మేమే కూలుస్తాం: ముర‌ళీ మోహ‌న్‌

ప్ర‌ముఖ సినీ న‌టుడు ముర‌ళీ మోహ‌న్‌కు చెందిన జ‌య‌భేరి నిర్మాణ సంస్థ‌కు సంబంధించి రంగ‌లాల్ కుంట‌లో నిర్మించిన అపార్ట్‌మెంటుకు హైడ్రా నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. శ‌నివారం మ‌ధ్యా హ్నమే ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆదివారం ముర ళీ మోహ‌న్ స్పందించారు. త‌మ నిర్మాణాలు న్యాయ స‌మ్మ‌త‌మేన‌ని.. ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగి ఉంటే.. త‌మే కూలుస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

రంగ‌లాల్ కుంట చెరువు స‌మీపంలో నిర్మించిన జ‌య‌భేరి అపార్ట్‌మెంటు బఫర్‌ జోన్‌ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్‌ ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని.. దీనికోసం హైడ్రా రావాల్సిన అవ‌స‌రం లేద‌ని ముర‌ళీ మోహ‌న్ తెలిపారు. దీనిని తామే కూల్చి వేస్తామ‌న్నారు. తాము ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని చెప్పారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం తాము న‌డుచుకుంటున్న‌ట్టు ముర‌ళీ మోహ‌న్ తెలిపారు.

నోటీసుల్లో ఏముంది?

జ‌య‌భేరి సంస్థ‌కు హైడ్రా ఇచ్చిన నోటీసుల్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ లోని రంగలాల్‌ కుంట చెరువులో ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌, బఫర్‌ జోన్ లో ఈ సంస్థ నిర్మాణాలు చేసింద‌ని.. ఇవి నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని పేర్కొన్నారు. ఈ నిర్మాణాల‌ను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు స్ప‌ష్టం చేశారు. మీరు కూల్చ‌క‌పోతే.. మేమే 15 రోజుల్లో స‌ద‌రు నిర్మాణాల‌ను కూల్చి వేస్తామ‌ని తెలిపారు. దీంతో ముర‌ళీ మోహ‌న్ తామే కూల్చి వేస్తామ‌ని పేర్కొన్నారు.

This post was last modified on September 8, 2024 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

4 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago