ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్కు చెందిన జయభేరి నిర్మాణ సంస్థకు సంబంధించి రంగలాల్ కుంటలో నిర్మించిన అపార్ట్మెంటుకు హైడ్రా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శనివారం మధ్యా హ్నమే ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆదివారం ముర ళీ మోహన్ స్పందించారు. తమ నిర్మాణాలు న్యాయ సమ్మతమేనని.. ఆక్రమణలు జరిగి ఉంటే.. తమే కూలుస్తామని ఆయన స్పష్టం చేశారు.
రంగలాల్ కుంట చెరువు సమీపంలో నిర్మించిన జయభేరి అపార్ట్మెంటు బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్న మాట వాస్తవమేనని.. దీనికోసం హైడ్రా రావాల్సిన అవసరం లేదని మురళీ మోహన్ తెలిపారు. దీనిని తామే కూల్చి వేస్తామన్నారు. తాము ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని చెప్పారు. నిబంధనల ప్రకారం తాము నడుచుకుంటున్నట్టు మురళీ మోహన్ తెలిపారు.
నోటీసుల్లో ఏముంది?
జయభేరి సంస్థకు హైడ్రా ఇచ్చిన నోటీసుల్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ లో ఈ సంస్థ నిర్మాణాలు చేసిందని.. ఇవి నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు స్పష్టం చేశారు. మీరు కూల్చకపోతే.. మేమే 15 రోజుల్లో సదరు నిర్మాణాలను కూల్చి వేస్తామని తెలిపారు. దీంతో మురళీ మోహన్ తామే కూల్చి వేస్తామని పేర్కొన్నారు.
This post was last modified on September 8, 2024 2:08 pm
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…