Political News

పురందేశ్వ‌రిలో అసంతృప్తి సెగ‌.. రీజ‌న్ ఏంటి?

రాజ‌కీయాల్లో నేత‌ల‌కు చిత్ర‌మైన మ‌న‌స్త‌త్వం ఉంటుంది. ఎలాంటి గుర్తింపు లేన‌ప్పుడు.. త‌మ‌కు అస‌లు గుర్తింపే లేద‌ని వాపోతారు. ఇన్నాళ్ల‌యినా.. పార్టీ మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోలేదు.. అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తారు. పోనీ..పార్టీలు ఏదో ఒక ప‌ద‌వి ఇస్తే.. దాంతో సంతృప్తి చెందే నేత‌లు కూడా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఎంత క‌ష్ట‌పడినా ఇంతే గుర్తింపా? అని అని నోరెళ్లబెట్టే నాయ‌కులు కూడా క‌నిపిస్తున్నాయి. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. ప్ర‌తి పార్టీలోనూ అసంతృప్త నేత‌లు లెక్క‌కు మిక్కిలిగానే ఉన్నారు.

తాజాగా బీజేపీలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి తెర‌మీదికి వ‌చ్చింది. రాష్ట్ర బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టి సోము వీర్రాజు త‌న క‌మిటీని ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి వంటి సీనియ‌ర్ నాయకురాలికి ప‌ద‌వి ద‌క్క‌లేదు. దీంతో ఆమె తీవ్రంగా త‌ల్ల‌డిల్లిపోయారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న కుటుంబాన్ని పార్టీ ప‌క్క‌న పెట్టింద‌నే విమ‌ర్శ‌లు ఆమె ఆఫ్‌ది రికార్డుగా వినిపించారు. స‌రే! ఇంత‌లోనే బీజేపీ జాతీయ క‌మిటీలో పురందేశ్వ‌రికి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టు ద‌క్కింది.

నిజానికి బీజేపీ జాతీయ క‌మిటీలో చోటు అంటే.. మంచి గుర్తింపే ఉంటుంది. 70 మందితో ఏర్పాటైన ఈ క‌మిటీలో పురందేశ్వ‌రి చోటు ద‌క్కించుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆమె అసంతృప్తితో ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. బీజేపీలో కోరుకున్న‌ది ఒక‌టి.. జ‌రిగింది మ‌రొక‌టి.. అని ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. నిజ‌మే. కాంగ్రెస్‌లో ఉన్న స‌మ‌యంలో అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఆమెకు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. అదేస‌మ‌యంలో వ‌రుస విజ‌యాలు ఆమెలో జోష్ పెంచాయి.

కానీ, బీజేపీలోకి వ‌చ్చాక‌.. వ‌రుస ఓట‌ములు ప‌ల‌క‌రించాయి. 2014లో రాజంపేట ఎంపీగా, 2019లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈ క్ర‌మంలో త‌న‌కు రాజ్య‌స‌భ టికెట్ ఇవ్వాల‌నేది పురందేశ్వ‌రి అభ్య‌ర్థ‌న‌. దీనిపై ఆమె కేంద్రంలోని పెద్ద‌ల‌ను కూడా క‌లిసి ఇప్ప‌టికే అభ్య‌ర్ధించారు. లేదా నామినేటెడ్ ప‌ద‌వి అయినా అప్ప‌గించాల‌ని కోరుతున్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అడుగులు ముందుకు ప‌డ‌క‌పోగా.. ఇప్పుడు జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. దీనిపై పైకి సంతోషంగా ఉన్న‌ప్ప‌టికీ.. లోలోన మాత్రం పురందేశ్వ‌రి.. కోరిన ప‌ద‌వి ద‌క్కనందుకు కుమిలిపోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

తారక్ & త్రివిక్రమ్… యుద్ధం మొదలుకానుంది

అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…

29 minutes ago

ఇరుముడికి పొంచి ఉన్న రెండు ముప్పులు

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…

1 hour ago

సూర్య సరైన దారిలోకి వచ్చినట్టే

ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…

2 hours ago

తూచ్… అమరావతికి వ్యతిరేకమని జగన్ చెప్పలేదా?

అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…

4 hours ago

పోటీ పడుతున్న తెలుగు వెబ్ సిరీసులు

కరోనా తర్వాత ఫ్యామిలీ మ్యాన్, మిర్జాపూర్, స్కామ్ 1992 లాంటి బ్లాక్ బస్టర్స్ వల్ల కొంత కాలం వెబ్ సిరీస్…

6 hours ago

పెద్ది OTT… తొందరపడటం లేదు

మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా నెట్ ఫ్లిక్స్ చేసుకునే ఓటిటి విండో 28 రోజులు ఉంటుంది. గుంటూరు కారం,…

7 hours ago