టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే ఆదిమూలం
పై వచ్చిన ఆరోపణలతో రాజకీయంగా వైసీపీ పుంజుకునే అవకాశం వచ్చిందనే చర్చ జరిగింది. నిన్న మొన్నటి వరకు.. వైసీపీ నాయకులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీ వంతు వచ్చిందని.. వైసీపీ నాయకులు నోటికి పని చెబుతారని భావించారు. కానీ, వైసీపీ చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు. ఒకవైపు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రాధాన్యం ఇస్తూనే.. మరోవైపు రాజకీయ దుమారం రేగకుండా చర్యలు తీసుకున్నారు.
ఆరోపణలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా.. ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు.. ఆయనపై విచారణకు స్వతంత్రంగా పార్టీ తరఫున ఒక కమిటీని నియమించారు. దీంతో ఇప్పుడు వైసీపికి పనిలేకుండా పోయింది. కానీ, గతంలో దాదాపు ఇలాంటి ఆరోపణలే.. వైసీపీ నేతలపైనా వచ్చాయి. అప్పటి మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావుపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, వారిపై చర్యలు తీసుకోలేదు.
గంట-అరగంట వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. అయినా.. అప్పట్లో సీఎం జగన్ వీటిని పట్టిం చుకోలేదు. కనీసం నాయకులను హెచ్చరించిన సందర్భాలు కూడా లేవు. అంతర్గతంగా అయినా.. చర్యలు తీసుకున్నారా? అంటే అది కూడా లేదు. ఇక, అప్పటి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఏకంగా న్యూడ్ వీడితో కలకలం రేపారు. దీనిపైనా చర్యలు తీసుకోలేదు. పైగా.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనను సమర్థిస్తూ.. మాట్లాడారు. ఇక, ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం ఎంత తక్కువ చెబితే అంత మంచిది.
ఇలా.. వైసీపీ నాడు అనేక ఆరోపణలువచ్చినా.. నాయకులను వెనుకేసుకు వచ్చిందే తప్ప.. ఎక్కడా వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలే లేకుండా పోయాయి. దీనికితోడు కనీసం వారి గురించి జగన్ కూడా ఎక్కడా సీరియస్ కాలేదు. కానీ, ఇప్పుడు ఘటనలో మాత్రం చంద్రరాబు వెంటనే రియాక్ట్ కావడంతోపా టు.. ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేయడం వంటివి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకపోగా.. రాజకీయంగా కూడా ఆయన గ్రాఫ్ను పెంచాయి.
This post was last modified on September 7, 2024 11:01 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…