టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే ఆదిమూలం
పై వచ్చిన ఆరోపణలతో రాజకీయంగా వైసీపీ పుంజుకునే అవకాశం వచ్చిందనే చర్చ జరిగింది. నిన్న మొన్నటి వరకు.. వైసీపీ నాయకులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీ వంతు వచ్చిందని.. వైసీపీ నాయకులు నోటికి పని చెబుతారని భావించారు. కానీ, వైసీపీ చంద్రబాబు ఛాన్స్ ఇవ్వలేదు. ఒకవైపు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రాధాన్యం ఇస్తూనే.. మరోవైపు రాజకీయ దుమారం రేగకుండా చర్యలు తీసుకున్నారు.
ఆరోపణలు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా.. ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు.. ఆయనపై విచారణకు స్వతంత్రంగా పార్టీ తరఫున ఒక కమిటీని నియమించారు. దీంతో ఇప్పుడు వైసీపికి పనిలేకుండా పోయింది. కానీ, గతంలో దాదాపు ఇలాంటి ఆరోపణలే.. వైసీపీ నేతలపైనా వచ్చాయి. అప్పటి మంత్రులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావుపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, వారిపై చర్యలు తీసుకోలేదు.
గంట-అరగంట వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. అయినా.. అప్పట్లో సీఎం జగన్ వీటిని పట్టిం చుకోలేదు. కనీసం నాయకులను హెచ్చరించిన సందర్భాలు కూడా లేవు. అంతర్గతంగా అయినా.. చర్యలు తీసుకున్నారా? అంటే అది కూడా లేదు. ఇక, అప్పటి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఏకంగా న్యూడ్ వీడితో కలకలం రేపారు. దీనిపైనా చర్యలు తీసుకోలేదు. పైగా.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనను సమర్థిస్తూ.. మాట్లాడారు. ఇక, ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం ఎంత తక్కువ చెబితే అంత మంచిది.
ఇలా.. వైసీపీ నాడు అనేక ఆరోపణలువచ్చినా.. నాయకులను వెనుకేసుకు వచ్చిందే తప్ప.. ఎక్కడా వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలే లేకుండా పోయాయి. దీనికితోడు కనీసం వారి గురించి జగన్ కూడా ఎక్కడా సీరియస్ కాలేదు. కానీ, ఇప్పుడు ఘటనలో మాత్రం చంద్రరాబు వెంటనే రియాక్ట్ కావడంతోపా టు.. ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేయడం వంటివి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకపోగా.. రాజకీయంగా కూడా ఆయన గ్రాఫ్ను పెంచాయి.
This post was last modified on September 7, 2024 11:01 am
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…