టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వైసీపీ నాయకుల కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన దగ్గర కూడా రెడ్ బుక్ ఉందని.. దానిలో 100 మంది పేర్లు ఉన్నాయని.. ప్రతి ఒక్కరి సంగతి తేలుస్తానని తేల్చి చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ నాయకులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇబ్బంది పడతారు. ఎందుకు పడరనుకుంటున్నారు మీరు? అని ప్రశ్నించారు. అన్యాయంగా కేసులు పెట్టి తమను ఇరికించారని తెలిపారు.
నేను ఎవరినీ ఇబ్బంది పెట్టనని చెప్పినానా.. అధికారంలోకి వస్తే.. తోలు తీస్తానని చెప్పినా కదా! ఇప్పుడు ఎందుకు చేయను. మంచి తనం చూపిస్తానని అనుకుంటున్నారా మీ దగ్గర? అని అఖిల ప్రియ ప్రశ్నించా రు. వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు.. ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారని, ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నారని ఆమె అన్నారు. అలాంటి వారిని ఎందుకు వదిలేస్తానని ప్రశ్నించారు. ఒక్కొక్కరికీ లెక్క చెబుతానని చెప్పా. చెప్పి తీరుతా! అని వ్యాఖ్యానించారు.
నేను వదిలేస్తానని చెప్పలేదని.. నేను మంచిదాన్నని కూడా చెప్పలేదని.. తప్పు చేసిన వాళ్లు భయ పడాల్సిందేనని వ్యాఖ్యానించారు. తప్పు చేయని వారి జోలికి తాను రానన్నారు. నా దగ్గర కూడా రెడ్ బుక్ ఉంది. దీనిలో మీ(వైసీపీ నేతలు) పేర్లన్నీ ఉన్నయ్. 100 మందికి పైగానే ఉన్నాయి. కొందరివి ఎందుకులే అని తీసేశా అని అఖిల ప్రియ తెలిపారు. ఓపెన్గా చెబుతున్నా.. నా వల్ల 100 మంది ఇబ్బందులు పడబోతున్నారు. చట్ట ప్రకారమే వారిపై చర్యలు తీసుకుంటా అని అన్నారు.
కాగా.. అఖిల ప్రియ గత చంద్రబాబు హయాంలో మంత్రిగా వ్యవహరించారు. గత 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ భూములకు సంబంధించి ఆమె కేసులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత.. స్థానికంగా ఏవీ సుబ్బారెడ్డితోనూ ఆమె వివాదాలు కొనసాగాయి. తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఆమె.. మంత్రి సీటు కోసం ప్రయత్నించారు. కానీ, దక్కలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తొలిసారి అఖిల ప్రియ మీడియా ముందుకు రావడం ఇదే!
This post was last modified on September 7, 2024 10:57 am
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…