Political News

పొలిటిక‌ల్ టాక్‌- జ‌గ‌న్ కంటే ష‌ర్మిల న‌యం

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ చాలా చాలా వెనుక‌బ‌డి పోయారు. 11 మంది ఎమ్మెల్యేలు, 13 మం ది ఎంపీలను కూడా ఉంచుకుని.. అస‌లు ఎలాంటి చ‌ట్ట స‌భ స‌భ్యులు లేని ష‌ర్మిల కంటే చాలా చాలా వెనుక బ‌డిపోయార‌ని అంటున్నారు రాజ‌కీయ నేత‌లు.

ఇదేదో పాత ముచ్చ‌ట కాదు. తాజా సంఘ‌ట‌నే. విజ‌య‌వాడ‌లో వ‌ర‌దల కార‌ణంగా.. ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు. వారిని ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్‌, ష‌ర్మిల కూడా.. వెళ్లివ‌చ్చారు. అయితే.. ఆ త‌ర్వాత జ‌గ‌న్ చేతులు ముడుచుకుని కూర్చున్నారు.

కానీ, ష‌ర్మిల అలా కూర్చోలేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. శుక్ర‌వారం సాయంత్రం ఆమె కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు ఇదేస‌మ‌యంలో రైల్వే శాఖ‌కు కూడా లేఖ సంధించారు. రైల్వే శాఖ వారు అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే రైల్ నీరు అందిస్తున్నారు.. దీనిని ప్ర‌యాణికుల‌కే కాకుండా.. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని వారికి పంపిణీ చేయండి. ఉచితంగా ఇవ్వండి. దీనివ‌ల్ల ప్ర‌భుత్వానికి అంతో ఇంతో సాయం చేసిన‌ట్టు అవుతుంది అని ష‌ర్మిల లేఖ రాశారు.

అదేస‌మ‌యంలో కేంద్రానికి కూడా ఆమె లేఖ రాశారు. త‌క్ష‌ణ‌మే రాష్ట్రానికి సాయం చేయాల‌ని, ఆర్థికంగా నే కాకుండా వ‌స్తు రూపంలోనూ సాయం అందించాల‌ని ష‌ర్మిల కోరారు. కేంద్ర ప్ర‌భుత్వ అధికారులు వ‌చ్చి చూసి వెళ్లే దాకా బాధితులు క‌ష్టాల్లోనే ఉండాలా? ముందుకు త‌క్ష‌ణ సాయం చేసి.. త‌ర్వాత మిగిలింది ఇవ్వాల‌ని ఆమె కోరారు. నిజానికి గురువార‌మే ఆమె లేఖ రాశారు. శుక్ర‌వారం మ‌రోసారి అటురైల్వేకు, ఇటు కేంద్రానికి కూడా రాశారు.

అయితే.. జ‌గ‌న్ ఈ విష‌యంలోనూ విఫ‌ల‌మ‌య్యార‌న్న వాద‌న వినిపిస్తోంది. కేంద్రానికి ఒక్క లేఖ కూడా ఆయ‌న రాయ‌లేక పోయారు. తాను సాయం చేయ‌క‌పోతే పోనీ.. క‌నీసం.. ఇక్క‌డి ప‌రిస్థితిని వివ‌రిస్తూ.. కేంద్రానికి ఒక లేఖ రాసి.. త‌న‌కు ఉన్న ప‌రిచ‌యాల‌తో సాయిరెడ్డి వంటివారిని రంగంలోకి దింపి.. కేంద్ర పెద్ద‌ల దృష్టికి ఏపీ ప‌రిస్థితిని వివ‌రించి ఉంటే.. ఆ రేంజ్ వేరేగా ఉండేది. కానీ, ష‌ర్మిల‌తో పోల్చుకుంటే.. ఈ విష‌యంలోనూ జ‌గ‌న్ చాలా వెనుక‌బ‌డి పోయార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 7, 2024 10:49 am

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

19 minutes ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

30 minutes ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

4 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

5 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

5 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

5 hours ago