Political News

రూ.3300 కోట్లు.. పుకార్ మాత్ర‌మే

ఏపీలో చుట్టుముట్టిన వ‌ర‌ద‌లు.. భారీ వ‌ర్షాల కార‌ణంగా విజ‌య‌వాడ‌, గుంటూరు, ఏలూరు త‌దిత‌ర ప్రాంతా ల్లో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం సాయం చేస్తున్నా.. బాధితుల‌కు ఇంకా మెరుగై న వ‌స‌తులు క‌ల్పించాల్సి ఉంది. దీంతో స‌హ‌జంగానే రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రంపై ఆశ‌లు పెట్టుకుంటుం ది. పైగా పొత్తులో ఉన్న పార్టీ కావ‌డంతో చంద్ర‌బాబు ఆశ‌లు పెట్టుకోవ‌డంలో త‌ప్పులేదు. అయితే.. ఇప్ప‌టికే కేంద్రం సాయంచేసిందని ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. పురందేశ్వ‌రి ప్ర‌క‌టించారు.

రెండు తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపి రూ.3300 కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తాత్కాలిక సాయం ఇచ్చింద‌ని పురందేశ్వ‌రి త‌న సోష‌ల్ మీడియా ఖాతా ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు ప‌డుతున్న త‌ప‌న‌కు కేంద్రం స్పందించింద‌ని అనుకున్నారు. కానీ, పురందేశ్వ‌రి చేసిన ప్ర‌క‌ట‌న అనంత‌రం.. చంద్ర‌బాబు మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కేంద్రం నుంచి త‌మ‌కు రూపాయి సాయం కూడా రాలేద‌ని చెప్పారు.

తాము సాయం కోసం ఎదురు చూస్తున్నామ‌ని.. కానీ, కేంద్రం నుంచి ఇంకా రూపాయి కూడా రాలేద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. పురందేశ్వ‌రి చేసిన ట్వీట్‌ను కూడా ప్ర‌స్తావించారు. రూ.3300 కోట్లు ఇచ్చార‌న్న ప్ర‌చారం వాస్త‌వం కాద‌ని.. పుకార్ మాత్ర‌మేన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాము వ‌ర‌ద న‌ష్టంపై ఇంకా ఒక అంచ‌నాకు రాలేద‌ని.. ప్రాథ‌మికంగా మాత్ర‌మే కొంత అంచ‌నాకు వ‌చ్చామ‌ని ఆయ‌న చెప్పారు. దీనిని పంపించిన త‌ర్వాతే.. సాయం అందుతుంద‌ని భావిస్తున్నామ‌న్నారు.

ఈ మ‌ధ్య‌లోనే సాయం చేశారంటూ.. జ‌రుగుతున్న ప్ర‌చారం స‌రికాద‌న్నారు. దీంతో పురందేశ్వ‌రి ప్ర‌క‌ట‌న‌, చంద్ర‌బాబు కామెంట్లు రెండూ కూడా సాయం విష‌యంలో స‌మ‌న్వ‌య లోపాన్ని ఎత్తి చూపిన‌ట్టు తెలు స్తోంది. కేంద్రం నుంచి సాయం అందితే.. ముందుగా ప్ర‌బుత్వానికి సమాచారం వ‌స్తుంది. పోనీ.. దీనికంటే ముందుగానే బీజేపీనాయ‌కురాలు కాబ‌ట్టి పురందేశ్వ‌రికి స‌మాచారం అందింద‌ని అనుకున్నా.. త‌ర్వాత గంట‌కైనా.. స‌ర్కారుకు స‌మాచారం రావాలి. అలా జ‌ర‌గ‌లేదు. పైగా సీఎం చంద్ర‌బాబే దీనిని ఖండించ‌డంతో సాయం విష‌యంలో స‌మ‌న్వ‌య‌లోపం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

This post was last modified on September 7, 2024 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

7 minutes ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

58 minutes ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

1 hour ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

1 hour ago

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

5 hours ago

బల పరీక్షలో నెగ్గిన విజయ్… కానీ…

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…

5 hours ago