Political News

రూ.3300 కోట్లు.. పుకార్ మాత్ర‌మే

ఏపీలో చుట్టుముట్టిన వ‌ర‌ద‌లు.. భారీ వ‌ర్షాల కార‌ణంగా విజ‌య‌వాడ‌, గుంటూరు, ఏలూరు త‌దిత‌ర ప్రాంతా ల్లో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం సాయం చేస్తున్నా.. బాధితుల‌కు ఇంకా మెరుగై న వ‌స‌తులు క‌ల్పించాల్సి ఉంది. దీంతో స‌హ‌జంగానే రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రంపై ఆశ‌లు పెట్టుకుంటుం ది. పైగా పొత్తులో ఉన్న పార్టీ కావ‌డంతో చంద్ర‌బాబు ఆశ‌లు పెట్టుకోవ‌డంలో త‌ప్పులేదు. అయితే.. ఇప్ప‌టికే కేంద్రం సాయంచేసిందని ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. పురందేశ్వ‌రి ప్ర‌క‌టించారు.

రెండు తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపి రూ.3300 కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తాత్కాలిక సాయం ఇచ్చింద‌ని పురందేశ్వ‌రి త‌న సోష‌ల్ మీడియా ఖాతా ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు ప‌డుతున్న త‌ప‌న‌కు కేంద్రం స్పందించింద‌ని అనుకున్నారు. కానీ, పురందేశ్వ‌రి చేసిన ప్ర‌క‌ట‌న అనంత‌రం.. చంద్ర‌బాబు మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కేంద్రం నుంచి త‌మ‌కు రూపాయి సాయం కూడా రాలేద‌ని చెప్పారు.

తాము సాయం కోసం ఎదురు చూస్తున్నామ‌ని.. కానీ, కేంద్రం నుంచి ఇంకా రూపాయి కూడా రాలేద‌ని చెప్పిన చంద్ర‌బాబు.. పురందేశ్వ‌రి చేసిన ట్వీట్‌ను కూడా ప్ర‌స్తావించారు. రూ.3300 కోట్లు ఇచ్చార‌న్న ప్ర‌చారం వాస్త‌వం కాద‌ని.. పుకార్ మాత్ర‌మేన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాము వ‌ర‌ద న‌ష్టంపై ఇంకా ఒక అంచ‌నాకు రాలేద‌ని.. ప్రాథ‌మికంగా మాత్ర‌మే కొంత అంచ‌నాకు వ‌చ్చామ‌ని ఆయ‌న చెప్పారు. దీనిని పంపించిన త‌ర్వాతే.. సాయం అందుతుంద‌ని భావిస్తున్నామ‌న్నారు.

ఈ మ‌ధ్య‌లోనే సాయం చేశారంటూ.. జ‌రుగుతున్న ప్ర‌చారం స‌రికాద‌న్నారు. దీంతో పురందేశ్వ‌రి ప్ర‌క‌ట‌న‌, చంద్ర‌బాబు కామెంట్లు రెండూ కూడా సాయం విష‌యంలో స‌మ‌న్వ‌య లోపాన్ని ఎత్తి చూపిన‌ట్టు తెలు స్తోంది. కేంద్రం నుంచి సాయం అందితే.. ముందుగా ప్ర‌బుత్వానికి సమాచారం వ‌స్తుంది. పోనీ.. దీనికంటే ముందుగానే బీజేపీనాయ‌కురాలు కాబ‌ట్టి పురందేశ్వ‌రికి స‌మాచారం అందింద‌ని అనుకున్నా.. త‌ర్వాత గంట‌కైనా.. స‌ర్కారుకు స‌మాచారం రావాలి. అలా జ‌ర‌గ‌లేదు. పైగా సీఎం చంద్ర‌బాబే దీనిని ఖండించ‌డంతో సాయం విష‌యంలో స‌మ‌న్వ‌య‌లోపం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

This post was last modified on September 7, 2024 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago