ఏపీలో చుట్టుముట్టిన వరదలు.. భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు, ఏలూరు తదితర ప్రాంతా ల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తున్నా.. బాధితులకు ఇంకా మెరుగై న వసతులు కల్పించాల్సి ఉంది. దీంతో సహజంగానే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆశలు పెట్టుకుంటుం ది. పైగా పొత్తులో ఉన్న పార్టీ కావడంతో చంద్రబాబు ఆశలు పెట్టుకోవడంలో తప్పులేదు. అయితే.. ఇప్పటికే కేంద్రం సాయంచేసిందని ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్.. పురందేశ్వరి ప్రకటించారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.3300 కోట్లను కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సాయం ఇచ్చిందని పురందేశ్వరి తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో పోస్టు చేశారు. దీంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు పడుతున్న తపనకు కేంద్రం స్పందించిందని అనుకున్నారు. కానీ, పురందేశ్వరి చేసిన ప్రకటన అనంతరం.. చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన సంచలన ప్రకటన చేశారు. కేంద్రం నుంచి తమకు రూపాయి సాయం కూడా రాలేదని చెప్పారు.
తాము సాయం కోసం ఎదురు చూస్తున్నామని.. కానీ, కేంద్రం నుంచి ఇంకా రూపాయి కూడా రాలేదని చెప్పిన చంద్రబాబు.. పురందేశ్వరి చేసిన ట్వీట్ను కూడా ప్రస్తావించారు. రూ.3300 కోట్లు ఇచ్చారన్న ప్రచారం వాస్తవం కాదని.. పుకార్ మాత్రమేనని సంచలన ప్రకటన చేశారు. తాము వరద నష్టంపై ఇంకా ఒక అంచనాకు రాలేదని.. ప్రాథమికంగా మాత్రమే కొంత అంచనాకు వచ్చామని ఆయన చెప్పారు. దీనిని పంపించిన తర్వాతే.. సాయం అందుతుందని భావిస్తున్నామన్నారు.
ఈ మధ్యలోనే సాయం చేశారంటూ.. జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు. దీంతో పురందేశ్వరి ప్రకటన, చంద్రబాబు కామెంట్లు రెండూ కూడా సాయం విషయంలో సమన్వయ లోపాన్ని ఎత్తి చూపినట్టు తెలు స్తోంది. కేంద్రం నుంచి సాయం అందితే.. ముందుగా ప్రబుత్వానికి సమాచారం వస్తుంది. పోనీ.. దీనికంటే ముందుగానే బీజేపీనాయకురాలు కాబట్టి పురందేశ్వరికి సమాచారం అందిందని అనుకున్నా.. తర్వాత గంటకైనా.. సర్కారుకు సమాచారం రావాలి. అలా జరగలేదు. పైగా సీఎం చంద్రబాబే దీనిని ఖండించడంతో సాయం విషయంలో సమన్వయలోపం కనిపిస్తోందని అంటున్నారు.
This post was last modified on September 7, 2024 10:52 am
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…