Political News

విజ‌య‌వాడ‌ వరదలు.. ‘రంగా’ ఏంచేసేవారు

విజ‌య‌వాడ‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా.. ప్ర‌భుత్వాల కంటే కూడా ముందుగా స్పందించే కుటుంబం ఏదైనా ఉంటే అది వంగ‌వీటి ఫ్యామిలీనే. 1980, 1983ల‌లో విజ‌య‌వాడ శివారు ప్రాంతం(ఇప్పుడు మునిగిన ప్రాంత‌మే) ఇదే బుడ‌మేరు కార‌ణంగా నిలువెత్తు నీటిలో మునిగిపోయింది. అయితే.. అప్ప‌ట్లో స‌ర్కారు హైద‌రాబాద్ లో ఉండేది. కానీ, స‌ర్కారుకు ఈ మున‌క విష‌యం తెలిసేలోగానే.. రంగా రంగంలోకి దిగిపోయేవారు. పార్టీలు, నాయ‌కులు.. అన్న తేడా లేకుండా.. అంద‌రినీ క‌లుపుకొని పోయేవారు.

పెద్ద ఎత్తున లారీలు పెట్టి.. అంద‌రినీ.. ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియానికి త‌ర‌లించేవారు. అక్క‌డ చాల‌క‌పోతే.. పీడ‌బ్ల్యూడీ గ్రౌండ్‌లో శిబిరాలు ఏర్పాటు చేసి.. అక్క‌డ‌కు త‌ర‌లించేవారు. స్వచ్ఛంద సంస్థ‌ల‌ను అలెర్ట్ చేసేవారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన రంగా.. న‌డుములోతు నీటిలో న‌డుస్తూ.. ప్ర‌జ‌ల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. తానే స్వ‌యంగా బాధితుల‌ను ఒడ్డుకు చేర్చి లారీలు ఎక్కిన సంఘ‌ట‌న‌లు అనేకం.

అందుకే.. విజ‌య‌వాడ‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా.. ముందు వినిపించే పేరు రంగా. అంతేకాదు.. రాధా-రంగా మిత్ర‌మండ‌లి అప్పుడే ఏర్ప‌డింది. వీరైతే.. చిన్న‌పిల్ల‌ల‌ను, వృద్ధుల‌ను త‌మ చేతుల‌పైకి ఎత్తుకుని బాధిత ప్రాంతాల నుంచి కాపాడేవారు. వ‌చ్చిన లారీలు వ‌స్తూనే ఉండేవి. చిత్రం ఏంటంటే.. మ‌నుషుల‌తో పాటు.. వారి వ‌స్తువుల‌ను కూడా రంగా సాధ్య‌మైనంత వ‌ర‌కు కాపాడే ప్ర‌య‌త్నం చేసేవారు. ఏ ఒక్కరినీ వ‌దిలి పెట్టేవారు కాదు. వాళ్లు మ‌న పార్టీ కాద‌ని ఎవ‌రైనా అంటే.. ఇప్పుడు రాజ‌కీయాలేంట‌ని ఖ‌సురుకునే వారు. వారికి కూడా సాయం చేసేవారు.

కానీ.. ఇప్పుడు అదే విజ‌య‌వాడ శివారు ప్రాంతం మునిగిపోతే.. ఆయ‌న వార‌సుడు వంగ‌వీటి రాధా జాడే క‌నిపించ‌డం లేదు. క‌నీసం.. ఆయ‌న ఒక్క ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేదు. చేస్తే.. రాధా రంగా మిత్ర మండ‌లి అయినా.. ముందుకు వ‌చ్చేది. సాయానికి చేతులు చాపేది. కానీ, రంగా రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కావాల‌ని అనుకున్న రాధా.. ఆయ‌న దాతృత్వాన్ని వ‌ద్ద‌నుకుంటున్నారా? సాయం చేసే గుణాన్ని కాద‌నుకుంటున్నారా? అనేది చ‌ర్చ‌. అయితే..రంగా ఎదిగింది.. జ‌నం గుండెల్లో నిలిచింది.. రాజ‌కీయంగా కంటే.. సేవ‌తోనే అనే విష‌యం రాధాకు తెలియందికాదు!!

This post was last modified on September 6, 2024 5:26 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago