విజయవాడకు ఏ కష్టం వచ్చినా.. ప్రభుత్వాల కంటే కూడా ముందుగా స్పందించే కుటుంబం ఏదైనా ఉంటే అది వంగవీటి ఫ్యామిలీనే. 1980, 1983లలో విజయవాడ శివారు ప్రాంతం(ఇప్పుడు మునిగిన ప్రాంతమే) ఇదే బుడమేరు కారణంగా నిలువెత్తు నీటిలో మునిగిపోయింది. అయితే.. అప్పట్లో సర్కారు హైదరాబాద్ లో ఉండేది. కానీ, సర్కారుకు ఈ మునక విషయం తెలిసేలోగానే.. రంగా రంగంలోకి దిగిపోయేవారు. పార్టీలు, నాయకులు.. అన్న తేడా లేకుండా.. అందరినీ కలుపుకొని పోయేవారు.
పెద్ద ఎత్తున లారీలు పెట్టి.. అందరినీ.. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియానికి తరలించేవారు. అక్కడ చాలకపోతే.. పీడబ్ల్యూడీ గ్రౌండ్లో శిబిరాలు ఏర్పాటు చేసి.. అక్కడకు తరలించేవారు. స్వచ్ఛంద సంస్థలను అలెర్ట్ చేసేవారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన రంగా.. నడుములోతు నీటిలో నడుస్తూ.. ప్రజలను కాపాడే ప్రయత్నం చేశారు. తానే స్వయంగా బాధితులను ఒడ్డుకు చేర్చి లారీలు ఎక్కిన సంఘటనలు అనేకం.
అందుకే.. విజయవాడకు ఏ కష్టం వచ్చినా.. ముందు వినిపించే పేరు రంగా. అంతేకాదు.. రాధా-రంగా మిత్రమండలి అప్పుడే ఏర్పడింది. వీరైతే.. చిన్నపిల్లలను, వృద్ధులను తమ చేతులపైకి ఎత్తుకుని బాధిత ప్రాంతాల నుంచి కాపాడేవారు. వచ్చిన లారీలు వస్తూనే ఉండేవి. చిత్రం ఏంటంటే.. మనుషులతో పాటు.. వారి వస్తువులను కూడా రంగా సాధ్యమైనంత వరకు కాపాడే ప్రయత్నం చేసేవారు. ఏ ఒక్కరినీ వదిలి పెట్టేవారు కాదు. వాళ్లు మన పార్టీ కాదని ఎవరైనా అంటే.. ఇప్పుడు రాజకీయాలేంటని ఖసురుకునే వారు. వారికి కూడా సాయం చేసేవారు.
కానీ.. ఇప్పుడు అదే విజయవాడ శివారు ప్రాంతం మునిగిపోతే.. ఆయన వారసుడు వంగవీటి రాధా జాడే కనిపించడం లేదు. కనీసం.. ఆయన ఒక్క ప్రకటన కూడా చేయలేదు. చేస్తే.. రాధా రంగా మిత్ర మండలి అయినా.. ముందుకు వచ్చేది. సాయానికి చేతులు చాపేది. కానీ, రంగా రాజకీయ వారసత్వాన్ని కావాలని అనుకున్న రాధా.. ఆయన దాతృత్వాన్ని వద్దనుకుంటున్నారా? సాయం చేసే గుణాన్ని కాదనుకుంటున్నారా? అనేది చర్చ. అయితే..రంగా ఎదిగింది.. జనం గుండెల్లో నిలిచింది.. రాజకీయంగా కంటే.. సేవతోనే అనే విషయం రాధాకు తెలియందికాదు!!
This post was last modified on September 6, 2024 5:26 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…