విజయవాడకు ఏ కష్టం వచ్చినా.. ప్రభుత్వాల కంటే కూడా ముందుగా స్పందించే కుటుంబం ఏదైనా ఉంటే అది వంగవీటి ఫ్యామిలీనే. 1980, 1983లలో విజయవాడ శివారు ప్రాంతం(ఇప్పుడు మునిగిన ప్రాంతమే) ఇదే బుడమేరు కారణంగా నిలువెత్తు నీటిలో మునిగిపోయింది. అయితే.. అప్పట్లో సర్కారు హైదరాబాద్ లో ఉండేది. కానీ, సర్కారుకు ఈ మునక విషయం తెలిసేలోగానే.. రంగా రంగంలోకి దిగిపోయేవారు. పార్టీలు, నాయకులు.. అన్న తేడా లేకుండా.. అందరినీ కలుపుకొని పోయేవారు.
పెద్ద ఎత్తున లారీలు పెట్టి.. అందరినీ.. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియానికి తరలించేవారు. అక్కడ చాలకపోతే.. పీడబ్ల్యూడీ గ్రౌండ్లో శిబిరాలు ఏర్పాటు చేసి.. అక్కడకు తరలించేవారు. స్వచ్ఛంద సంస్థలను అలెర్ట్ చేసేవారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన రంగా.. నడుములోతు నీటిలో నడుస్తూ.. ప్రజలను కాపాడే ప్రయత్నం చేశారు. తానే స్వయంగా బాధితులను ఒడ్డుకు చేర్చి లారీలు ఎక్కిన సంఘటనలు అనేకం.
అందుకే.. విజయవాడకు ఏ కష్టం వచ్చినా.. ముందు వినిపించే పేరు రంగా. అంతేకాదు.. రాధా-రంగా మిత్రమండలి అప్పుడే ఏర్పడింది. వీరైతే.. చిన్నపిల్లలను, వృద్ధులను తమ చేతులపైకి ఎత్తుకుని బాధిత ప్రాంతాల నుంచి కాపాడేవారు. వచ్చిన లారీలు వస్తూనే ఉండేవి. చిత్రం ఏంటంటే.. మనుషులతో పాటు.. వారి వస్తువులను కూడా రంగా సాధ్యమైనంత వరకు కాపాడే ప్రయత్నం చేసేవారు. ఏ ఒక్కరినీ వదిలి పెట్టేవారు కాదు. వాళ్లు మన పార్టీ కాదని ఎవరైనా అంటే.. ఇప్పుడు రాజకీయాలేంటని ఖసురుకునే వారు. వారికి కూడా సాయం చేసేవారు.
కానీ.. ఇప్పుడు అదే విజయవాడ శివారు ప్రాంతం మునిగిపోతే.. ఆయన వారసుడు వంగవీటి రాధా జాడే కనిపించడం లేదు. కనీసం.. ఆయన ఒక్క ప్రకటన కూడా చేయలేదు. చేస్తే.. రాధా రంగా మిత్ర మండలి అయినా.. ముందుకు వచ్చేది. సాయానికి చేతులు చాపేది. కానీ, రంగా రాజకీయ వారసత్వాన్ని కావాలని అనుకున్న రాధా.. ఆయన దాతృత్వాన్ని వద్దనుకుంటున్నారా? సాయం చేసే గుణాన్ని కాదనుకుంటున్నారా? అనేది చర్చ. అయితే..రంగా ఎదిగింది.. జనం గుండెల్లో నిలిచింది.. రాజకీయంగా కంటే.. సేవతోనే అనే విషయం రాధాకు తెలియందికాదు!!
This post was last modified on September 6, 2024 5:26 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…