వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. విదేశాలకు వెళ్లాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒకవైపు… రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టించి.. ప్రజలు నానా ఇబ్బందుల్లో ఉన్నా.. ఆయనకు పెద్దగా పట్టినట్టు కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నా.. జగన్ ఈ విమర్శలను ఎక్కడా తలకెక్కించుకోవడం లేదు. పైగా.. తన ప్రయాణానికి రెడీ అయ్యారు. కానీ, అనూహ్యంగా ఆయన ప్రయాణానికి బ్రేకులు పడ్డాయి. ఇది కోర్టు రూపంలో ఎదురు కావడంతో మౌనంగా ఉన్నారు.
ఏం జరిగింది?
నిన్న మొన్నటి వరకు జగన్కు డిప్లొమాటిక్ పాస్ పోర్టు ఉంది. అయితే.. ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన ఈ పాస్ పోర్టు రద్దయింది. దీంతో ఇప్పుడు సాధారణ పాస్ పోర్టు రావాల్సి ఉంది. పాస్ పోర్టు ఇవ్వాలని.. నాంపల్లిలోని సీబీఐ కోర్టు కూడా.. గతంలోనే ఆదేశించింది. దీంతో అధికారులు ఏడాది కాలానికి ఆయనకు పాస్ పోర్టు ఇచ్చేలా పత్రాలు రెడీ చేశారు. కానీ, తనకు ఐదేళ్లకు సరిపడా పాస్ పోర్టు కావాలంటూ.. జగన్ సదరు పత్రాలపై సంతకాలు చేయలేదు.
అంతేకాదు.. ఆ వెంటనే హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఐదేళ్లపాటు అనుమతి ఇచ్చేలా పాస్ పోర్టు ఇప్పించాలని ఆయన తరఫున న్యాయవాదులు కోర్టు అభ్యర్థిస్తూ.. పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. ఈ పిటిషన్పై విచారణను అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీంతో జగన్ లండన్ ప్రయాణానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. అయితే.. కోర్టు తీసుకునే నిర్ణయం మేరకు తమ అధినేత విదేశాలకు వెళ్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 6, 2024 2:00 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…