Political News

లండ‌న్ ప్ర‌యాణానికి జ‌గ‌న్ ఓకే.. కానీ, బ్రేక్ ప‌డింది!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. విదేశాల‌కు వెళ్లాల‌ని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక‌వైపు… రాష్ట్రంలో వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించి.. ప్ర‌జ‌లు నానా ఇబ్బందుల్లో ఉన్నా.. ఆయ‌న‌కు పెద్ద‌గా ప‌ట్టిన‌ట్టు క‌నిపించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. జ‌గ‌న్ ఈ విమ‌ర్శ‌ల‌ను ఎక్క‌డా త‌లకెక్కించుకోవ‌డం లేదు. పైగా.. త‌న ప్ర‌యాణానికి రెడీ అయ్యారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న ప్ర‌యాణానికి బ్రేకులు ప‌డ్డాయి. ఇది కోర్టు రూపంలో ఎదురు కావ‌డంతో మౌనంగా ఉన్నారు.

ఏం జ‌రిగింది?

నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌కు డిప్లొమాటిక్ పాస్ పోర్టు ఉంది. అయితే.. ఆయ‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కోల్పోయిన ఈ పాస్ పోర్టు ర‌ద్ద‌యింది. దీంతో ఇప్పుడు సాధార‌ణ పాస్ పోర్టు రావాల్సి ఉంది. పాస్ పోర్టు ఇవ్వాల‌ని.. నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు కూడా.. గ‌తంలోనే ఆదేశించింది. దీంతో అధికారులు ఏడాది కాలానికి ఆయ‌న‌కు పాస్ పోర్టు ఇచ్చేలా ప‌త్రాలు రెడీ చేశారు. కానీ, త‌న‌కు ఐదేళ్ల‌కు స‌రిప‌డా పాస్ పోర్టు కావాలంటూ.. జ‌గ‌న్ స‌ద‌రు ప‌త్రాల‌పై సంత‌కాలు చేయ‌లేదు.

అంతేకాదు.. ఆ వెంట‌నే హైకోర్టులో శుక్ర‌వారం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌కు ఐదేళ్ల‌పాటు అనుమ‌తి ఇచ్చేలా పాస్ పోర్టు ఇప్పించాల‌ని ఆయ‌న త‌ర‌ఫున న్యాయ‌వాదులు కోర్టు అభ్య‌ర్థిస్తూ.. పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అయితే.. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను అత్యవ‌స‌రంగా చేప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేసింది. దీంతో జ‌గ‌న్ లండ‌న్ ప్ర‌యాణానికి తాత్కాలికంగా బ్రేకులు ప‌డ్డాయి. అయితే.. కోర్టు తీసుకునే నిర్ణ‌యం మేర‌కు త‌మ‌ అధినేత విదేశాల‌కు వెళ్తార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on September 6, 2024 2:00 pm

Share

Recent Posts

యానిమల్ పార్క్… ఇంకెంత దూరం?

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…

12 minutes ago

తమన్ సమాజ సేవకు 12 కోట్ల టార్గెట్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…

24 minutes ago

చివరి సిక్సర్ కోసం కనకరాజు పోరాటం

వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…

1 hour ago

గుజరాత్ ను వణికిస్తున్న చండీపుర…. 25 పిల్లలు బలి

గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…

2 hours ago

జనసేనలో వుండాలంటే బూతులు మానాలి

కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…

2 hours ago

హనుమాన్ విజయమే మహాకాళీ ధైర్యం

2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…

2 hours ago