Political News

రంగంలోకి ఆర్మీ.. బుడ‌మేరు గండ్ల పూడ్చివేత‌: కేంద్ర మంత్రి

ఏపీలో బ‌డుమేరు స‌హా కృష్ణాన‌ది వ‌ర‌ద ప్ర‌భావంతో మునిగిపోయిన ప్రాంతాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే.. ఎంత చేసినా.. బుడ‌మేరు ముంపు బాధితుల‌కు స‌రైన విధంగా సాయం అంద‌డం లేదు. దీంతో కేంద్రం స‌హ‌క‌రించాల‌ని చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపుతో కేంద్ర మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. బుడ‌మేరు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఆయ‌న సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు. బాధిత ప్రాంతాల‌ను గ‌గ‌నం నుంచే ప‌రిశీలించారు. అనంత‌రం.. విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్‌లో మీడియాతో మాట్లాడిన చౌహాన్‌.. గత జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల వ‌ల్లే బుడ‌మేరు పొంగింద‌ని చెప్పారు.

“బుడ‌మేరు ఈ స్థాయిలో పొంగి వ‌ర‌ద‌లు రావ‌డానికి గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పులే ఉన్నాయి. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో బుడ‌మేరును ఆక్ర‌మించుకుని నిర్మాణాలు చేశారు. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌వాహానికి అడ్డు ఏర్ప‌డింది. దీంతో నీరు దిగువ‌కు ప్ర‌వ‌హించ‌డం లేదు. నేను స్వ‌యంగా చూశా. ఈ అడ్డును తొల‌గించాల్సి ఉంది. అదేవిదంగా గండ్లు పూడ్చాల్సి ఉంది. గండ్లు ప‌డ‌డానికి కూడా. ఆక్ర‌మ‌ణ‌లే కార‌ణం. గ‌తం ప్ర‌భుత్వం స‌రిగా స్పందించి ఉంటే.. ఇంత న‌ష్టం జ‌రిగి ఉండేది కాదు” అని చౌహాన్ వివ‌రించారు. ఇదేస‌మ‌యంలో ఏపీని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వ‌స్తుంద‌ని తెలిపారు.

ముఖ్యంగా బుడ‌మేరుకు ఏర్ప‌డిన గండ్లు పూడ్చేందుకు త‌క్ష‌ణ‌మే ఆర్మీని రంగంలోకి దింప‌నున్న‌ట్టు కేంద్ర మంత్రి చౌహాన్ వివ‌రించారు. త‌క్ష‌ణ సాయం కింద కేంద్రం ఆదుకుంటుంద‌ని తెలిపారు. సీఎం చంద్ర‌బాబు వ‌ర‌ద ప్ర‌భావిత ప్ర‌జ‌ల‌ను ఆదుకునేం దుకు ఎంతో శ్ర‌మిస్తున్నార‌ని కితాబునిచ్చారు. ఆయ‌నే స్వ‌యంగా వ‌ర‌ద నీటిలో దిగి బాధితుల‌ను ఓదార్చుతున్నార‌ని ఇలా ఒక ముఖ్య‌మంత్రి స్వ‌యంగా వ‌ర‌ద నీటిలో ఇన్ని రోజులు తిర‌గ‌డం గ‌తంలో త‌న‌కు ఎప్పుడూ తెలియ‌ద‌ని వ్యాఖ్యానించారు. దగ్గరుండి మరీ సహాయక చర్యలు పర్యవేక్షించారని కితాబిచ్చారు.

బాధితుల‌కు ఆహారం అందించేందుకు సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను కూడా వినియోగించుకోవ‌డం గొప్ప విష‌య‌మ‌ని డ్రోన్ల‌కు సంబంధించిన విష‌యాన్ని కేంద్ర మంత్రి ప్ర‌స్తావించారు. ఏపీలో జ‌రిగిన న‌ష్టం.. విప‌త్తును ప్ర‌ధాని మోడీకి వివ‌రించ‌నున్న‌ట్టు తెలిపారు. సాయం త్వ‌ర‌గా అందేలా.. బాధితుల‌కు ఊర‌ట ల‌భించేలా చేస్తామ‌ని చెప్పారు.

This post was last modified on September 6, 2024 5:59 am

Share

Recent Posts

విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తున్నారా

నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…

42 minutes ago

అర్జెంటీనా సముద్రం ఇంకి పోయిందా?

అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…

1 hour ago

శాంసంగ్ ఏడేళ్ల కష్టం.. యాపిల్ ఎందుకింత ఆలస్యం

ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…

2 hours ago

ఫౌజీ వెనుక అసలేం జరుగుతోంది

ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…

2 hours ago

స్కూలు సెలవు కోసం మర్డర్ ప్లాన్

మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…

2 hours ago

టాలీవుడ్ హీరోలూ… స్పీడ్ పెంచండయ్యా

కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…

2 hours ago