Political News

రంగంలోకి ఆర్మీ.. బుడ‌మేరు గండ్ల పూడ్చివేత‌: కేంద్ర మంత్రి

ఏపీలో బ‌డుమేరు స‌హా కృష్ణాన‌ది వ‌ర‌ద ప్ర‌భావంతో మునిగిపోయిన ప్రాంతాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే.. ఎంత చేసినా.. బుడ‌మేరు ముంపు బాధితుల‌కు స‌రైన విధంగా సాయం అంద‌డం లేదు. దీంతో కేంద్రం స‌హ‌క‌రించాల‌ని చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపుతో కేంద్ర మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. బుడ‌మేరు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఆయ‌న సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు. బాధిత ప్రాంతాల‌ను గ‌గ‌నం నుంచే ప‌రిశీలించారు. అనంత‌రం.. విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్‌లో మీడియాతో మాట్లాడిన చౌహాన్‌.. గత జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల వ‌ల్లే బుడ‌మేరు పొంగింద‌ని చెప్పారు.

“బుడ‌మేరు ఈ స్థాయిలో పొంగి వ‌ర‌ద‌లు రావ‌డానికి గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పులే ఉన్నాయి. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో బుడ‌మేరును ఆక్ర‌మించుకుని నిర్మాణాలు చేశారు. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌వాహానికి అడ్డు ఏర్ప‌డింది. దీంతో నీరు దిగువ‌కు ప్ర‌వ‌హించ‌డం లేదు. నేను స్వ‌యంగా చూశా. ఈ అడ్డును తొల‌గించాల్సి ఉంది. అదేవిదంగా గండ్లు పూడ్చాల్సి ఉంది. గండ్లు ప‌డ‌డానికి కూడా. ఆక్ర‌మ‌ణ‌లే కార‌ణం. గ‌తం ప్ర‌భుత్వం స‌రిగా స్పందించి ఉంటే.. ఇంత న‌ష్టం జ‌రిగి ఉండేది కాదు” అని చౌహాన్ వివ‌రించారు. ఇదేస‌మ‌యంలో ఏపీని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వ‌స్తుంద‌ని తెలిపారు.

ముఖ్యంగా బుడ‌మేరుకు ఏర్ప‌డిన గండ్లు పూడ్చేందుకు త‌క్ష‌ణ‌మే ఆర్మీని రంగంలోకి దింప‌నున్న‌ట్టు కేంద్ర మంత్రి చౌహాన్ వివ‌రించారు. త‌క్ష‌ణ సాయం కింద కేంద్రం ఆదుకుంటుంద‌ని తెలిపారు. సీఎం చంద్ర‌బాబు వ‌ర‌ద ప్ర‌భావిత ప్ర‌జ‌ల‌ను ఆదుకునేం దుకు ఎంతో శ్ర‌మిస్తున్నార‌ని కితాబునిచ్చారు. ఆయ‌నే స్వ‌యంగా వ‌ర‌ద నీటిలో దిగి బాధితుల‌ను ఓదార్చుతున్నార‌ని ఇలా ఒక ముఖ్య‌మంత్రి స్వ‌యంగా వ‌ర‌ద నీటిలో ఇన్ని రోజులు తిర‌గ‌డం గ‌తంలో త‌న‌కు ఎప్పుడూ తెలియ‌ద‌ని వ్యాఖ్యానించారు. దగ్గరుండి మరీ సహాయక చర్యలు పర్యవేక్షించారని కితాబిచ్చారు.

బాధితుల‌కు ఆహారం అందించేందుకు సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను కూడా వినియోగించుకోవ‌డం గొప్ప విష‌య‌మ‌ని డ్రోన్ల‌కు సంబంధించిన విష‌యాన్ని కేంద్ర మంత్రి ప్ర‌స్తావించారు. ఏపీలో జ‌రిగిన న‌ష్టం.. విప‌త్తును ప్ర‌ధాని మోడీకి వివ‌రించ‌నున్న‌ట్టు తెలిపారు. సాయం త్వ‌ర‌గా అందేలా.. బాధితుల‌కు ఊర‌ట ల‌భించేలా చేస్తామ‌ని చెప్పారు.

This post was last modified on September 6, 2024 5:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

24 minutes ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

2 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

2 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

2 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

5 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

7 hours ago