ఇప్పుడైతే కరోనా కల్లోలం వార్తలన్నీ అమెరికా చుట్టూ తిరుగుతున్నాయి కానీ.. నెల కిందట అయితే అందరూ ఇటలీ గురించే చర్చించుకున్నారు. మన దగ్గర దేశవ్యాప్తంగా రోజుకు 30-40 కేసులు, ఒకటీ అరా మరణాలు నమోదవుతున్న తరుణంలో ఆ దేశంలో రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల్లో మరణాలు నమోదయ్యాయి. ఒక దశలో రోజుకు 800 మందికి పైగా మరణించారు ఇటలీలో. ఇప్పుడైతే అమెరికా దానికి రెట్టింపు మరణాల స్థాయికి వెళ్లిపోయింది కానీ.. గత నెలలో పరిస్థితుల ప్రకారం ఒక్క రోజులో 800 మరణాలంటే వామ్మో అనుకున్నాం. ఇటలీ గురించి కథలు కథలుగా చెప్పుకున్నాం. తర్వాత అక్కడ పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చింది. ఇప్పుడు కూడా పూర్తి నియంత్రణ లేదు కానీ.. చాలా మెరుగ్గానే ఉంది. దీంతో లాక్ డౌన్ దశల వారీగా ఎత్తేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది ఇటలీ ప్రభుత్వం.
మన దగ్గర లాగే మే 3 వరకు అక్కడ పూర్తి స్థాయి లాక్ డౌన్ ఉండనుంది. ఆ తర్వాత దశల వారీగా లాక్ డౌన్ సడలించడానికి నిర్ణయించారు. మే 4న ముందుగా నిర్మాణ, ఉత్పత్తి రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిస్తారట. 18న రిటైల్ షాపులు, మ్యూజియంలు, లైబ్రరీలు, క్రీడా సంబంధిత కార్యకలాపాలు ఆరంభిస్తారట. జూన్ 1న రెస్టారెంట్లు, కేఫ్లు, హేర్-బ్యూటీ సెలూన్లు ఓపెన్ చేస్తారట. స్కూళ్లు, కాలేజీలు సెప్టెంబరు వరకు మూసి ఉంచాలని నిర్ణయించారు. థియేటర్లు, మాల్స్ ఏడాది చివరికి కానీ తెరుచుకునే అవకాశం లేదట. ఇండియాలో కూడా మే 3 నుంచి లాక్ డౌన్ దశల వారీగా ఎత్తేసే అవకాశాలున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇటలీ మోడల్నే అనుసరించే అవకాశముంది. ఇటలీలో ఇప్పటిదాకా 2 లక్షల మంది కరోనా బారిన పడగా.. 27 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
This post was last modified on April 28, 2020 4:02 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…