మనసుకు తోచినట్లుగా మాట్లాడే లగ్జరీ సామాన్యుడికి ఉంటుంది. ఎంత తోపు రాజకీయ నాయకులకైనా అలాంటి సౌకర్యం ఉండదు. ఎందుకంటే ఒక నాయకుడిగా, నాయకురాలిగా ఉన్నప్పుడు వారి మీద అంతో ఇంతో బాధ్యత ఉంటుంది. మాజీ మంత్రి కం మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇలాంటి విషయాల్ని పూర్తిగా మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది.
అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తూ.. లిమిటెడ్ గా రియాక్టు అవుతున్న రోజా.. బెజవాడ వరదలపై స్పందించాలని డిసైడ్ అయ్యారు. అదేమీ తప్పు కూడా కాదు.కానీ.. అలా స్పందించే వేళలో.. గ్రౌండ్ లెవల్ లో ఏం జరుగుతుంది? తెలుసుకుని మాట్లాడాలి. అందుకు భిన్నంగా పార్టీ కరపత్రాన్ని భగవద్గీతగా భావించి.. దాన్ని చదివిన తర్వాత తన మనసుకు తోచింది యాడ్ చేసుకుంటూ చెలరేగిపోతే.. మొదటికే మోసం వస్తుంది. ఆ విషయాన్ని ఆర్కేరోజా మిస్ అయినట్లున్నారు.
విజయవాడ వరదల మీద మంత్రి నారా లోకేశ్ పాల్గొనటం లేదని.. హైదరాబాద్ లో ఉండి ఎంజాయ్ చేస్తున్నట్లుగా నోరు పారేసుకున్నారు. ఆమె వ్యాఖ్యలు అలా బయటకు వచ్చాయో లేదో.. జనాలు ఆమెను తిట్టి పోస్తున్న పరిస్థితి. కళ్లకు ఏమైందంటూ మొదలు పెట్టి.. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
నిజానికి బెజవాడ వరదలు మొదలైన నాటి నుంచి లోకేశ్ అవిశ్రాంతంగా పని చేస్తూనే ఉన్నారు. కాకుంటే.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ అతిగా ఫోకస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించకుండా తొందరపాటుతో రోజా వ్యవహరించిన తీరు విమర్శలు వెల్లువెత్తేలా చేస్తోంది. ఇప్పటికైనా ఏదైనా మాట్లాడే ముందు.. అసలేం జరిగిందన్న ఆరా కనీసస్థాయిలో అయినా చేస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని ఆమెకు అర్థమయ్యేలా ఎవరు చెబుతారు?
ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆమె మాటలోనూ.. వ్యవహార శైలిలోనూ మార్పులు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న పరిస్థితి. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎదుటోడు చీమ కంటే చిన్నోడన్నట్లుగా చూసిన దానికి ఆమె భారీగానే మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఏపీ రాజకీయాలపైనా.. రోజు వారీ పరిణామాల మీద స్పందించటం తగ్గించేశారు. అంతేనా.. నోరు విప్పితే.. జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే రోజా.. ఇప్పుడు ఆయన ప్రస్తావన తీసుకురావటానికి సైతం జంకుతున్నారు. ఇదంతా చూసినోళ్లు.. ఎలాంటి రోజా ఎలా అయిపోయారన్న భావనకు గురయ్యే పరిస్థితి.
This post was last modified on September 4, 2024 2:17 pm
ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…
‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన…
తమిళ సినిమాల మీద తెలుగు ప్రేక్షకుల ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా అక్కడి నుంచి వచ్చే అనువాద…
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…