రాష్ట్ర రాజకీయాల్లో విచిత్రమైన పరిస్ధితి కనిపిస్తోంది. వైసిపి అధికారపార్టీ అయితే టిడిపి ప్రధాన ప్రతిపక్షమన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బిజెపి+జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ప్రతిపక్షాల క్రిందే లెక్క. ఓట్లు, సీట్లు లెక్క తీసుకుంటే వీటిల్లో దేనికి కూడా ప్రతిపక్ష హోదా దక్కదు. కానీ వాటితో సంబంధాలు లేకుండా ప్రతిపక్షం ప్రతిపక్షమే అంటే మాత్రం పై పార్టీలన్నీ లెక్కలోకి వస్తాయి. ఇటువంటి నేపధ్యంలోనే బిజెపి నేతల తాజా ప్రకటనలను చూస్తే తెలుగుదేశంపార్టీని వాళ్ళసలు ప్రతిపక్షంగానే గుర్తిస్తున్నట్లు అనిపించటం లేదు.
తాజాగా ఏర్పాటైన బిజెపి జాతీయ కార్యవర్గంలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ తమ ప్రధాన ప్రత్యర్ధి వైసిపినే అని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం అయినా టిడిపి తమకు ప్రత్యర్ధే కాదని చెప్పటమే విచిత్రంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపికి సుమారు 38 శాతం ఓట్లొచ్చాయి. 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే బిజెపి విషయానికి వస్తే వచ్చిన ఓట్లు 0.84 శాతం. నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా)కు కూడా బిజెపికన్నా ఎక్కువ ఓట్లే వచ్చాయి. అంటే బిజెపి పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది.
ఇటువంటి బిజెపి కూడా టిడిపిని లెక్కలేనట్లుగా మాట్లాడుతుంటే అందరు ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర కమలంపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఇదే పద్దతిలో మాట్లాడుతున్నారు. టిడిపిని దెబ్బతీస్తామని వీర్రాజు చెప్పటమే విచిత్రంగా ఉంది. ఏదో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, మొన్నటి ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు చేసిన పొరబాట్ల వల్ల ఘోరంగా ఓడిపోయుండచ్చు. అంతమాత్రాన టిడిపిని బొత్తిగా తీసిపారేయటం సాధ్యంకాదు. ఎందుకంటే బలమైన క్యాడర్ బేస్ ఉన్న పార్టీ అన్న విషయం మరచిపోకూడదు.
నిజానికి బిజెపిలో కీలక నేతలుగా చెలామణి అవుతున్న చాలామంది నేతలకు అసలు జనబలమే లేదన్నది వాస్తవం. జాతీయ కార్యదర్శిగా తన పదవిని దక్కించుకున్న సత్యకుమార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరన్న విషయం కూడా చాలామందికి తెలిసుండకపోవచ్చు. మామూలు జనాలెవరకి సత్యకుమార్ అంటే ఎవరో కూడా తెలీదేమో. ఇలాంటి నేతలు కూడా తమ ప్రత్యర్ధి వైసిపినే అని చెప్పటమంటే కామిడి చేయటమే.
This post was last modified on September 28, 2020 7:49 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…