Political News

మ‌హేష్‌కే తెలంగాణ పీసీసీ పీఠం!

దాదాపు ఆరు మాసాలుగా ఊరిస్తున్న తెలంగాణ‌కాంగ్రెస్ పార్టీ చీఫ్ ప‌ద‌విని కాంగ్రెస్ అధిష్టానం ఖ‌రారు చేసింది. అయితే.. దీనిపై ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ ప‌ద‌విని ఆది నుంచి బీసీల‌కు ఇస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగిన‌ట్టుగానే .. సీనియ‌ర్ నాయ‌కుడు పార్టీకి వీర విధేయుడు.. బొమ్మ‌ మ‌హేష్ గౌడ్ కు ఇచ్చిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ పీటం కోసం.. సుమారు న‌లుగురు కీల‌క నాయ‌కులు పోటీ ప‌డ్డారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు కూడా ఉన్న విష‌యం తెలిసిందే.

అయితే.. అనేక కూడిక‌లు. తీసివేత‌ల త‌ర్వాత‌.. రాష్ట్రంలో బ‌లంగా ఉన్న గౌడ సామాజిక వ‌ర్గాన్ని త‌మ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అదే సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న మ‌హేష్ కు మొగ్గు చూపిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, దీనిపై ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇక‌, మహేష్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు.

అయితే.. మ‌హేష్‌గౌడ్ ఇప్ప‌టి వ‌ర‌కుప్ర‌జాక్షేత్రంలో విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. ఆయ‌న 1994లో డిచ్‌పల్లి నుంచి 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసినా విజ‌యం సాధించ‌లేదు. అయితే.. పార్టీలో మాత్రం ఆయ‌నకు బ‌ల‌మైన ప‌ట్టుంది. మంచి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే 2023లో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుల య్యారు.తాజాగా పీసీసీ పీఠం అందుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ గా ఉన్న దీపాదాస్ మున్షీని కూడా.. మార్పు చేసిన‌ట్టు తెలిసింది. ఈయ‌న‌ స్థానంలో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భఘేల్‌ని నియమించనున్నట్లు స‌మాచారం. అదేవిధంగా కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల పీసీసీ చీఫ్‌ల నియామ‌కంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిపై ప్ర‌క‌ట‌నే రావాల్సి ఉంది.

This post was last modified on September 1, 2024 10:37 am

Share
Show comments
Published by
Satya
Tags: CongressTPCC

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

9 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago