Political News

పార్టీని న‌డ‌ప‌డం క‌ష్టంగా ఉంది: వైసీపీ ఎంపీ

పార్టీని న‌డ‌ప‌డం చాలా క‌ష్టంగా ఉంద‌ని వైసీపీ ముఖ్య‌నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం 11 మంది పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుల్లో 10 మంది వ‌ర‌కు పార్టీ మారుతారంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాంటి ప‌రిస్థితి రాద‌న్నారు. అంద‌రూ జ‌గ‌న్‌కు విధేయులేన‌ని.. అయితే, ఒక‌రిద్ద‌రు దారి త‌ప్పినంత మాత్రాన అంద‌రినీ అదే రాటన క‌ట్ట‌వ‌ద్ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మీడియా సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు. “ఈ రోజుల్లో రాజ‌కీయ పార్టీని న‌డిపించ‌డం అంటే త‌మాషా కాదు. చాలా క‌ష్టంగా ఉంది. ఈ విష‌యాన్నితెలుసుకోలేక చాలా మంది వ్యాఖ్య‌లు చేస్తున్నారు” అని అన్నారు.

రాజ‌కీయాల్లో నాయ‌కులు తాము అనుకున్న‌ట్టుగా అన్నీ జ‌ర‌గాలంటే కుద‌ర‌ద‌ని ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు రాజీనామా చేసిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయినా.. ఆయ‌న‌కు ఏం త‌క్కువ చేశార‌ని.. పార్టీ మారార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఎన్నో కొరిక‌లు ఉంటాయ‌న్నారు. కుదిరితే ముఖ్య‌మంత్రి కూడా కావాల‌ని అనుకుంటార‌ని.. సాధ్య‌మ‌వుతుందా? అన్నారు. ఉన్నంత‌లో అంద‌రికీ జ‌గ‌న్ న్యాయం చేశార‌ని చెప్పారు. మోపిదేవి ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆయ‌న‌కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి.. అనంత‌రం మంత్రిని చేశార‌ని చెప్పారు. త‌ర్వాత‌ రాజ్యసభకు కూడా పంపించార‌న్నా రు.

ఇప్పుడు సొంత అవ‌స‌రాలు, ఇబ్బందులు ఉన్నాయని పార్టీ మారడం స‌రికాద‌న్నారు. ఇలాంటి వారికి ప్ర‌జ‌ల్లోను, రాజ‌కీయాల్లో నూ ఏమాత్రం విలువ ఉండదని రామిరెడ్డి చెప్పారు. ఇక‌, త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. త‌ను ఎప్ప‌టికీ పార్టీ మారేది లేద‌న్నారు. అంతేకాదు.. రాజ్య‌స‌భ కు రాజీనామా చేయ‌న‌ని, జ‌గ‌న్ త‌న‌పై పెట్టిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌బోన న్నారు. చివ‌రి వ‌ర‌కు జ‌గ‌న్‌తోనే న‌డుస్తాన‌ని తేల్చి చెప్పారు. ఆ ఇద్ద‌రు(మోపిదేవి, బీద మ‌స్తాన్‌) మిన‌హా అంద‌రూ.. జ‌గ‌న్‌తోనే ఉంటార‌ని చెప్పారు. ఈ విష‌యంలో మీడియా సంయ‌మ‌నం పాటించాల‌న్నారు.

నేనూ మార‌ను: ఆర్‌. కృష్ణ‌య్య‌

బీసీ నాయ‌కుడు, వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌. కృష్ణ‌య్య కూడా వైసీపీని వీడి బీజేపీలోకి చేర‌నున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా ఆయ‌న ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ.. తాను పార్టీ మార‌బోన‌న్నారు. జ‌గ‌న్ వెంటే న‌డుస్తాన‌ని చెప్పారు. బీసీల కోసం పార్ల‌మెంటులో గ‌ళం వినిపించాల‌ని త‌న‌ను జ‌గ‌న్ పార్ల‌మెంటుకు పంపించార‌ని.. ఇప్పుడు ఆయ‌న‌కు ద్రోహం చేస్తానా? అలా చేస్తే.. బీసీల‌కు చేసిన‌ట్టేక‌దా? అని ప్ర‌శ్నించారు. అవ‌స‌రాలు, స‌మ‌స్య‌లు ఉన్న‌వారే పార్టీలు మారుతార‌ని.. త‌న‌కు అలాంటివి ఏమీ లేవ‌న్నారు. జ‌గ‌న్ ఇచ్చిన అవ‌కాశం వినియోగించుకుని బీసీల‌కు మేలు చేసే ప‌నిపైనే ఉంటాన‌న్నారు.

This post was last modified on August 30, 2024 9:03 pm

Share

Recent Posts

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

1 hour ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

2 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

2 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

2 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

5 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

6 hours ago