Political News

పార్టీని న‌డ‌ప‌డం క‌ష్టంగా ఉంది: వైసీపీ ఎంపీ

పార్టీని న‌డ‌ప‌డం చాలా క‌ష్టంగా ఉంద‌ని వైసీపీ ముఖ్య‌నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం 11 మంది పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుల్లో 10 మంది వ‌ర‌కు పార్టీ మారుతారంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాంటి ప‌రిస్థితి రాద‌న్నారు. అంద‌రూ జ‌గ‌న్‌కు విధేయులేన‌ని.. అయితే, ఒక‌రిద్ద‌రు దారి త‌ప్పినంత మాత్రాన అంద‌రినీ అదే రాటన క‌ట్ట‌వ‌ద్ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మీడియా సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు. “ఈ రోజుల్లో రాజ‌కీయ పార్టీని న‌డిపించ‌డం అంటే త‌మాషా కాదు. చాలా క‌ష్టంగా ఉంది. ఈ విష‌యాన్నితెలుసుకోలేక చాలా మంది వ్యాఖ్య‌లు చేస్తున్నారు” అని అన్నారు.

రాజ‌కీయాల్లో నాయ‌కులు తాము అనుకున్న‌ట్టుగా అన్నీ జ‌ర‌గాలంటే కుద‌ర‌ద‌ని ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు రాజీనామా చేసిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయినా.. ఆయ‌న‌కు ఏం త‌క్కువ చేశార‌ని.. పార్టీ మారార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఎన్నో కొరిక‌లు ఉంటాయ‌న్నారు. కుదిరితే ముఖ్య‌మంత్రి కూడా కావాల‌ని అనుకుంటార‌ని.. సాధ్య‌మ‌వుతుందా? అన్నారు. ఉన్నంత‌లో అంద‌రికీ జ‌గ‌న్ న్యాయం చేశార‌ని చెప్పారు. మోపిదేవి ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆయ‌న‌కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి.. అనంత‌రం మంత్రిని చేశార‌ని చెప్పారు. త‌ర్వాత‌ రాజ్యసభకు కూడా పంపించార‌న్నా రు.

ఇప్పుడు సొంత అవ‌స‌రాలు, ఇబ్బందులు ఉన్నాయని పార్టీ మారడం స‌రికాద‌న్నారు. ఇలాంటి వారికి ప్ర‌జ‌ల్లోను, రాజ‌కీయాల్లో నూ ఏమాత్రం విలువ ఉండదని రామిరెడ్డి చెప్పారు. ఇక‌, త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌ను కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. త‌ను ఎప్ప‌టికీ పార్టీ మారేది లేద‌న్నారు. అంతేకాదు.. రాజ్య‌స‌భ కు రాజీనామా చేయ‌న‌ని, జ‌గ‌న్ త‌న‌పై పెట్టిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌బోన న్నారు. చివ‌రి వ‌ర‌కు జ‌గ‌న్‌తోనే న‌డుస్తాన‌ని తేల్చి చెప్పారు. ఆ ఇద్ద‌రు(మోపిదేవి, బీద మ‌స్తాన్‌) మిన‌హా అంద‌రూ.. జ‌గ‌న్‌తోనే ఉంటార‌ని చెప్పారు. ఈ విష‌యంలో మీడియా సంయ‌మ‌నం పాటించాల‌న్నారు.

నేనూ మార‌ను: ఆర్‌. కృష్ణ‌య్య‌

బీసీ నాయ‌కుడు, వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌. కృష్ణ‌య్య కూడా వైసీపీని వీడి బీజేపీలోకి చేర‌నున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా ఆయ‌న ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ.. తాను పార్టీ మార‌బోన‌న్నారు. జ‌గ‌న్ వెంటే న‌డుస్తాన‌ని చెప్పారు. బీసీల కోసం పార్ల‌మెంటులో గ‌ళం వినిపించాల‌ని త‌న‌ను జ‌గ‌న్ పార్ల‌మెంటుకు పంపించార‌ని.. ఇప్పుడు ఆయ‌న‌కు ద్రోహం చేస్తానా? అలా చేస్తే.. బీసీల‌కు చేసిన‌ట్టేక‌దా? అని ప్ర‌శ్నించారు. అవ‌స‌రాలు, స‌మ‌స్య‌లు ఉన్న‌వారే పార్టీలు మారుతార‌ని.. త‌న‌కు అలాంటివి ఏమీ లేవ‌న్నారు. జ‌గ‌న్ ఇచ్చిన అవ‌కాశం వినియోగించుకుని బీసీల‌కు మేలు చేసే ప‌నిపైనే ఉంటాన‌న్నారు.

This post was last modified on August 30, 2024 9:03 pm

Share

Recent Posts

మోహన్ బాబుని మిస్ చేసిన మహేష్ బాబు

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…

17 minutes ago

మహేష్ మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూసిన విజయ్

ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…

37 minutes ago

జ‌న‌సేన ఎమ్మెల్యే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తారా ..?

తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన జ‌న‌సేన నాయ‌కుడు, సీనియ‌ర్ నేత ఆర‌ణి శ్రీనివాసులు రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఆస‌క్తిక‌ర…

2 hours ago

రకుల్ సినిమాల్లోకి వచ్చింది కారు కోసమే

కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు.…

2 hours ago

హెచ్చరికలతో సరిపెడితే ఎలా బాబు గారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైఖ‌రి.. పార్టీ నాయ‌కులకు బాగా క‌లిసి వ‌స్తోంద‌న్న‌వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికి రెండు సంవ‌త్స‌రాలుగా చంద్ర‌బాబు.. త‌మ్ముళ్ల‌కు…

3 hours ago

పార్టీ సమస్యలు పట్టించుకోండి సీఎం సార్

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…

5 hours ago