ప్రతిపక్ష వైసీపీకి అలాంటి ఇలాంటి షాక్ కాదు.. పెద్ద భారీ షాకే తగిలింది. ఆయన ఏరికోరి ఎంచుకుని మరీ శాసన మండలికి పంపించిన ఇద్దరు తాజాగా రిజైన్ చేశారు. అది కూడా ఎలాంటి హడావుడీ లేకుండా.. ఎలాంటి వార్తలు లీక్ చేయకుండా.. సైలెంట్గా తమ పదవులకు రాజీనామా చేసేశారు. వారు నేరుగా శాసన మండలికి వచ్చి.. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో చైర్మన్.. మోషేన్రాజుకు తమ రాజీనామా పత్రాలను అందించారు.
ఆ వెంటనే వైసీపీకి కూడా రాజీనామా చేసేశారు. వారే.. ఒకరు కర్రి పద్మశ్రీ, మరొకరు బల్లి కళ్యాణ చక్రవర్తి. ఇద్దరినీ కూడా.. జగన్ ఏరికోరి మండలికి పంపించారు. అంతేకాదు.. మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పారు. వీరిలో కర్రి పద్మశ్రీ.. గత ఏడాది ఆగస్టులో మండలికి ఎంపికయ్యారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాత్రం 2021, మార్చి 31న మండలికి ఎన్నికయ్యారు. అయితే.. వీరిద్దరికీ ..ఎన్నికల సమయంలో టికెట్ లు ఇవ్వలేదు. బహుశ ఆ ఆవేదనతోనే ఇద్దరూ రిజైన్ చేసి ఉంటారని తెలుస్తోంది.
ఎవరు వీరు?
కర్రి పద్మశ్రీ: కాకినాడ జిల్లాకు చెందిన పద్మశ్రీ.. ఆది నుంచి వైసీపీలో కీలక కార్యకర్తగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె సేవలను గుర్తించిన జగన్.. గత ఏడాది ఆగస్టులో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన.. మండలి సీటుకు(టీడీపీ నేత, ప్రస్తుత మంత్రి ఫరూక్) ఆమెను నామినేట్ చేశారు. దీంతో ఆమె గత ఏడాది ఇదే నెలలో మండలికి ఎంపికయ్యారు. ఎన్నికల సమయంలో టికెట్ కోరినట్టు సమాచారం. కానీ, జగన్ ఇవ్వలేదు.
బల్లి కల్యాణ్ చక్రవర్తి: వీరిది బలమైన రాజకీయ కుటుంబం. గూడూరు నుంచి వరుస విజయాలు అందుకున్న బల్లి దుర్గాప్రసాదరావు తనయుడే చక్రవర్తి. గతంలో సుదీర్ఘ కాలం టీడీపీలో ఉన్నారు పార్టీ ఓడినా.. ఆయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2019లో చంద్రబాబుతో విభేదించి.. తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి దుర్గా ప్రసాద్ వైసీపీ టికెట్పై పోటీ చేశారు. గెలిచారు కూడా.
అయితే.. హఠాన్మరణంతో ఆయన కుమారుడు చక్రవర్తి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే.. అప్పటి ఉప ఎన్నికలో ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. జగన్ ప్రస్తుత ఎంపీ, డాక్టర్ గురుమూర్తికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల కోటాలో చక్రవర్తిని మండలికి పంపించారు. 2021లోనే మండలికి వచ్చిన చక్రవర్తిఇప్పుడు చెప్పా పెట్టకుండానే గుట్టు చప్పుడు కాకుండానే రాజీనామా చేశారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…