ప్రతిపక్ష వైసీపీకి అలాంటి ఇలాంటి షాక్ కాదు.. పెద్ద భారీ షాకే తగిలింది. ఆయన ఏరికోరి ఎంచుకుని మరీ శాసన మండలికి పంపించిన ఇద్దరు తాజాగా రిజైన్ చేశారు. అది కూడా ఎలాంటి హడావుడీ లేకుండా.. ఎలాంటి వార్తలు లీక్ చేయకుండా.. సైలెంట్గా తమ పదవులకు రాజీనామా చేసేశారు. వారు నేరుగా శాసన మండలికి వచ్చి.. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో చైర్మన్.. మోషేన్రాజుకు తమ రాజీనామా పత్రాలను అందించారు.
ఆ వెంటనే వైసీపీకి కూడా రాజీనామా చేసేశారు. వారే.. ఒకరు కర్రి పద్మశ్రీ, మరొకరు బల్లి కళ్యాణ చక్రవర్తి. ఇద్దరినీ కూడా.. జగన్ ఏరికోరి మండలికి పంపించారు. అంతేకాదు.. మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పారు. వీరిలో కర్రి పద్మశ్రీ.. గత ఏడాది ఆగస్టులో మండలికి ఎంపికయ్యారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాత్రం 2021, మార్చి 31న మండలికి ఎన్నికయ్యారు. అయితే.. వీరిద్దరికీ ..ఎన్నికల సమయంలో టికెట్ లు ఇవ్వలేదు. బహుశ ఆ ఆవేదనతోనే ఇద్దరూ రిజైన్ చేసి ఉంటారని తెలుస్తోంది.
ఎవరు వీరు?
కర్రి పద్మశ్రీ: కాకినాడ జిల్లాకు చెందిన పద్మశ్రీ.. ఆది నుంచి వైసీపీలో కీలక కార్యకర్తగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె సేవలను గుర్తించిన జగన్.. గత ఏడాది ఆగస్టులో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన.. మండలి సీటుకు(టీడీపీ నేత, ప్రస్తుత మంత్రి ఫరూక్) ఆమెను నామినేట్ చేశారు. దీంతో ఆమె గత ఏడాది ఇదే నెలలో మండలికి ఎంపికయ్యారు. ఎన్నికల సమయంలో టికెట్ కోరినట్టు సమాచారం. కానీ, జగన్ ఇవ్వలేదు.
బల్లి కల్యాణ్ చక్రవర్తి: వీరిది బలమైన రాజకీయ కుటుంబం. గూడూరు నుంచి వరుస విజయాలు అందుకున్న బల్లి దుర్గాప్రసాదరావు తనయుడే చక్రవర్తి. గతంలో సుదీర్ఘ కాలం టీడీపీలో ఉన్నారు పార్టీ ఓడినా.. ఆయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో 2019లో చంద్రబాబుతో విభేదించి.. తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి దుర్గా ప్రసాద్ వైసీపీ టికెట్పై పోటీ చేశారు. గెలిచారు కూడా.
అయితే.. హఠాన్మరణంతో ఆయన కుమారుడు చక్రవర్తి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే.. అప్పటి ఉప ఎన్నికలో ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. జగన్ ప్రస్తుత ఎంపీ, డాక్టర్ గురుమూర్తికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల కోటాలో చక్రవర్తిని మండలికి పంపించారు. 2021లోనే మండలికి వచ్చిన చక్రవర్తిఇప్పుడు చెప్పా పెట్టకుండానే గుట్టు చప్పుడు కాకుండానే రాజీనామా చేశారు.
This post was last modified on August 30, 2024 2:45 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…