పార్టీలు మారడం, రాజకీయంగా కొత్త రుచులు చూడడం ఇప్పటి నేతలకు అలవాటే. అవకాశం-అధికారం.. ఈ రెండు కీలక సూత్రాలుగా నాయకులు తమ దారులు తాము చూసుకునేరోజులు ఇవి. ఈ క్రమంలో పార్టీలు మారుతున్నా.. ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. ఇక, ఇప్పుడు మరో ఛాన్స్ కోసం అంటూ.. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి.. టీడీపీ నుంచి జంప్ చేసేందుకు రెడీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్లో ఆమె చక్రం తిప్పారు. బాపట్ల నుంచి ఎంపీగా గెలిచి.. కేంద్రంలో మంత్రి పదవిని కూడా అందుకున్నారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రాజకీయం ఆమె టీడీపీ లోకి జంప్ చేశారు.
ఈ క్రమంలో గత ఏడాది తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ టికెట్పై పోటీ చేశారు. అయితే, ఆమె ఓటమిపాలయ్యారు. ఇక, అప్పటి నుంచి మౌనంగా ఉన్నారు. పార్టీలో యాక్టివ్గా లేరు. ఇక, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే రెండు మూడు మాసాల్లో దీనికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మళ్లీ టీడీపీ తరఫున టికెట్ ఇచ్చినా.. గెలుస్తానో.. లేదో నని భావిస్తున్న పనబాక లక్ష్మి.. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తిరుపతి ఉపపోరులో అసలు టీడీపీ పాల్గొనే అవకాశం ఉండదని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ వైపు లక్ష్మి చూస్తున్నారు. గతంలో ఇక్కడ బీజేపీ గెలుపు గుర్రం ఎక్కిన చరిత్ర ఉండడం, ప్రస్తుతం పార్టీ కేంద్రంలో బలంగా ఉండడంతో పాటు.. రాష్ట్ర నాయకత్వం కూడా ఉద్యమాల బాటపట్టిన నేపథ్యంలో బీజేపీ పుంజుకుందనే భావన వ్యక్తమవుతోంది. ఇక్కడ నుంచి తాను ఎంపీగా పోటీ చేసి విజయం సాధిస్తే.. ఏపీ తరఫున బీజేపీ ఎంపీగా కేంద్రంలో చక్రం తిప్పేందుకు అవకాశం ఉంటుంద ని లక్ష్మి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పార్టీ మారేందుకు ఆమె రెడీగానే ఉన్నప్పటికీ.. బీజేపీ నేతలు ఆమెకు రెడ్ కార్పెట్ పరుస్తారా? అనేది చూడాలి. దాదాపు ఆమెను పార్టీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీనిపై తిరుపతి బీజేపీ కీలక నాయకుడు భాను ప్రకాశ్ రెడ్డి కూడా ఎవరు వచ్చినా చేర్చుకుంటాం.. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు లక్ష్మి చేరికకు ఇబ్బందులు లేవనే సంకేతాలు ఇస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 28, 2020 11:35 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…