పార్టీలు మారడం, రాజకీయంగా కొత్త రుచులు చూడడం ఇప్పటి నేతలకు అలవాటే. అవకాశం-అధికారం.. ఈ రెండు కీలక సూత్రాలుగా నాయకులు తమ దారులు తాము చూసుకునేరోజులు ఇవి. ఈ క్రమంలో పార్టీలు మారుతున్నా.. ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. ఇక, ఇప్పుడు మరో ఛాన్స్ కోసం అంటూ.. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి.. టీడీపీ నుంచి జంప్ చేసేందుకు రెడీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్లో ఆమె చక్రం తిప్పారు. బాపట్ల నుంచి ఎంపీగా గెలిచి.. కేంద్రంలో మంత్రి పదవిని కూడా అందుకున్నారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రాజకీయం ఆమె టీడీపీ లోకి జంప్ చేశారు.
ఈ క్రమంలో గత ఏడాది తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ టికెట్పై పోటీ చేశారు. అయితే, ఆమె ఓటమిపాలయ్యారు. ఇక, అప్పటి నుంచి మౌనంగా ఉన్నారు. పార్టీలో యాక్టివ్గా లేరు. ఇక, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే రెండు మూడు మాసాల్లో దీనికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మళ్లీ టీడీపీ తరఫున టికెట్ ఇచ్చినా.. గెలుస్తానో.. లేదో నని భావిస్తున్న పనబాక లక్ష్మి.. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తిరుపతి ఉపపోరులో అసలు టీడీపీ పాల్గొనే అవకాశం ఉండదని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ వైపు లక్ష్మి చూస్తున్నారు. గతంలో ఇక్కడ బీజేపీ గెలుపు గుర్రం ఎక్కిన చరిత్ర ఉండడం, ప్రస్తుతం పార్టీ కేంద్రంలో బలంగా ఉండడంతో పాటు.. రాష్ట్ర నాయకత్వం కూడా ఉద్యమాల బాటపట్టిన నేపథ్యంలో బీజేపీ పుంజుకుందనే భావన వ్యక్తమవుతోంది. ఇక్కడ నుంచి తాను ఎంపీగా పోటీ చేసి విజయం సాధిస్తే.. ఏపీ తరఫున బీజేపీ ఎంపీగా కేంద్రంలో చక్రం తిప్పేందుకు అవకాశం ఉంటుంద ని లక్ష్మి భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పార్టీ మారేందుకు ఆమె రెడీగానే ఉన్నప్పటికీ.. బీజేపీ నేతలు ఆమెకు రెడ్ కార్పెట్ పరుస్తారా? అనేది చూడాలి. దాదాపు ఆమెను పార్టీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీనిపై తిరుపతి బీజేపీ కీలక నాయకుడు భాను ప్రకాశ్ రెడ్డి కూడా ఎవరు వచ్చినా చేర్చుకుంటాం.. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు లక్ష్మి చేరికకు ఇబ్బందులు లేవనే సంకేతాలు ఇస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 28, 2020 11:35 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…