ఏపీ ప్రజల జీవనాడి .. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. బుధవారం నిర్వహించిన కేబినెట్ భేటీ అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడా రు. ఈ సందర్భంగా గత వైసీపీ పాలనలో పోలవరం ఎలా ధ్వంసమైందీ.. ఆయన వివరించారు. అంతేకాదు.. తమ హయాంలో ప్రాజెక్టును ఎలా అభివృద్ధి చేయాలని భావించింది, అనే విషయాన్నీ కూడా పేర్కొన్నారు. కానీ.. వైసీపీ అన్నీ ఛిద్రం చేసిందని చెప్పారు.
2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందే.. తాను ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయాలని పట్టుబట్టి మరీ ఏపీకి తీసుకువచ్చానని చంద్రబాబు చెప్పారు. అలా చేయడం వల్లే.. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. ఇది దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. అయితే.. వైసీపీ మాత్రం దీనికి విరుద్ధంగా.. వచ్చీ రావడంతోనే.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కీ ఎక్కడంతోనే.. పోలవరం విధ్వంసానికి పూనుకొందన్నారు.
2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. పోలవరం కాంట్రాక్టు సంస్థను తక్షణం అక్కడ నుంచి తప్పించారని.. దీనికిగాను.. అప్పటికప్పుడు జీవోలు కూడా పాస్ చేశారని అన్నారు. కానీ, ఇలా చేయొద్దని కేంద్ర ప్రభుత్వం సహా ఇంజనీరింగ్ నిపుణులు కూడా హెచ్చరించినా.. పట్టించుకోలేదన్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ ప్రాజెక్టు కోసం.. ఇచ్చిన సొమ్మును కూడా దారి మళ్లించారని చంద్రబా బు ఆరోపించారు. ప్రస్తుతం కాంట్రాక్టు సంస్థకు 3 వేల కోట్ల వరకు బకాయి పెట్టారని అన్నారు.
ఈ సొమ్ము లు ఇప్పుడు చెల్లించాల్సి ఉందని.. మరి కేంద్రం ఇచ్చిన సొమ్ము ఏమైందని.. వాటిని ఎటు మళ్లించారని ప్రశ్నించారు. ఇన్ని తప్పులను సరిచేసుకునేందుకు తాను చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం పోలవరం సమస్యలు కొలిక్కి వస్తున్నాయని. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు వివరించారు.
This post was last modified on August 28, 2024 9:06 pm
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…