ఏపీ ప్రజల జీవనాడి .. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. బుధవారం నిర్వహించిన కేబినెట్ భేటీ అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడా రు. ఈ సందర్భంగా గత వైసీపీ పాలనలో పోలవరం ఎలా ధ్వంసమైందీ.. ఆయన వివరించారు. అంతేకాదు.. తమ హయాంలో ప్రాజెక్టును ఎలా అభివృద్ధి చేయాలని భావించింది, అనే విషయాన్నీ కూడా పేర్కొన్నారు. కానీ.. వైసీపీ అన్నీ ఛిద్రం చేసిందని చెప్పారు.
2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందే.. తాను ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయాలని పట్టుబట్టి మరీ ఏపీకి తీసుకువచ్చానని చంద్రబాబు చెప్పారు. అలా చేయడం వల్లే.. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. ఇది దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. అయితే.. వైసీపీ మాత్రం దీనికి విరుద్ధంగా.. వచ్చీ రావడంతోనే.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కీ ఎక్కడంతోనే.. పోలవరం విధ్వంసానికి పూనుకొందన్నారు.
2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. పోలవరం కాంట్రాక్టు సంస్థను తక్షణం అక్కడ నుంచి తప్పించారని.. దీనికిగాను.. అప్పటికప్పుడు జీవోలు కూడా పాస్ చేశారని అన్నారు. కానీ, ఇలా చేయొద్దని కేంద్ర ప్రభుత్వం సహా ఇంజనీరింగ్ నిపుణులు కూడా హెచ్చరించినా.. పట్టించుకోలేదన్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ ప్రాజెక్టు కోసం.. ఇచ్చిన సొమ్మును కూడా దారి మళ్లించారని చంద్రబా బు ఆరోపించారు. ప్రస్తుతం కాంట్రాక్టు సంస్థకు 3 వేల కోట్ల వరకు బకాయి పెట్టారని అన్నారు.
ఈ సొమ్ము లు ఇప్పుడు చెల్లించాల్సి ఉందని.. మరి కేంద్రం ఇచ్చిన సొమ్ము ఏమైందని.. వాటిని ఎటు మళ్లించారని ప్రశ్నించారు. ఇన్ని తప్పులను సరిచేసుకునేందుకు తాను చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం పోలవరం సమస్యలు కొలిక్కి వస్తున్నాయని. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు వివరించారు.
This post was last modified on August 28, 2024 9:06 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…