Political News

పోల‌వ‌రం సొమ్ములూ దోచేశారు: చంద్ర‌బాబు

ఏపీ ప్ర‌జ‌ల జీవ‌నాడి .. పోల‌వ‌రం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పారు. బుధ‌వారం నిర్వ‌హించిన కేబినెట్ భేటీ అనంత‌రం.. ఆయ‌న మీడియాతో మాట్లాడా రు. ఈ సంద‌ర్భంగా గ‌త వైసీపీ పాల‌న‌లో పోల‌వ‌రం ఎలా ధ్వంస‌మైందీ.. ఆయ‌న వివ‌రించారు. అంతేకాదు.. త‌మ హ‌యాంలో ప్రాజెక్టును ఎలా అభివృద్ధి చేయాల‌ని భావించింది, అనే విషయాన్నీ కూడా పేర్కొన్నారు. కానీ.. వైసీపీ అన్నీ ఛిద్రం చేసింద‌ని చెప్పారు.

2014లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసే ముందే.. తాను ముంపు మండ‌లాల‌ను ఏపీలో విలీనం చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఏపీకి తీసుకువ‌చ్చాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. అలా చేయ‌డం వ‌ల్లే.. ఏపీలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. ఇబ్బంది లేకుండా పోయింద‌న్నారు. ఇది దూర‌దృష్టితో తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని తెలిపారు. అయితే.. వైసీపీ మాత్రం దీనికి విరుద్ధంగా.. వ‌చ్చీ రావ‌డంతోనే.. ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కీ ఎక్క‌డంతోనే.. పోల‌వ‌రం విధ్వంసానికి పూనుకొంద‌న్నారు.

2019లో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన వెంట‌నే.. పోల‌వ‌రం కాంట్రాక్టు సంస్థ‌ను త‌క్ష‌ణం అక్క‌డ నుంచి త‌ప్పించార‌ని.. దీనికిగాను.. అప్ప‌టిక‌ప్పుడు జీవోలు కూడా పాస్ చేశార‌ని అన్నారు. కానీ, ఇలా చేయొద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స‌హా ఇంజ‌నీరింగ్ నిపుణులు కూడా హెచ్చ‌రించినా.. ప‌ట్టించుకోలేద‌న్నారు. ఇక‌, కేంద్ర ప్ర‌భుత్వం మొత్తం ఈ ప్రాజెక్టు కోసం.. ఇచ్చిన సొమ్మును కూడా దారి మ‌ళ్లించార‌ని చంద్ర‌బా బు ఆరోపించారు. ప్ర‌స్తుతం కాంట్రాక్టు సంస్థ‌కు 3 వేల కోట్ల వ‌ర‌కు బ‌కాయి పెట్టార‌ని అన్నారు.

ఈ సొమ్ము లు ఇప్పుడు చెల్లించాల్సి ఉంద‌ని.. మ‌రి కేంద్రం ఇచ్చిన సొమ్ము ఏమైంద‌ని.. వాటిని ఎటు మ‌ళ్లించార‌ని ప్ర‌శ్నించారు. ఇన్ని త‌ప్పుల‌ను స‌రిచేసుకునేందుకు తాను చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌స్తుతం పోల‌వ‌రం స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌స్తున్నాయ‌ని. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. 

This post was last modified on August 28, 2024 9:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

10 hours ago