Political News

పోల‌వ‌రం సొమ్ములూ దోచేశారు: చంద్ర‌బాబు

ఏపీ ప్ర‌జ‌ల జీవ‌నాడి .. పోల‌వ‌రం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పారు. బుధ‌వారం నిర్వ‌హించిన కేబినెట్ భేటీ అనంత‌రం.. ఆయ‌న మీడియాతో మాట్లాడా రు. ఈ సంద‌ర్భంగా గ‌త వైసీపీ పాల‌న‌లో పోల‌వ‌రం ఎలా ధ్వంస‌మైందీ.. ఆయ‌న వివ‌రించారు. అంతేకాదు.. త‌మ హ‌యాంలో ప్రాజెక్టును ఎలా అభివృద్ధి చేయాల‌ని భావించింది, అనే విషయాన్నీ కూడా పేర్కొన్నారు. కానీ.. వైసీపీ అన్నీ ఛిద్రం చేసింద‌ని చెప్పారు.

2014లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసే ముందే.. తాను ముంపు మండ‌లాల‌ను ఏపీలో విలీనం చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఏపీకి తీసుకువ‌చ్చాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. అలా చేయ‌డం వ‌ల్లే.. ఏపీలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. ఇబ్బంది లేకుండా పోయింద‌న్నారు. ఇది దూర‌దృష్టితో తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని తెలిపారు. అయితే.. వైసీపీ మాత్రం దీనికి విరుద్ధంగా.. వ‌చ్చీ రావ‌డంతోనే.. ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కీ ఎక్క‌డంతోనే.. పోల‌వ‌రం విధ్వంసానికి పూనుకొంద‌న్నారు.

2019లో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన వెంట‌నే.. పోల‌వ‌రం కాంట్రాక్టు సంస్థ‌ను త‌క్ష‌ణం అక్క‌డ నుంచి త‌ప్పించార‌ని.. దీనికిగాను.. అప్ప‌టిక‌ప్పుడు జీవోలు కూడా పాస్ చేశార‌ని అన్నారు. కానీ, ఇలా చేయొద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స‌హా ఇంజ‌నీరింగ్ నిపుణులు కూడా హెచ్చ‌రించినా.. ప‌ట్టించుకోలేద‌న్నారు. ఇక‌, కేంద్ర ప్ర‌భుత్వం మొత్తం ఈ ప్రాజెక్టు కోసం.. ఇచ్చిన సొమ్మును కూడా దారి మ‌ళ్లించార‌ని చంద్ర‌బా బు ఆరోపించారు. ప్ర‌స్తుతం కాంట్రాక్టు సంస్థ‌కు 3 వేల కోట్ల వ‌ర‌కు బ‌కాయి పెట్టార‌ని అన్నారు.

ఈ సొమ్ము లు ఇప్పుడు చెల్లించాల్సి ఉంద‌ని.. మ‌రి కేంద్రం ఇచ్చిన సొమ్ము ఏమైంద‌ని.. వాటిని ఎటు మ‌ళ్లించార‌ని ప్ర‌శ్నించారు. ఇన్ని త‌ప్పుల‌ను స‌రిచేసుకునేందుకు తాను చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌స్తుతం పోల‌వ‌రం స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌స్తున్నాయ‌ని. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. 

This post was last modified on August 28, 2024 9:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

2 hours ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

3 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

8 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

9 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

13 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

14 hours ago