ఏపీ ప్రజల జీవనాడి .. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. బుధవారం నిర్వహించిన కేబినెట్ భేటీ అనంతరం.. ఆయన మీడియాతో మాట్లాడా రు. ఈ సందర్భంగా గత వైసీపీ పాలనలో పోలవరం ఎలా ధ్వంసమైందీ.. ఆయన వివరించారు. అంతేకాదు.. తమ హయాంలో ప్రాజెక్టును ఎలా అభివృద్ధి చేయాలని భావించింది, అనే విషయాన్నీ కూడా పేర్కొన్నారు. కానీ.. వైసీపీ అన్నీ ఛిద్రం చేసిందని చెప్పారు.
2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందే.. తాను ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయాలని పట్టుబట్టి మరీ ఏపీకి తీసుకువచ్చానని చంద్రబాబు చెప్పారు. అలా చేయడం వల్లే.. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. ఇది దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. అయితే.. వైసీపీ మాత్రం దీనికి విరుద్ధంగా.. వచ్చీ రావడంతోనే.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కీ ఎక్కడంతోనే.. పోలవరం విధ్వంసానికి పూనుకొందన్నారు.
2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. పోలవరం కాంట్రాక్టు సంస్థను తక్షణం అక్కడ నుంచి తప్పించారని.. దీనికిగాను.. అప్పటికప్పుడు జీవోలు కూడా పాస్ చేశారని అన్నారు. కానీ, ఇలా చేయొద్దని కేంద్ర ప్రభుత్వం సహా ఇంజనీరింగ్ నిపుణులు కూడా హెచ్చరించినా.. పట్టించుకోలేదన్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ ప్రాజెక్టు కోసం.. ఇచ్చిన సొమ్మును కూడా దారి మళ్లించారని చంద్రబా బు ఆరోపించారు. ప్రస్తుతం కాంట్రాక్టు సంస్థకు 3 వేల కోట్ల వరకు బకాయి పెట్టారని అన్నారు.
ఈ సొమ్ము లు ఇప్పుడు చెల్లించాల్సి ఉందని.. మరి కేంద్రం ఇచ్చిన సొమ్ము ఏమైందని.. వాటిని ఎటు మళ్లించారని ప్రశ్నించారు. ఇన్ని తప్పులను సరిచేసుకునేందుకు తాను చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం పోలవరం సమస్యలు కొలిక్కి వస్తున్నాయని. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు వివరించారు.
This post was last modified on August 28, 2024 9:06 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…