Political News

పోల‌వ‌రం సొమ్ములూ దోచేశారు: చంద్ర‌బాబు

ఏపీ ప్ర‌జ‌ల జీవ‌నాడి .. పోల‌వ‌రం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పారు. బుధ‌వారం నిర్వ‌హించిన కేబినెట్ భేటీ అనంత‌రం.. ఆయ‌న మీడియాతో మాట్లాడా రు. ఈ సంద‌ర్భంగా గ‌త వైసీపీ పాల‌న‌లో పోల‌వ‌రం ఎలా ధ్వంస‌మైందీ.. ఆయ‌న వివ‌రించారు. అంతేకాదు.. త‌మ హ‌యాంలో ప్రాజెక్టును ఎలా అభివృద్ధి చేయాల‌ని భావించింది, అనే విషయాన్నీ కూడా పేర్కొన్నారు. కానీ.. వైసీపీ అన్నీ ఛిద్రం చేసింద‌ని చెప్పారు.

2014లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసే ముందే.. తాను ముంపు మండ‌లాల‌ను ఏపీలో విలీనం చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఏపీకి తీసుకువ‌చ్చాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. అలా చేయ‌డం వ‌ల్లే.. ఏపీలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. ఇబ్బంది లేకుండా పోయింద‌న్నారు. ఇది దూర‌దృష్టితో తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని తెలిపారు. అయితే.. వైసీపీ మాత్రం దీనికి విరుద్ధంగా.. వ‌చ్చీ రావ‌డంతోనే.. ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కీ ఎక్క‌డంతోనే.. పోల‌వ‌రం విధ్వంసానికి పూనుకొంద‌న్నారు.

2019లో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన వెంట‌నే.. పోల‌వ‌రం కాంట్రాక్టు సంస్థ‌ను త‌క్ష‌ణం అక్క‌డ నుంచి త‌ప్పించార‌ని.. దీనికిగాను.. అప్ప‌టిక‌ప్పుడు జీవోలు కూడా పాస్ చేశార‌ని అన్నారు. కానీ, ఇలా చేయొద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స‌హా ఇంజ‌నీరింగ్ నిపుణులు కూడా హెచ్చ‌రించినా.. ప‌ట్టించుకోలేద‌న్నారు. ఇక‌, కేంద్ర ప్ర‌భుత్వం మొత్తం ఈ ప్రాజెక్టు కోసం.. ఇచ్చిన సొమ్మును కూడా దారి మ‌ళ్లించార‌ని చంద్ర‌బా బు ఆరోపించారు. ప్ర‌స్తుతం కాంట్రాక్టు సంస్థ‌కు 3 వేల కోట్ల వ‌ర‌కు బ‌కాయి పెట్టార‌ని అన్నారు.

ఈ సొమ్ము లు ఇప్పుడు చెల్లించాల్సి ఉంద‌ని.. మ‌రి కేంద్రం ఇచ్చిన సొమ్ము ఏమైంద‌ని.. వాటిని ఎటు మ‌ళ్లించార‌ని ప్ర‌శ్నించారు. ఇన్ని త‌ప్పుల‌ను స‌రిచేసుకునేందుకు తాను చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌స్తుతం పోల‌వ‌రం స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌స్తున్నాయ‌ని. 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. 

This post was last modified on August 28, 2024 9:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

2 hours ago

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

4 hours ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

6 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

6 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

7 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

7 hours ago