టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ తరచుగా చెబుతున్న మాటే .. మరోసారి అనేశారు. అదే `రెడ్ బుక్`! యువగళం పాదయాత్ర చేసినప్పుడు.. నారా లోకేష్ తమను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లను రెడ్ బుక్లో నమోదు చేసుకున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వారిని ఎలా శిక్షించాలో అలానే శిక్షిస్తామని కూడా చెప్పారు. ఇక, అధికారంలోకి వచ్చాక.. జరుగుతున్న పరిణామాలు.. నమోదవుతున్న కేసులను చూస్తే రెడ్బుక్ అమలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
అయితే.. దీనిని నారా లోకేష్ ఏమీ తోసిపుచ్చడం లేదు. ఔను! రెడ్ బుక్లో ఉన్న వారిని వదిలి పెట్టబోమని ఆయన చెబుతున్నారు. జోగి రమేష్ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు అనేక మంది పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది. వారిపై ప్రస్తుతం విచారణలు కూడా సాగుతున్నాయి. అయితే.. మరింత మంది పేర్లు రెడ్బుక్ లో ఉన్నాయన్నది.. టీడీపీ నాయకులు చెబుతున్న మాట. దీనికి దన్నుగా ఇప్పుడు నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళగిరిలో నిర్వహించిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.. రెడ్బుక్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. ఐఏఎస్ లు, ఐపీఎస్లను కూడా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. రెడ్ బుక్లో ఉన్నవారంతా.. టీడీపీని, పార్టీ నాయకులను, ప్రజలను ఇబ్బంది పెట్టిన వారేనని తెలిపారు. ఎందుకు వదిలేస్తామని ప్రశ్నించారు. రెడ్ బుక్ అమలు చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నట్టు చెప్పారు. అందుకే తాము చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…