టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ తరచుగా చెబుతున్న మాటే .. మరోసారి అనేశారు. అదే `రెడ్ బుక్`! యువగళం పాదయాత్ర చేసినప్పుడు.. నారా లోకేష్ తమను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లను రెడ్ బుక్లో నమోదు చేసుకున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వారిని ఎలా శిక్షించాలో అలానే శిక్షిస్తామని కూడా చెప్పారు. ఇక, అధికారంలోకి వచ్చాక.. జరుగుతున్న పరిణామాలు.. నమోదవుతున్న కేసులను చూస్తే రెడ్బుక్ అమలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
అయితే.. దీనిని నారా లోకేష్ ఏమీ తోసిపుచ్చడం లేదు. ఔను! రెడ్ బుక్లో ఉన్న వారిని వదిలి పెట్టబోమని ఆయన చెబుతున్నారు. జోగి రమేష్ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు అనేక మంది పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది. వారిపై ప్రస్తుతం విచారణలు కూడా సాగుతున్నాయి. అయితే.. మరింత మంది పేర్లు రెడ్బుక్ లో ఉన్నాయన్నది.. టీడీపీ నాయకులు చెబుతున్న మాట. దీనికి దన్నుగా ఇప్పుడు నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళగిరిలో నిర్వహించిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.. రెడ్బుక్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. ఐఏఎస్ లు, ఐపీఎస్లను కూడా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. రెడ్ బుక్లో ఉన్నవారంతా.. టీడీపీని, పార్టీ నాయకులను, ప్రజలను ఇబ్బంది పెట్టిన వారేనని తెలిపారు. ఎందుకు వదిలేస్తామని ప్రశ్నించారు. రెడ్ బుక్ అమలు చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నట్టు చెప్పారు. అందుకే తాము చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
This post was last modified on August 28, 2024 7:55 pm
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…
అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…