టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ తరచుగా చెబుతున్న మాటే .. మరోసారి అనేశారు. అదే `రెడ్ బుక్`! యువగళం పాదయాత్ర చేసినప్పుడు.. నారా లోకేష్ తమను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లను రెడ్ బుక్లో నమోదు చేసుకున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వారిని ఎలా శిక్షించాలో అలానే శిక్షిస్తామని కూడా చెప్పారు. ఇక, అధికారంలోకి వచ్చాక.. జరుగుతున్న పరిణామాలు.. నమోదవుతున్న కేసులను చూస్తే రెడ్బుక్ అమలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
అయితే.. దీనిని నారా లోకేష్ ఏమీ తోసిపుచ్చడం లేదు. ఔను! రెడ్ బుక్లో ఉన్న వారిని వదిలి పెట్టబోమని ఆయన చెబుతున్నారు. జోగి రమేష్ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు అనేక మంది పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయన్న ప్రచారం కూడా ఉంది. వారిపై ప్రస్తుతం విచారణలు కూడా సాగుతున్నాయి. అయితే.. మరింత మంది పేర్లు రెడ్బుక్ లో ఉన్నాయన్నది.. టీడీపీ నాయకులు చెబుతున్న మాట. దీనికి దన్నుగా ఇప్పుడు నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళగిరిలో నిర్వహించిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.. రెడ్బుక్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. ఐఏఎస్ లు, ఐపీఎస్లను కూడా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. రెడ్ బుక్లో ఉన్నవారంతా.. టీడీపీని, పార్టీ నాయకులను, ప్రజలను ఇబ్బంది పెట్టిన వారేనని తెలిపారు. ఎందుకు వదిలేస్తామని ప్రశ్నించారు. రెడ్ బుక్ అమలు చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నట్టు చెప్పారు. అందుకే తాము చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
This post was last modified on August 28, 2024 7:55 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…