తెలంగాణలో టిడిపిని పుంజుకునేలా చేయాలనేది చంద్రబాబు వ్యూహం, ఈ క్రమంలోనే ఆయన ఏపీలో పార్టీ విజయం సాధించిన తర్వాత వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణ పార్టీని గాడిలో పెట్టడంతో పాటు త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేశారు. త్వరలోనే కొత్త కమిటీలను ఎంపిక చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అయితే పార్టీ పుంజుకుంటుందా పుంజుకోదా అనేది పక్కన పెడితే ప్రజల్లో అసలు టిడిపి గురించి చర్చ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, అంతకు ముందు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు పార్టీ అసలు స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దాదాపు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాం తాల్లో కూడా హైదరాబాద్ మినహా మిగిలిన చోట్ల టిడిపి గురించి పెద్దగా చర్చ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పార్టీని ప్రజలు చర్చించుకోవాల్సిన విధంగా ముందుకు నడిపించాల్సి ఉంటుంది.
దీనికిగాను ఇప్పుడు ఏం చేయాలి అంటే.. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేకంగా నిర్ణయాలు ఉంటే వాటిమీద తప్పకుండా పోరాటాలు చేయటం అదేవిధంగా ప్రజా సమస్యలపై స్పందించడం ఉద్యమాలు నిర్మించడం వంటివి కచ్చితంగా చేయాలి. అదేవిధంగా వారానికి రెండు సార్లు అయినా పార్టీ తరఫున ప్రెస్ మీట్ లు పెట్టడం ప్రజా సమస్యలను ప్రస్తావించడం ప్రభుత్వం నిర్ణయాలు కనుక ప్రజలకు వ్యతిరేకంగా ఉండి వారి ఇబ్బంది పడుతుంటే వాటిని కూడా ప్రస్తావించే విధంగా వ్యవహరించాలి.
ఇది మానేస్తే పార్టీ ప్రజల్లోకి వెళ్లడం చాలా కష్టంగా మారుతుంది. గతంలో కూడా పార్టీ ఇలాంటి తప్పులే చేసింది. బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించే విషయంలో పార్టీ చాలా ఆచితూచి వ్యవహరించింది. దీంతో పార్టీ నిర్మాణాత్మకంగా తగ్గిపోయింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మోత్కుపల్లి నర్సింహులు సహా అనేకమంది పార్టీ మారిపోయారు. ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తే పార్టీ పుంజుకోవడం కష్టం అనే వాదన వినిపిస్తోంది. మరి చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…