వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు ఊరట లభించింది. హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలన్న జగన్ పిటిషన్పై సానుకూలంగా తీర్పు వెలువరించింది. కొన్నాళ్ల కిందటే దీనికి సంబంధించిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు అప్పట్లో ఇరు పక్షాల వాదనలు(జగన్, సీబీఐ) విని తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం పొద్దు పోయాక.. తీర్పు వెలువరించింది. జగన్ కుటుంబం సహా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే.. అక్రమాస్తుల కేసుల్లో సాక్షులను ఎవరినీ ప్రభావితం చేయరాదని కోర్టు స్పష్టం చేసింది.
ఎక్కడికి వెళ్తారు..?
జగన్ తన కుమార్తెలు చదువుతున్న బ్రిటన్ కు వెళ్లాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలు పూర్తయిన తర్వాత.. ఇదే కారణంతో ఆయన అనుమతి తెచ్చుకుని పది రోజులకు పైగానే అక్కడ పర్యటించి వచ్చారు. ఇప్పుడు మరోసారి బ్రిటన్కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పది రోజుల కిందటే హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ వాదనలు వినిపిస్తూ.. కేసులు కీలక దశలో ఉన్నాయని.. విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని.. అనుమతి ఇవ్వొద్దని పేర్కొంది. అంతేకాదు.. విదేశాలకు వెళ్తే.. తిరిగి వస్తారో లేదోనన్న భయం కూడా ఉందని తెలిపింది.
అయితే.. ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాక.. ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు..? ఎన్నిసార్లు తిరిగి వచ్చారు? ఆ సమయం లో ఇబ్బంది పెట్టారా? సాక్షిని ప్రభావితం చేశారా? అన్న వివరాలు సేకరించిన కోర్టు జగన్కు తాజాగా అనుకూల తీర్పు వెలువ రించింది. అయితే.. ఇప్పుడు కూడా బెయిల్ నిబంధనలు పాటించాలని.. విదేశాలకు వెళ్తున్న క్రమంలో ముందస్తు సమాచారం ఇచ్చి వెళ్లాలని.. పేర్కొంది. అంతేకాదు.. ఏదేశానికి ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో కారణాలు పేర్కొని.. ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావాలని, వేరే వారిని కలుసుకునేందుకు అనుమతి కోరాలని.. తేల్చి చెప్పింది. కాగా, బ్రిటన్లో కుమార్తెలను కలుసుకోవడంతోపాటు.. అక్కడి వైసీపీ ఎన్నారై సెల్తో కూడా జగన్ భేటీ కానున్నారు. కానీ, దీనికి అనుమతి తీసుకున్నట్టు తెలియలేదు. ఏదేమైనా.. జగన్కు ఒకింత ఊరట అయితే లభించింది.
This post was last modified on August 27, 2024 11:52 pm
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…