వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు ఊరట లభించింది. హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలన్న జగన్ పిటిషన్పై సానుకూలంగా తీర్పు వెలువరించింది. కొన్నాళ్ల కిందటే దీనికి సంబంధించిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు అప్పట్లో ఇరు పక్షాల వాదనలు(జగన్, సీబీఐ) విని తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం పొద్దు పోయాక.. తీర్పు వెలువరించింది. జగన్ కుటుంబం సహా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే.. అక్రమాస్తుల కేసుల్లో సాక్షులను ఎవరినీ ప్రభావితం చేయరాదని కోర్టు స్పష్టం చేసింది.
ఎక్కడికి వెళ్తారు..?
జగన్ తన కుమార్తెలు చదువుతున్న బ్రిటన్ కు వెళ్లాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలు పూర్తయిన తర్వాత.. ఇదే కారణంతో ఆయన అనుమతి తెచ్చుకుని పది రోజులకు పైగానే అక్కడ పర్యటించి వచ్చారు. ఇప్పుడు మరోసారి బ్రిటన్కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పది రోజుల కిందటే హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ వాదనలు వినిపిస్తూ.. కేసులు కీలక దశలో ఉన్నాయని.. విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని.. అనుమతి ఇవ్వొద్దని పేర్కొంది. అంతేకాదు.. విదేశాలకు వెళ్తే.. తిరిగి వస్తారో లేదోనన్న భయం కూడా ఉందని తెలిపింది.
అయితే.. ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాక.. ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు..? ఎన్నిసార్లు తిరిగి వచ్చారు? ఆ సమయం లో ఇబ్బంది పెట్టారా? సాక్షిని ప్రభావితం చేశారా? అన్న వివరాలు సేకరించిన కోర్టు జగన్కు తాజాగా అనుకూల తీర్పు వెలువ రించింది. అయితే.. ఇప్పుడు కూడా బెయిల్ నిబంధనలు పాటించాలని.. విదేశాలకు వెళ్తున్న క్రమంలో ముందస్తు సమాచారం ఇచ్చి వెళ్లాలని.. పేర్కొంది. అంతేకాదు.. ఏదేశానికి ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో కారణాలు పేర్కొని.. ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావాలని, వేరే వారిని కలుసుకునేందుకు అనుమతి కోరాలని.. తేల్చి చెప్పింది. కాగా, బ్రిటన్లో కుమార్తెలను కలుసుకోవడంతోపాటు.. అక్కడి వైసీపీ ఎన్నారై సెల్తో కూడా జగన్ భేటీ కానున్నారు. కానీ, దీనికి అనుమతి తీసుకున్నట్టు తెలియలేదు. ఏదేమైనా.. జగన్కు ఒకింత ఊరట అయితే లభించింది.
This post was last modified on August 27, 2024 11:52 pm
మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…