Political News

జ‌గ‌న్ ముద్ర కాదు.. చంద్ర‌బాబు విజ‌నే..

రాష్ట్రంలో స‌ర్కారు మారిన నాటి నుంచి అనేక విష‌యాల్లో,.. అనేక ప‌థ‌కాల్లో జ‌గ‌న్ ముద్ర‌ను తీసేసి.. చంద్రబాబు త‌న‌దైన శైలిలో మార్పులు చేస్తున్నారు. జ‌గ‌న్ పేరుతో ఉన్న ప‌థ‌కాల‌ను పూర్తిగా ఎత్తేశారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ జాడ కూడా క‌నిపించ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల‌కుపైగా గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలను కూడా రూపురేఖ‌లు మార్చేయ‌నున్నారు. ప్ర‌ధానంగా స‌చివాల‌యాలంటే.. జ‌గ‌న్‌! అనే మాట వినిపించ‌కుండా చేయ‌నున్నారు.

దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. ఖ‌చ్చితంగా ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా.. మార్పులు చేసుకుంటుంది. గతంలో చంద్ర‌బాబు పేరుతో ఉన్న అనేక ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ మార్చేశారు. కాబ‌ట్టి ఇప్పు డు ప్ర‌శ్నించే అవ‌కాశం కూడా.. జ‌గ‌న్‌కు లేకుండా పోయింది. తాజా ప‌రిణామాల విష‌యానికి వ‌స్తే.. గ్రామ‌, వార్డు సచివాలయాల్లో సిబ్బంది సేవలు.. సర్దుబాటు పై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి మిగిలిన వారిని వేరేశాఖ‌ల్లోకి పంపించ‌నున్నారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. వీరిని తీసేసేందుకు కుద‌రదు. ఎందుకంటే వీరంతా కూడా ప‌ర్మినెంట్ ఉద్యోగులే. దీంతో  వారి సేవలను మరింత‌గా వినియోగించుకోవాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను ఇరిగేషన్‌ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేస్తారు. మొత్తం 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని నిర్ణ‌యించారు. ఇత‌ర శాఖ‌ల్లోనూ ఇలానే చేయ‌నున్నారు.

ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 1,26,000 మంది సెక్ర‌ట‌రీలు ఉన్నారు. ఒక్కొక్క స‌చివాల‌యంలో 8 మందికి పైబడి ఉన్నారు. చాలా సచివా లయాల్లో 10 నుంచి 14 మంది వరకు ఉన్నారు. వీరిలో నలుగురైదుగురిని మాత్రమే సచివాలయాల్లో ఉంచి మిగతా సిబ్బందిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసుకోవాల‌న్న‌ది చంద్ర‌బాబు విజ‌న్‌. ఈ నేప‌థ్యంలో ఇత‌ర శాఖ‌ల్లోని ఉద్యోగుల కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

This post was last modified on August 27, 2024 11:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

36 minutes ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

45 minutes ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

3 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

3 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

3 hours ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

3 hours ago