Political News

జ‌గ‌న్ ముద్ర కాదు.. చంద్ర‌బాబు విజ‌నే..

రాష్ట్రంలో స‌ర్కారు మారిన నాటి నుంచి అనేక విష‌యాల్లో,.. అనేక ప‌థ‌కాల్లో జ‌గ‌న్ ముద్ర‌ను తీసేసి.. చంద్రబాబు త‌న‌దైన శైలిలో మార్పులు చేస్తున్నారు. జ‌గ‌న్ పేరుతో ఉన్న ప‌థ‌కాల‌ను పూర్తిగా ఎత్తేశారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ జాడ కూడా క‌నిపించ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల‌కుపైగా గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలను కూడా రూపురేఖ‌లు మార్చేయ‌నున్నారు. ప్ర‌ధానంగా స‌చివాల‌యాలంటే.. జ‌గ‌న్‌! అనే మాట వినిపించ‌కుండా చేయ‌నున్నారు.

దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. ఖ‌చ్చితంగా ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా.. మార్పులు చేసుకుంటుంది. గతంలో చంద్ర‌బాబు పేరుతో ఉన్న అనేక ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ మార్చేశారు. కాబ‌ట్టి ఇప్పు డు ప్ర‌శ్నించే అవ‌కాశం కూడా.. జ‌గ‌న్‌కు లేకుండా పోయింది. తాజా ప‌రిణామాల విష‌యానికి వ‌స్తే.. గ్రామ‌, వార్డు సచివాలయాల్లో సిబ్బంది సేవలు.. సర్దుబాటు పై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి మిగిలిన వారిని వేరేశాఖ‌ల్లోకి పంపించ‌నున్నారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. వీరిని తీసేసేందుకు కుద‌రదు. ఎందుకంటే వీరంతా కూడా ప‌ర్మినెంట్ ఉద్యోగులే. దీంతో  వారి సేవలను మరింత‌గా వినియోగించుకోవాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను ఇరిగేషన్‌ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేస్తారు. మొత్తం 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని నిర్ణ‌యించారు. ఇత‌ర శాఖ‌ల్లోనూ ఇలానే చేయ‌నున్నారు.

ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 1,26,000 మంది సెక్ర‌ట‌రీలు ఉన్నారు. ఒక్కొక్క స‌చివాల‌యంలో 8 మందికి పైబడి ఉన్నారు. చాలా సచివా లయాల్లో 10 నుంచి 14 మంది వరకు ఉన్నారు. వీరిలో నలుగురైదుగురిని మాత్రమే సచివాలయాల్లో ఉంచి మిగతా సిబ్బందిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసుకోవాల‌న్న‌ది చంద్ర‌బాబు విజ‌న్‌. ఈ నేప‌థ్యంలో ఇత‌ర శాఖ‌ల్లోని ఉద్యోగుల కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

This post was last modified on August 27, 2024 11:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మే నెల బోణీ చేదుగా ఉంది

కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…

39 minutes ago

ఎమ్మెల్యేగా ఆ రాష్ట్ర సీఎం ఓటమి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…

2 hours ago

విజయ్ విజయమే.. మేనిఫెస్టోలో ఏం చెప్పాడంటే?

తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్‌లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…

2 hours ago

విజయ్ గెలిస్తే… వైసీపీకి ఒరిగేదేంటి?

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…

3 hours ago

రజినీ వదిలేస్తే.. విజయ్ వాడుకున్నాడు..

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…

3 hours ago

అక్కడ కూడా కాంగ్రెస్ లో సీఎం సీటు పంచాయతీ!

కాంగ్రెస్ పార్టీ..దేశంలోనే అతి పురాతన రాజకీయ పార్టీ… అదే ఆ పార్టీకి పెద్ద మైనస్. పాత పార్టీ… పాత పాట……

3 hours ago