Political News

జ‌గ‌న్ ముద్ర కాదు.. చంద్ర‌బాబు విజ‌నే..

రాష్ట్రంలో స‌ర్కారు మారిన నాటి నుంచి అనేక విష‌యాల్లో,.. అనేక ప‌థ‌కాల్లో జ‌గ‌న్ ముద్ర‌ను తీసేసి.. చంద్రబాబు త‌న‌దైన శైలిలో మార్పులు చేస్తున్నారు. జ‌గ‌న్ పేరుతో ఉన్న ప‌థ‌కాల‌ను పూర్తిగా ఎత్తేశారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ జాడ కూడా క‌నిపించ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల‌కుపైగా గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలను కూడా రూపురేఖ‌లు మార్చేయ‌నున్నారు. ప్ర‌ధానంగా స‌చివాల‌యాలంటే.. జ‌గ‌న్‌! అనే మాట వినిపించ‌కుండా చేయ‌నున్నారు.

దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. ఖ‌చ్చితంగా ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా.. మార్పులు చేసుకుంటుంది. గతంలో చంద్ర‌బాబు పేరుతో ఉన్న అనేక ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ మార్చేశారు. కాబ‌ట్టి ఇప్పు డు ప్ర‌శ్నించే అవ‌కాశం కూడా.. జ‌గ‌న్‌కు లేకుండా పోయింది. తాజా ప‌రిణామాల విష‌యానికి వ‌స్తే.. గ్రామ‌, వార్డు సచివాలయాల్లో సిబ్బంది సేవలు.. సర్దుబాటు పై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి మిగిలిన వారిని వేరేశాఖ‌ల్లోకి పంపించ‌నున్నారు.

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. వీరిని తీసేసేందుకు కుద‌రదు. ఎందుకంటే వీరంతా కూడా ప‌ర్మినెంట్ ఉద్యోగులే. దీంతో  వారి సేవలను మరింత‌గా వినియోగించుకోవాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను ఇరిగేషన్‌ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేస్తారు. మొత్తం 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని నిర్ణ‌యించారు. ఇత‌ర శాఖ‌ల్లోనూ ఇలానే చేయ‌నున్నారు.

ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 1,26,000 మంది సెక్ర‌ట‌రీలు ఉన్నారు. ఒక్కొక్క స‌చివాల‌యంలో 8 మందికి పైబడి ఉన్నారు. చాలా సచివా లయాల్లో 10 నుంచి 14 మంది వరకు ఉన్నారు. వీరిలో నలుగురైదుగురిని మాత్రమే సచివాలయాల్లో ఉంచి మిగతా సిబ్బందిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసుకోవాల‌న్న‌ది చంద్ర‌బాబు విజ‌న్‌. ఈ నేప‌థ్యంలో ఇత‌ర శాఖ‌ల్లోని ఉద్యోగుల కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

This post was last modified on August 27, 2024 11:39 pm

Share

Recent Posts

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

2 hours ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

3 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

4 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

4 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

8 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

15 hours ago