ఏపీలో కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అన్న క్యాంటీన్లకు సాధారణ ప్రజలు పోటెత్తుతున్నారు. రూ.15 కే మూడు పూటలా ఆహారం లభిస్తుండడం.. రుచిగా, శుచిగా ఉండడంతో ఎక్కువ మంది వ్యాపారులు.. హాకర్లు, ఆటో రిక్షా కార్మికులు కూడా ఇప్పుడు అన్న క్యాంటీన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇది సాధారణంగా జరిగే పనే. అసలు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిందే ఈ ఉద్దేశంతో. అయితే.. ఇప్పుడు ఈ క్యాంటీన్లకు మరింత స్ఫూర్తి నింపింది కలెక్టర్ కుటుంబం. కృష్ణాజిల్లా కలెక్టర్ కుటుంబం సోమవారం మధ్యాహ్నం.. స్థానిక మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్కు వచ్చి ఆహారం తినడం ఆసక్తిగా మారింది.
భార్య,కుమార్తెతో క్యాంటీన్కు వచ్చిన కలెక్టర్ డీకే బాలాజీ స్వయంగా రూ.5 టోకెన్లు మూడు తీసుకుని అక్కడే భోజనం చేశారు. అయితే.. సాధారణంగా కలెక్టర్లు ఎప్పుడు ఇలా క్యాంటీన్లలో భోజనం చేసింది లేదు. నాయకులు మాత్రం తరచుగా వెళ్లడం.. క్యాంటీన్లలో భోజనం చేయడం తెలిసిందే.
అది కూడా అక్కడి ప్రజలకు కనిపించడం కోసం వెళ్తారనే పేరుంది. కానీ… జిల్లా కలెక్టరే స్వయంగా అన్న క్యాంటీన్లో భోజనం చేయడంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ సందర్భంగా క్యాంటీన్కు వచ్చిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. కూర, సాంబారు రుచి గురించి అడిగి తెలుసుకున్నారు. అదేసమయంలో క్యాంటీన్కు పూటకు ఎంత మంది వస్తున్నారన్న వివరాలు తెలుసుకున్నారు.
ఇదిలావుంటే.. కృష్ణా కలెక్టర్ నేరుగా అన్న క్యాంటీన్కువెళ్లి భోజనం చేసిన విషయం చంద్రబాబు వరకు చేరింది. దీంతో ఆయన వెంటనే స్పందించారు. కలెక్టర్కు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనను అభినందించారు.
తరచుగా కలెక్టర్లు క్యాంటీన్లకు వెళ్లడం ద్వారా.. అక్కడ మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయని.. ఏవైనా సమస్యలు ఉంటే తీర్చేందుకు కూడా అవకాశం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. డీకే బాలాజీ ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ఈ విషయాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు పాటించేందుకు ప్రయత్నించాలని కూడా సూచించడం గమనార్హం.
This post was last modified on August 27, 2024 10:39 am
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…