Political News

‘ఎన్’ కన్వెన్షన్‌పై రేవంత్ పట్టుదల ఇప్పటిది కాదు

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ను కూల్చేయడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తుమ్మడిచెరువును ఆక్రమించి కట్టిన ఈ కన్వెన్షన్ సెంటర్ అక్రమమని ఎప్పట్నుంచో ఆరోపణలు ఉన్నాయి.

ఐతే చిన్న వర్షానికే హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు, కాలనీలు నీటి మడుగుల్లా మారిపోతుండడానికి చెరువుల ఆక్రమణలే కారణమని.. చెరువులుండాల్సిన చోట్ల కట్టడాలు విపరీతంగా పెరిగిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని భావించి రేవంత్ సర్కారు ఆక్రమణల కూల్చివేతకు నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కట్టడాలను కూల్చివేయగా.. ఇప్పుడు ‘ఎన్’ కన్వెన్షన్ కూడా ఆ జాబితాలోకి చేరింది. ‘ఎన్’ కన్వెన్షన్ కూల్చివేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ఎప్పట్నుంచో పోరాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో చర్యలు మొదలుపెట్టినట్లే మొదలుపెట్టి ఆపేశారనే ఆరోపణలున్నాయి.

ఐతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువులను ఆక్రమించి చేసిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుండగా.. నాగ్ పలుకుబడి దృష్ట్యా ఎలాగోలా తన కన్వెన్షన్ సెంటర్ మీదికి అధికారులు రాకుండా చూసుకుంటాడని భావించారు. కానీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైడ్రా అధికారులు ఈ కట్టడాన్ని కూల్చేశారు. ఐతే ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలే కారణం అనే చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా పలు సందర్భాల్లో రేవంత్ ‘ఎన్’ కన్వెన్షన్ గురించి ప్రస్తావించారు.

టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగానే చెరువు మధ్యలో గోడ కట్టి మరీ ఈ కన్వెన్షన్ నిర్మించిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు రేవంత్. అది అక్రమ కట్టడమని క్లియర్‌గా తెలుస్తున్నా ఎందుకు కూల్చివేయట్లేదని ప్రశ్నించారు. కొన్నేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మరోసారి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఎన్ కన్వెన్షన్‌ను కూల్చి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి దీన్ని కూల్చివేయడంతో సోషల్ మీడియాలో సానుకూల స్పందన వస్తోంది.

This post was last modified on August 24, 2024 12:58 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

14 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

53 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago