టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ‘ఎన్ కన్వెన్షన్’ను కూల్చేయడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తుమ్మడిచెరువును ఆక్రమించి కట్టిన ఈ కన్వెన్షన్ సెంటర్ అక్రమమని ఎప్పట్నుంచో ఆరోపణలు ఉన్నాయి.
ఐతే చిన్న వర్షానికే హైదరాబాద్లో పలు ప్రాంతాలు, కాలనీలు నీటి మడుగుల్లా మారిపోతుండడానికి చెరువుల ఆక్రమణలే కారణమని.. చెరువులుండాల్సిన చోట్ల కట్టడాలు విపరీతంగా పెరిగిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని భావించి రేవంత్ సర్కారు ఆక్రమణల కూల్చివేతకు నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కట్టడాలను కూల్చివేయగా.. ఇప్పుడు ‘ఎన్’ కన్వెన్షన్ కూడా ఆ జాబితాలోకి చేరింది. ‘ఎన్’ కన్వెన్షన్ కూల్చివేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ఎప్పట్నుంచో పోరాడుతోంది. గత ప్రభుత్వ హయాంలో చర్యలు మొదలుపెట్టినట్లే మొదలుపెట్టి ఆపేశారనే ఆరోపణలున్నాయి.
ఐతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువులను ఆక్రమించి చేసిన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుండగా.. నాగ్ పలుకుబడి దృష్ట్యా ఎలాగోలా తన కన్వెన్షన్ సెంటర్ మీదికి అధికారులు రాకుండా చూసుకుంటాడని భావించారు. కానీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైడ్రా అధికారులు ఈ కట్టడాన్ని కూల్చేశారు. ఐతే ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలే కారణం అనే చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా పలు సందర్భాల్లో రేవంత్ ‘ఎన్’ కన్వెన్షన్ గురించి ప్రస్తావించారు.
టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగానే చెరువు మధ్యలో గోడ కట్టి మరీ ఈ కన్వెన్షన్ నిర్మించిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు రేవంత్. అది అక్రమ కట్టడమని క్లియర్గా తెలుస్తున్నా ఎందుకు కూల్చివేయట్లేదని ప్రశ్నించారు. కొన్నేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మరోసారి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఎన్ కన్వెన్షన్ను కూల్చి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి దీన్ని కూల్చివేయడంతో సోషల్ మీడియాలో సానుకూల స్పందన వస్తోంది.
పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…
ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…
గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13…
రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…
తెలంగాణలో ఓ కీలక నియామకానికి సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
ఏపీ సీఎం చంద్రబాబు సాధారణ ప్రజలతో ఇటీవల కాలంలో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు…