వైసీపీ అధినేత జగన్ ముందస్తు జాగ్రత్తలో పడ్డారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంబంధించి జరుగుతున్న న్యాయ పోరాటంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు అనేక మంది పై కేసులు నమోదయ్యాయి. చాలా మంది కార్యకర్తలు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ముఖ్యమంతైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రాజీవ్ లు మాత్రమే బెయిల్కు వస్తుండగా.. ఆయా కేసుల్లో చిక్కుకున్న చాలా మంది కార్యకర్తలు మాత్రం జైళ్లలోనే మగ్గుతున్నారు.
దీంతో కార్యకర్తల కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. తమకు సాయం చేయాలని కోరుతున్నాయి. దీనికి తోడు.. మద్యం, ఇసుక, గనులకు సంబంధించిన కేసులు ఇంకా పొంచి ఉన్నాయి. వీటిలో ఎప్పుడైనా అరెస్టు సాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అలాంటి సమయంలో న్యాయం సాయం కోసం.. అప్పటికప్పుడు చేతులు చాపకుండా.. ముందుగానే అలెర్ట్ అయ్యారు. కేంద్ర కార్యాలయంలో నిరంతరం అందుబాటులో ఉండేలా ఒక న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అదేవిధంగా జిల్లాల స్థాయిలో కేసులు వాదించేందుకు.. కార్యకర్తలకు బెయిళ్లు వచ్చేలా.. ముందస్తు బెయిళ్లు సంపాయించుకునేలా చూసేందుకు జిల్లాకో న్యాయ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందాలన్నీ కూడా.., మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నడవనున్నాయి. ఆయన సూచనల మేరకు నడుచుకుని.. పార్టీకి న్యాయ సాయం చేయనున్నారు. వీరిలో ఎక్కువ మంది స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం.
అయితే.. కోర్టు ఫీజులు, ఇతర ఖర్చులను మాత్రం వైసీపీ ఇస్తుంది. కార్యకర్తల కుటుంబాలపై కానీ.. కార్యకర్తల పై కానీ.. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేసుకుంటుంది. తద్వారా వారిలో భరోసా నింపాలని భావిస్తోంది. పిన్నెల్లికి తాజాగా బెయిల్ వచ్చేలా చేయడం వెనుక.. ఇలాంటి కేంద్ర బృందమే సాయం చేసింది. భవిష్యత్తులో మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదాన్ని గుర్తించిన జగన్.. ఇప్పటి నుంచే జాగ్రత్త పడడం గమనార్హం. తాజాగా వైసీపీ లీగల్ సెల్ నాయకులతో మాట్లాడిన జగన్.. ఈ బృందాలను నియమించే బాధ్యతలను వారికి అప్పగించారు. కాగా, గతంలో చంద్రబాబు కూడా.. జిల్లాకో న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
This post was last modified on August 24, 2024 12:42 pm
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…