Political News

జాగ్ర‌త్త ప‌డుతున్న జ‌గ‌న్ ..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందస్తు జాగ్ర‌త్త‌లో ప‌డ్డారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు సంబంధించి జ‌రుగుతున్న న్యాయ పోరాటంలో ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది పై కేసులు న‌మోద‌య్యాయి. చాలా మంది కార్య‌క‌ర్త‌లు ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. ముఖ్య‌మంతైన పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, జోగి రాజీవ్ లు మాత్ర‌మే బెయిల్‌కు వ‌స్తుండ‌గా.. ఆయా కేసుల్లో చిక్కుకున్న చాలా మంది కార్య‌క‌ర్త‌లు మాత్రం జైళ్ల‌లోనే మ‌గ్గుతున్నారు.

దీంతో కార్య‌క‌ర్త‌ల కుటుంబాలు త‌ల్ల‌డిల్లుతున్నాయి. త‌మ‌కు సాయం చేయాల‌ని కోరుతున్నాయి. దీనికి తోడు.. మ‌ద్యం, ఇసుక‌, గ‌నుల‌కు సంబంధించిన కేసులు ఇంకా పొంచి ఉన్నాయి. వీటిలో ఎప్పుడైనా అరెస్టు సాగే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో అలాంటి స‌మ‌యంలో న్యాయం సాయం కోసం.. అప్ప‌టికప్పుడు చేతులు చాప‌కుండా.. ముందుగానే అలెర్ట్ అయ్యారు. కేంద్ర కార్యాల‌యంలో నిరంత‌రం అందుబాటులో ఉండేలా ఒక న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

అదేవిధంగా జిల్లాల స్థాయిలో కేసులు వాదించేందుకు.. కార్య‌క‌ర్త‌ల‌కు బెయిళ్లు వ‌చ్చేలా.. ముంద‌స్తు బెయిళ్లు సంపాయించుకునేలా చూసేందుకు జిల్లాకో న్యాయ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందాలన్నీ కూడా.., మాజీ ఏఏజీ పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో న‌డ‌వ‌నున్నాయి. ఆయ‌న సూచ‌న‌ల మేర‌కు న‌డుచుకుని.. పార్టీకి న్యాయ సాయం చేయ‌నున్నారు. వీరిలో ఎక్కువ మంది స్వ‌చ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

అయితే.. కోర్టు ఫీజులు, ఇత‌ర ఖ‌ర్చుల‌ను మాత్రం వైసీపీ ఇస్తుంది. కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌పై కానీ.. కార్య‌కర్త‌ల‌ పై కానీ.. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేసుకుంటుంది. త‌ద్వారా వారిలో భ‌రోసా నింపాల‌ని భావిస్తోంది. పిన్నెల్లికి తాజాగా బెయిల్ వ‌చ్చేలా చేయ‌డం వెనుక‌.. ఇలాంటి కేంద్ర బృంద‌మే సాయం చేసింది. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కేసులు న‌మోద‌య్యే ప్ర‌మాదాన్ని గుర్తించిన జ‌గ‌న్‌.. ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త ప‌డ‌డం గ‌మ‌నార్హం. తాజాగా వైసీపీ లీగ‌ల్ సెల్ నాయ‌కుల‌తో మాట్లాడిన జ‌గ‌న్‌.. ఈ బృందాలను నియ‌మించే బాధ్య‌త‌ల‌ను వారికి అప్ప‌గించారు. కాగా, గ‌తంలో చంద్ర‌బాబు కూడా.. జిల్లాకో న్యాయ‌వాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

This post was last modified on August 24, 2024 12:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరన్ హీరోకి మిగలని ఆనందం

మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…

26 minutes ago

సంక్రాంతి వేళ అయినా… సమస్యలపై సీఎం అలర్ట్

సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…

1 hour ago

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…

2 hours ago

తొలి బంతికి సిక్సర్ కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…

3 hours ago

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

3 hours ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

9 hours ago