Political News

జాగ్ర‌త్త ప‌డుతున్న జ‌గ‌న్ ..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందస్తు జాగ్ర‌త్త‌లో ప‌డ్డారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు సంబంధించి జ‌రుగుతున్న న్యాయ పోరాటంలో ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది పై కేసులు న‌మోద‌య్యాయి. చాలా మంది కార్య‌క‌ర్త‌లు ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. ముఖ్య‌మంతైన పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, జోగి రాజీవ్ లు మాత్ర‌మే బెయిల్‌కు వ‌స్తుండ‌గా.. ఆయా కేసుల్లో చిక్కుకున్న చాలా మంది కార్య‌క‌ర్త‌లు మాత్రం జైళ్ల‌లోనే మ‌గ్గుతున్నారు.

దీంతో కార్య‌క‌ర్త‌ల కుటుంబాలు త‌ల్ల‌డిల్లుతున్నాయి. త‌మ‌కు సాయం చేయాల‌ని కోరుతున్నాయి. దీనికి తోడు.. మ‌ద్యం, ఇసుక‌, గ‌నుల‌కు సంబంధించిన కేసులు ఇంకా పొంచి ఉన్నాయి. వీటిలో ఎప్పుడైనా అరెస్టు సాగే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో అలాంటి స‌మ‌యంలో న్యాయం సాయం కోసం.. అప్ప‌టికప్పుడు చేతులు చాప‌కుండా.. ముందుగానే అలెర్ట్ అయ్యారు. కేంద్ర కార్యాల‌యంలో నిరంత‌రం అందుబాటులో ఉండేలా ఒక న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

అదేవిధంగా జిల్లాల స్థాయిలో కేసులు వాదించేందుకు.. కార్య‌క‌ర్త‌ల‌కు బెయిళ్లు వ‌చ్చేలా.. ముంద‌స్తు బెయిళ్లు సంపాయించుకునేలా చూసేందుకు జిల్లాకో న్యాయ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందాలన్నీ కూడా.., మాజీ ఏఏజీ పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో న‌డ‌వ‌నున్నాయి. ఆయ‌న సూచ‌న‌ల మేర‌కు న‌డుచుకుని.. పార్టీకి న్యాయ సాయం చేయ‌నున్నారు. వీరిలో ఎక్కువ మంది స్వ‌చ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

అయితే.. కోర్టు ఫీజులు, ఇత‌ర ఖ‌ర్చుల‌ను మాత్రం వైసీపీ ఇస్తుంది. కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌పై కానీ.. కార్య‌కర్త‌ల‌ పై కానీ.. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేసుకుంటుంది. త‌ద్వారా వారిలో భ‌రోసా నింపాల‌ని భావిస్తోంది. పిన్నెల్లికి తాజాగా బెయిల్ వ‌చ్చేలా చేయ‌డం వెనుక‌.. ఇలాంటి కేంద్ర బృంద‌మే సాయం చేసింది. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కేసులు న‌మోద‌య్యే ప్ర‌మాదాన్ని గుర్తించిన జ‌గ‌న్‌.. ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త ప‌డ‌డం గ‌మ‌నార్హం. తాజాగా వైసీపీ లీగ‌ల్ సెల్ నాయ‌కుల‌తో మాట్లాడిన జ‌గ‌న్‌.. ఈ బృందాలను నియ‌మించే బాధ్య‌త‌ల‌ను వారికి అప్ప‌గించారు. కాగా, గ‌తంలో చంద్ర‌బాబు కూడా.. జిల్లాకో న్యాయ‌వాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

This post was last modified on August 24, 2024 12:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

4 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

6 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

10 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

10 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

11 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

11 hours ago