వైసీపీ అధినేత జగన్ ముందస్తు జాగ్రత్తలో పడ్డారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంబంధించి జరుగుతున్న న్యాయ పోరాటంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు అనేక మంది పై కేసులు నమోదయ్యాయి. చాలా మంది కార్యకర్తలు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ముఖ్యమంతైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రాజీవ్ లు మాత్రమే బెయిల్కు వస్తుండగా.. ఆయా కేసుల్లో చిక్కుకున్న చాలా మంది కార్యకర్తలు మాత్రం జైళ్లలోనే మగ్గుతున్నారు.
దీంతో కార్యకర్తల కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. తమకు సాయం చేయాలని కోరుతున్నాయి. దీనికి తోడు.. మద్యం, ఇసుక, గనులకు సంబంధించిన కేసులు ఇంకా పొంచి ఉన్నాయి. వీటిలో ఎప్పుడైనా అరెస్టు సాగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అలాంటి సమయంలో న్యాయం సాయం కోసం.. అప్పటికప్పుడు చేతులు చాపకుండా.. ముందుగానే అలెర్ట్ అయ్యారు. కేంద్ర కార్యాలయంలో నిరంతరం అందుబాటులో ఉండేలా ఒక న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అదేవిధంగా జిల్లాల స్థాయిలో కేసులు వాదించేందుకు.. కార్యకర్తలకు బెయిళ్లు వచ్చేలా.. ముందస్తు బెయిళ్లు సంపాయించుకునేలా చూసేందుకు జిల్లాకో న్యాయ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందాలన్నీ కూడా.., మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నడవనున్నాయి. ఆయన సూచనల మేరకు నడుచుకుని.. పార్టీకి న్యాయ సాయం చేయనున్నారు. వీరిలో ఎక్కువ మంది స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం.
అయితే.. కోర్టు ఫీజులు, ఇతర ఖర్చులను మాత్రం వైసీపీ ఇస్తుంది. కార్యకర్తల కుటుంబాలపై కానీ.. కార్యకర్తల పై కానీ.. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేసుకుంటుంది. తద్వారా వారిలో భరోసా నింపాలని భావిస్తోంది. పిన్నెల్లికి తాజాగా బెయిల్ వచ్చేలా చేయడం వెనుక.. ఇలాంటి కేంద్ర బృందమే సాయం చేసింది. భవిష్యత్తులో మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదాన్ని గుర్తించిన జగన్.. ఇప్పటి నుంచే జాగ్రత్త పడడం గమనార్హం. తాజాగా వైసీపీ లీగల్ సెల్ నాయకులతో మాట్లాడిన జగన్.. ఈ బృందాలను నియమించే బాధ్యతలను వారికి అప్పగించారు. కాగా, గతంలో చంద్రబాబు కూడా.. జిల్లాకో న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
This post was last modified on August 24, 2024 12:42 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…