Political News

జాగ్ర‌త్త ప‌డుతున్న జ‌గ‌న్ ..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందస్తు జాగ్ర‌త్త‌లో ప‌డ్డారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు సంబంధించి జ‌రుగుతున్న న్యాయ పోరాటంలో ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది పై కేసులు న‌మోద‌య్యాయి. చాలా మంది కార్య‌క‌ర్త‌లు ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. ముఖ్య‌మంతైన పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, జోగి రాజీవ్ లు మాత్ర‌మే బెయిల్‌కు వ‌స్తుండ‌గా.. ఆయా కేసుల్లో చిక్కుకున్న చాలా మంది కార్య‌క‌ర్త‌లు మాత్రం జైళ్ల‌లోనే మ‌గ్గుతున్నారు.

దీంతో కార్య‌క‌ర్త‌ల కుటుంబాలు త‌ల్ల‌డిల్లుతున్నాయి. త‌మ‌కు సాయం చేయాల‌ని కోరుతున్నాయి. దీనికి తోడు.. మ‌ద్యం, ఇసుక‌, గ‌నుల‌కు సంబంధించిన కేసులు ఇంకా పొంచి ఉన్నాయి. వీటిలో ఎప్పుడైనా అరెస్టు సాగే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో అలాంటి స‌మ‌యంలో న్యాయం సాయం కోసం.. అప్ప‌టికప్పుడు చేతులు చాప‌కుండా.. ముందుగానే అలెర్ట్ అయ్యారు. కేంద్ర కార్యాల‌యంలో నిరంత‌రం అందుబాటులో ఉండేలా ఒక న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

అదేవిధంగా జిల్లాల స్థాయిలో కేసులు వాదించేందుకు.. కార్య‌క‌ర్త‌ల‌కు బెయిళ్లు వ‌చ్చేలా.. ముంద‌స్తు బెయిళ్లు సంపాయించుకునేలా చూసేందుకు జిల్లాకో న్యాయ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందాలన్నీ కూడా.., మాజీ ఏఏజీ పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో న‌డ‌వ‌నున్నాయి. ఆయ‌న సూచ‌న‌ల మేర‌కు న‌డుచుకుని.. పార్టీకి న్యాయ సాయం చేయ‌నున్నారు. వీరిలో ఎక్కువ మంది స్వ‌చ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

అయితే.. కోర్టు ఫీజులు, ఇత‌ర ఖ‌ర్చుల‌ను మాత్రం వైసీపీ ఇస్తుంది. కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌పై కానీ.. కార్య‌కర్త‌ల‌ పై కానీ.. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేసుకుంటుంది. త‌ద్వారా వారిలో భ‌రోసా నింపాల‌ని భావిస్తోంది. పిన్నెల్లికి తాజాగా బెయిల్ వ‌చ్చేలా చేయ‌డం వెనుక‌.. ఇలాంటి కేంద్ర బృంద‌మే సాయం చేసింది. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కేసులు న‌మోద‌య్యే ప్ర‌మాదాన్ని గుర్తించిన జ‌గ‌న్‌.. ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త ప‌డ‌డం గ‌మ‌నార్హం. తాజాగా వైసీపీ లీగ‌ల్ సెల్ నాయ‌కుల‌తో మాట్లాడిన జ‌గ‌న్‌.. ఈ బృందాలను నియ‌మించే బాధ్య‌త‌ల‌ను వారికి అప్ప‌గించారు. కాగా, గ‌తంలో చంద్ర‌బాబు కూడా.. జిల్లాకో న్యాయ‌వాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

This post was last modified on August 24, 2024 12:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

50 minutes ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

1 hour ago

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

3 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

4 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

5 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

5 hours ago