Political News

జాగ్ర‌త్త ప‌డుతున్న జ‌గ‌న్ ..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందస్తు జాగ్ర‌త్త‌లో ప‌డ్డారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు సంబంధించి జ‌రుగుతున్న న్యాయ పోరాటంలో ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది పై కేసులు న‌మోద‌య్యాయి. చాలా మంది కార్య‌క‌ర్త‌లు ప్ర‌స్తుతం జైల్లో ఉన్నారు. ముఖ్య‌మంతైన పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, జోగి రాజీవ్ లు మాత్ర‌మే బెయిల్‌కు వ‌స్తుండ‌గా.. ఆయా కేసుల్లో చిక్కుకున్న చాలా మంది కార్య‌క‌ర్త‌లు మాత్రం జైళ్ల‌లోనే మ‌గ్గుతున్నారు.

దీంతో కార్య‌క‌ర్త‌ల కుటుంబాలు త‌ల్ల‌డిల్లుతున్నాయి. త‌మ‌కు సాయం చేయాల‌ని కోరుతున్నాయి. దీనికి తోడు.. మ‌ద్యం, ఇసుక‌, గ‌నుల‌కు సంబంధించిన కేసులు ఇంకా పొంచి ఉన్నాయి. వీటిలో ఎప్పుడైనా అరెస్టు సాగే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో అలాంటి స‌మ‌యంలో న్యాయం సాయం కోసం.. అప్ప‌టికప్పుడు చేతులు చాప‌కుండా.. ముందుగానే అలెర్ట్ అయ్యారు. కేంద్ర కార్యాల‌యంలో నిరంత‌రం అందుబాటులో ఉండేలా ఒక న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

అదేవిధంగా జిల్లాల స్థాయిలో కేసులు వాదించేందుకు.. కార్య‌క‌ర్త‌ల‌కు బెయిళ్లు వ‌చ్చేలా.. ముంద‌స్తు బెయిళ్లు సంపాయించుకునేలా చూసేందుకు జిల్లాకో న్యాయ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందాలన్నీ కూడా.., మాజీ ఏఏజీ పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో న‌డ‌వ‌నున్నాయి. ఆయ‌న సూచ‌న‌ల మేర‌కు న‌డుచుకుని.. పార్టీకి న్యాయ సాయం చేయ‌నున్నారు. వీరిలో ఎక్కువ మంది స్వ‌చ్ఛందంగా సేవ చేసేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

అయితే.. కోర్టు ఫీజులు, ఇత‌ర ఖ‌ర్చుల‌ను మాత్రం వైసీపీ ఇస్తుంది. కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌పై కానీ.. కార్య‌కర్త‌ల‌ పై కానీ.. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేసుకుంటుంది. త‌ద్వారా వారిలో భ‌రోసా నింపాల‌ని భావిస్తోంది. పిన్నెల్లికి తాజాగా బెయిల్ వ‌చ్చేలా చేయ‌డం వెనుక‌.. ఇలాంటి కేంద్ర బృంద‌మే సాయం చేసింది. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కేసులు న‌మోద‌య్యే ప్ర‌మాదాన్ని గుర్తించిన జ‌గ‌న్‌.. ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త ప‌డ‌డం గ‌మ‌నార్హం. తాజాగా వైసీపీ లీగ‌ల్ సెల్ నాయ‌కుల‌తో మాట్లాడిన జ‌గ‌న్‌.. ఈ బృందాలను నియ‌మించే బాధ్య‌త‌ల‌ను వారికి అప్ప‌గించారు. కాగా, గ‌తంలో చంద్ర‌బాబు కూడా.. జిల్లాకో న్యాయ‌వాదుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

This post was last modified on August 24, 2024 12:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

2 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

4 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

11 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

12 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

12 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

14 hours ago