Political News

‘హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే’


హీ ఈజ్ జ‌స్ట్ పులివెందుల ఎమ్మెల్యే- అంటూ.. టీడీపీ నాయ‌కురాలు, మంత్రి వంగ‌లపూడి అనిత లైట్ తీసుకున్నారు. వైసీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్‌పై ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జ‌రిగిన ఘోర అగ్ని ప్ర‌మా ద ఘ‌ట‌న‌కు సంబంధించి బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన జ‌గ‌న్‌.. ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి అనిత ఫైర‌య్యారు. బాధితుల‌కు ప‌రిహారం అంద‌క‌పోతే.. నేనే వ‌చ్చి ధ‌ర్నా చేస్తా. న‌న్ను చూసి భ‌య‌ప‌డి అయినా.. ప్ర‌భుత్వం సాయం చేస్తుంది అని జ‌గ‌న్ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.

ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అనిత‌.. “హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే“ ఆయ‌న‌ను పెద్ద‌గా లెక్క‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదని అన్నారు. అంతేకాదు.. జ‌గ‌న్ హ‌యాంలో 120 మంది చ‌నిపోయిన‌ప్పుడు.. ఆయ‌న ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ఎల్జీ పాలిమ‌ర్స్ దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారికి ప‌రిహారం ఇచ్చేందుకు నాలుగు రోజులు ప‌ట్ట‌లేదా? అని ప్ర‌శ్నించారు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు నేరుగా ఘ‌ట‌న జ‌రిగిన 24 గంటల్లోనే ఆసుప‌త్రికి వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శించి వ‌చ్చార‌ని.. ప‌రిహారం కూడా వెంట‌నే ప్ర‌క‌టించార‌ని.. అది కూడా 24 గంట్లల్లో ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకున్నార‌ని తెలిపారు.

కానీ, జ‌గ‌న్‌కు బుర‌ద జ‌ల్ల‌డ‌మే తెలుసున‌ని మంత్రి అనిత అన్నారు. గ‌తంలో ఏం జ‌రిగిందో ఆయ‌న మ‌రిచిపోయినా.. ప్ర‌జ‌లు మ‌రిచిపోలేద‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతోనే ఫార్మా సెజ్‌లో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింద‌న్నారు. గ‌త ఐదేళ్ల లో ఒక్క‌సారైనా త‌నిఖీలు చేశారా? అని ప్ర‌శ్నించారు. తమ ప్ర‌భుత్వం త‌నిఖీల‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో ఇది చోటు చేసుకోవ‌డం దారుణ మేన‌ని చెప్పారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో బాధితులైన ప్ర‌తి కుటుంబాన్నీ త‌మ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌న్నారు. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప‌రిహారం అందేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు తెలిపారు. జ‌గ‌న్ ఒక సాధార‌ణ ఎమ్మెల్యే మాత్ర‌మేన‌ని, ఆయ‌న చెప్పిన మాటలు చేసిన విమ‌ర్శ‌ల‌ను బూత‌ద్దంలో చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమె వ్యాఖ్యానించారు.

This post was last modified on August 24, 2024 2:30 pm

Share

Recent Posts

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

12 minutes ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

33 minutes ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

49 minutes ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

1 hour ago

కియారాకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో

అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…

2 hours ago

30 ఏళ్ల కింద‌ట శంకుస్థాప‌న చేసి ఇప్పుడు ప్రారంభిస్తున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క విష‌యాన్ని ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. 30 ఏళ్ల కింద‌ట తాను చేసిన శంకు స్థాప‌న తాలూకు…

2 hours ago