Political News

‘హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే’


హీ ఈజ్ జ‌స్ట్ పులివెందుల ఎమ్మెల్యే- అంటూ.. టీడీపీ నాయ‌కురాలు, మంత్రి వంగ‌లపూడి అనిత లైట్ తీసుకున్నారు. వైసీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్‌పై ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జ‌రిగిన ఘోర అగ్ని ప్ర‌మా ద ఘ‌ట‌న‌కు సంబంధించి బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన జ‌గ‌న్‌.. ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి అనిత ఫైర‌య్యారు. బాధితుల‌కు ప‌రిహారం అంద‌క‌పోతే.. నేనే వ‌చ్చి ధ‌ర్నా చేస్తా. న‌న్ను చూసి భ‌య‌ప‌డి అయినా.. ప్ర‌భుత్వం సాయం చేస్తుంది అని జ‌గ‌న్ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే.

ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అనిత‌.. “హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే“ ఆయ‌న‌ను పెద్ద‌గా లెక్క‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదని అన్నారు. అంతేకాదు.. జ‌గ‌న్ హ‌యాంలో 120 మంది చ‌నిపోయిన‌ప్పుడు.. ఆయ‌న ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ఎల్జీ పాలిమ‌ర్స్ దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారికి ప‌రిహారం ఇచ్చేందుకు నాలుగు రోజులు ప‌ట్ట‌లేదా? అని ప్ర‌శ్నించారు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు నేరుగా ఘ‌ట‌న జ‌రిగిన 24 గంటల్లోనే ఆసుప‌త్రికి వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శించి వ‌చ్చార‌ని.. ప‌రిహారం కూడా వెంట‌నే ప్ర‌క‌టించార‌ని.. అది కూడా 24 గంట్లల్లో ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకున్నార‌ని తెలిపారు.

కానీ, జ‌గ‌న్‌కు బుర‌ద జ‌ల్ల‌డ‌మే తెలుసున‌ని మంత్రి అనిత అన్నారు. గ‌తంలో ఏం జ‌రిగిందో ఆయ‌న మ‌రిచిపోయినా.. ప్ర‌జ‌లు మ‌రిచిపోలేద‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతోనే ఫార్మా సెజ్‌లో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింద‌న్నారు. గ‌త ఐదేళ్ల లో ఒక్క‌సారైనా త‌నిఖీలు చేశారా? అని ప్ర‌శ్నించారు. తమ ప్ర‌భుత్వం త‌నిఖీల‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో ఇది చోటు చేసుకోవ‌డం దారుణ మేన‌ని చెప్పారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో బాధితులైన ప్ర‌తి కుటుంబాన్నీ త‌మ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌న్నారు. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప‌రిహారం అందేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు తెలిపారు. జ‌గ‌న్ ఒక సాధార‌ణ ఎమ్మెల్యే మాత్ర‌మేన‌ని, ఆయ‌న చెప్పిన మాటలు చేసిన విమ‌ర్శ‌ల‌ను బూత‌ద్దంలో చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమె వ్యాఖ్యానించారు.

This post was last modified on August 24, 2024 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

21 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

55 minutes ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

3 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago