హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే- అంటూ.. టీడీపీ నాయకురాలు, మంత్రి వంగలపూడి అనిత లైట్ తీసుకున్నారు. వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్పై ఆమె విమర్శలు గుప్పించారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమా ద ఘటనకు సంబంధించి బాధితులను పరామర్శించిన జగన్.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిత ఫైరయ్యారు. బాధితులకు పరిహారం అందకపోతే.. నేనే వచ్చి ధర్నా చేస్తా. నన్ను చూసి భయపడి అయినా.. ప్రభుత్వం సాయం చేస్తుంది అని జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనిత.. “హీ ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే“ ఆయనను పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అంతేకాదు.. జగన్ హయాంలో 120 మంది చనిపోయినప్పుడు.. ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చనిపోయిన వారికి పరిహారం ఇచ్చేందుకు నాలుగు రోజులు పట్టలేదా? అని ప్రశ్నించారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు నేరుగా ఘటన జరిగిన 24 గంటల్లోనే ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి వచ్చారని.. పరిహారం కూడా వెంటనే ప్రకటించారని.. అది కూడా 24 గంట్లల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.
కానీ, జగన్కు బురద జల్లడమే తెలుసునని మంత్రి అనిత అన్నారు. గతంలో ఏం జరిగిందో ఆయన మరిచిపోయినా.. ప్రజలు మరిచిపోలేదన్నారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఫార్మా సెజ్లో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. గత ఐదేళ్ల లో ఒక్కసారైనా తనిఖీలు చేశారా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం తనిఖీలకు సిద్ధమవుతున్న సమయంలో ఇది చోటు చేసుకోవడం దారుణ మేనని చెప్పారు. ఈ దుర్ఘటనలో బాధితులైన ప్రతి కుటుంబాన్నీ తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇప్పటికే ప్రకటించిన పరిహారం అందేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని, ఆయన చెప్పిన మాటలు చేసిన విమర్శలను బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
This post was last modified on August 24, 2024 2:30 pm
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…