సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్పై హైడ్రా పంజా విసిరింది. మాదాపూర్లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ను శనివారం పొద్దు పొద్దున్నే అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. భారీ ఎత్తున పోలీసులు, సిబ్బందితో పహారా ఏర్పాటు చేసి.. ఐదు బుల్ డోజర్లతో పనిని చేపట్టారు. దీంతో ఒక్కసారిగా.. ఈ వ్యవహారం.. సంచలనం సృష్టించింది. మాదాపూర్లోని తుమ్మిడి చెరువును ఆక్రమించి.. ఈ నిర్మాణం చేశారన్నది ప్రధాన ఆరోపణ.
తుమ్ముడి చెరువుకు సంబంధించి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని.. ఇక్కడ ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని.. స్థానికులు కొందరు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గత రెండు రోజులుగా చర్చ సాగుతోంది. సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆచి తూచి అడుగులు వేయాలని అధికారులు నిర్ణయించుకున్నా.. రాజకీయంగా వివాదాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని భావించి.. చివరకు కూల్చివేత నిర్ణయం తీసుకున్నారు.
శనివారం ఉదయం నుంచే కూల్చివేత పనులు చేపట్టారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ అథారిటీ(హైడ్రా) ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కూల్చివేతలపై మరోవైపు.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఉన్న నిర్మాణాలను ఇప్పుడు కూల్చేయడం ఏంటని నిలదీసింది. అదేసమయంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే.. ముందుగానే నోటీసులు ఇచ్చి.. సామగ్రిని తరలించుకునేందుకు సంబంధిత వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని సూచించింది.
ఈ క్రమంలోనే ఎన్ కన్వెన్షన్కు కూడా రెండు రోజుల కిందటే అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం కూల్చి వేతలు చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు తెలుస్తోంది. అయితే.. దీనికి ప్రాథమికంగా అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది సినీ వర్గాల మాట.
This post was last modified on August 24, 2024 11:31 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…