సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్పై హైడ్రా పంజా విసిరింది. మాదాపూర్లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ను శనివారం పొద్దు పొద్దున్నే అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. భారీ ఎత్తున పోలీసులు, సిబ్బందితో పహారా ఏర్పాటు చేసి.. ఐదు బుల్ డోజర్లతో పనిని చేపట్టారు. దీంతో ఒక్కసారిగా.. ఈ వ్యవహారం.. సంచలనం సృష్టించింది. మాదాపూర్లోని తుమ్మిడి చెరువును ఆక్రమించి.. ఈ నిర్మాణం చేశారన్నది ప్రధాన ఆరోపణ.
తుమ్ముడి చెరువుకు సంబంధించి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని.. ఇక్కడ ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని.. స్థానికులు కొందరు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గత రెండు రోజులుగా చర్చ సాగుతోంది. సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆచి తూచి అడుగులు వేయాలని అధికారులు నిర్ణయించుకున్నా.. రాజకీయంగా వివాదాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని భావించి.. చివరకు కూల్చివేత నిర్ణయం తీసుకున్నారు.
శనివారం ఉదయం నుంచే కూల్చివేత పనులు చేపట్టారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ అథారిటీ(హైడ్రా) ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కూల్చివేతలపై మరోవైపు.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఉన్న నిర్మాణాలను ఇప్పుడు కూల్చేయడం ఏంటని నిలదీసింది. అదేసమయంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే.. ముందుగానే నోటీసులు ఇచ్చి.. సామగ్రిని తరలించుకునేందుకు సంబంధిత వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని సూచించింది.
ఈ క్రమంలోనే ఎన్ కన్వెన్షన్కు కూడా రెండు రోజుల కిందటే అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం కూల్చి వేతలు చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు తెలుస్తోంది. అయితే.. దీనికి ప్రాథమికంగా అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది సినీ వర్గాల మాట.
This post was last modified on August 24, 2024 11:31 am
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…