సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్పై హైడ్రా పంజా విసిరింది. మాదాపూర్లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ను శనివారం పొద్దు పొద్దున్నే అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. భారీ ఎత్తున పోలీసులు, సిబ్బందితో పహారా ఏర్పాటు చేసి.. ఐదు బుల్ డోజర్లతో పనిని చేపట్టారు. దీంతో ఒక్కసారిగా.. ఈ వ్యవహారం.. సంచలనం సృష్టించింది. మాదాపూర్లోని తుమ్మిడి చెరువును ఆక్రమించి.. ఈ నిర్మాణం చేశారన్నది ప్రధాన ఆరోపణ.
తుమ్ముడి చెరువుకు సంబంధించి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని.. ఇక్కడ ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని.. స్థానికులు కొందరు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గత రెండు రోజులుగా చర్చ సాగుతోంది. సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆచి తూచి అడుగులు వేయాలని అధికారులు నిర్ణయించుకున్నా.. రాజకీయంగా వివాదాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని భావించి.. చివరకు కూల్చివేత నిర్ణయం తీసుకున్నారు.
శనివారం ఉదయం నుంచే కూల్చివేత పనులు చేపట్టారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ అథారిటీ(హైడ్రా) ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కూల్చివేతలపై మరోవైపు.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఉన్న నిర్మాణాలను ఇప్పుడు కూల్చేయడం ఏంటని నిలదీసింది. అదేసమయంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే.. ముందుగానే నోటీసులు ఇచ్చి.. సామగ్రిని తరలించుకునేందుకు సంబంధిత వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని సూచించింది.
ఈ క్రమంలోనే ఎన్ కన్వెన్షన్కు కూడా రెండు రోజుల కిందటే అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం కూల్చి వేతలు చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు తెలుస్తోంది. అయితే.. దీనికి ప్రాథమికంగా అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది సినీ వర్గాల మాట.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…