సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్పై హైడ్రా పంజా విసిరింది. మాదాపూర్లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ను శనివారం పొద్దు పొద్దున్నే అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. భారీ ఎత్తున పోలీసులు, సిబ్బందితో పహారా ఏర్పాటు చేసి.. ఐదు బుల్ డోజర్లతో పనిని చేపట్టారు. దీంతో ఒక్కసారిగా.. ఈ వ్యవహారం.. సంచలనం సృష్టించింది. మాదాపూర్లోని తుమ్మిడి చెరువును ఆక్రమించి.. ఈ నిర్మాణం చేశారన్నది ప్రధాన ఆరోపణ.
తుమ్ముడి చెరువుకు సంబంధించి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని.. ఇక్కడ ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని.. స్థానికులు కొందరు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గత రెండు రోజులుగా చర్చ సాగుతోంది. సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో ఆచి తూచి అడుగులు వేయాలని అధికారులు నిర్ణయించుకున్నా.. రాజకీయంగా వివాదాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని భావించి.. చివరకు కూల్చివేత నిర్ణయం తీసుకున్నారు.
శనివారం ఉదయం నుంచే కూల్చివేత పనులు చేపట్టారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ అథారిటీ(హైడ్రా) ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కూల్చివేతలపై మరోవైపు.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఉన్న నిర్మాణాలను ఇప్పుడు కూల్చేయడం ఏంటని నిలదీసింది. అదేసమయంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే.. ముందుగానే నోటీసులు ఇచ్చి.. సామగ్రిని తరలించుకునేందుకు సంబంధిత వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని సూచించింది.
ఈ క్రమంలోనే ఎన్ కన్వెన్షన్కు కూడా రెండు రోజుల కిందటే అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం కూల్చి వేతలు చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు తెలుస్తోంది. అయితే.. దీనికి ప్రాథమికంగా అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది సినీ వర్గాల మాట.
This post was last modified on August 24, 2024 11:31 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…