Political News

ఉద్యోగ సంఘాల‌పై బాబు మార్కు లేన‌ట్టే.. తాజా అప్డేట్‌!

ఉద్యోగుల విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు మార్కు వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల‌కు సంబంధించిన డిమాండ్ల విష‌యంలోనూ ఆయ‌న వ్యూహాలు వేరేగా ఉంటాయి. ఎంత సేపూ.. ప‌ని-ప‌ని-ప‌ని అంటూ.. ఉరుకులు ప‌రుగులు పెట్టించ‌డం చంద్ర‌బాబు ప్ర‌ధాన పాల‌నా మంత్రాంగం. 1995-2004 వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు ఇలానే వ్య‌వ‌హరించారు. దీంతో రాష్ట్రంలో ప‌రిపాల‌న ప‌రుగులు పెట్టింది. ఉద్యోగుల విష‌యంలో ప్ర‌జ‌ల‌పై న‌మ్మ‌కం కూడా పెరిగింది.

అయితే.. త‌ర్వాత కాలంలో ఇది చంద్ర‌బాబుకు ఇబ్బందిగా మారింది. 2004 ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి చంద్ర బాబుకు వ్య‌తిరేకింగా ఉద్యోగులు పోటెత్తారు. ఫ‌లితంగా వ‌రుస ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, 2014కు వ‌చ్చేస‌రికి ఎట్ట‌కేల‌కు పరుచూరు అశోక్‌బాబు వ్యూహంతో చంద్ర‌బాబుకు మ‌రోసారి ఉద్యోగులు చేరువ అయ్యారు. వారికి 43 శాతం ఫిట్‌మెంటు ఇవ్వ‌డంతోపాటు.. హైద‌రాబాద్ నుంచి ఏపీకి వ‌చ్చి ఉద్యోగాలు చేసేవారికి భారీ ఎత్తున ప్రోత్సాహాలు కూడా ఇచ్చారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి చంద్ర‌బాబు పాల‌న వ‌చ్చింది. ఇటీవ‌ల ఆయ‌న ప‌దే ప‌దే.. ఒక మాట చెబుతున్నారు. ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలి. మ‌ళ్లీ మీరు 1995 నాటి చంద్ర‌బాబును చూస్తారు! అంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అంటే.. ఉద్యోగుల‌పై నియంత్ర‌ణ పెరుగుతుంద‌ని చంద్ర‌బాబు చెప్ప‌క‌నే చెప్పారు. స‌రిగా ప‌నిచేయ‌ని వారిని త‌ప్పిస్తాన‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఒక‌ర‌కంగా హ‌డ‌లిపోయాయి. ఇదే జ‌రిగితే.. త‌మ‌కు ఇబ్బందేన‌ని భావించాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు మారిపోతున్నార‌ని.. 1995 నాటికి సీఎం ఆయ‌న‌లో క‌నిపిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, హ‌ఠాత్తుగా మ‌రోసారి చంద్ర‌బాబు ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గారు. సంఘాల‌కు అనుకూలంగానే నిర్ణ‌యాలు తీసుకునేందుకు మొగ్గు చూపారు. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఏం జ‌రిగిందో ఏమో.. ఉద్యోగుల విష‌యంలో దూకుడుగా ఉంటే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావించిన చంద్ర‌బాబు.. తాజాగా వారికి అనుకూల‌మైన నిర్ణ‌యాలే తీసుకుంటాని ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు.

ఈ క్ర‌మంలోనే ఉద్యోగ సంఘాల నాయ‌కులు చెప్పిన‌మేర‌కు బ‌దిలీలు, ఇత‌ర‌త్రా సౌక‌ర్యాలు వారికి క‌ల్పిస్తూ.. ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి ఉద్యోగుల విష‌యంలో చంద్ర‌బాబు మార్కు ఇక లేన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఏదేమైనా చంద్ర‌బాబుకు మంచి చేయాల‌ని ఉన్నా.. రాజ‌కీయ ఒత్తిడిలు.. ఓటు బ్యాంకు వంటివి ప్ర‌భావం చూపుతున్నాయ‌ని స్ప‌ష్ట‌మైంది.

This post was last modified on August 23, 2024 3:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్షమాపణలు చెప్పిన నాయుడు గారి అబ్బాయి

తమిళంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా పార్తీబన్‌కు గొప్ప పేరే ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ప్రయాణం కొనసాగుతోంది.…

1 hour ago

తెలుగు అభిమానులకు దురంధర్ స్ట్రోక్

భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…

2 hours ago

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

4 hours ago

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

5 hours ago

బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

'మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ' కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ…

5 hours ago

జ‌గ‌న్‌ను చిక్కుల్లో పెట్టేశారుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయ‌న‌కు పెద్ద చిక్కు వ‌చ్చింది.…

5 hours ago