ఉద్యోగుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మార్కు వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన డిమాండ్ల విషయంలోనూ ఆయన వ్యూహాలు వేరేగా ఉంటాయి. ఎంత సేపూ.. పని-పని-పని అంటూ.. ఉరుకులు పరుగులు పెట్టించడం చంద్రబాబు ప్రధాన పాలనా మంత్రాంగం. 1995-2004 వరకు కూడా చంద్రబాబు ఇలానే వ్యవహరించారు. దీంతో రాష్ట్రంలో పరిపాలన పరుగులు పెట్టింది. ఉద్యోగుల విషయంలో ప్రజలపై నమ్మకం కూడా పెరిగింది.
అయితే.. తర్వాత కాలంలో ఇది చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. 2004 ఎన్నికలకు వచ్చేసరికి చంద్ర బాబుకు వ్యతిరేకింగా ఉద్యోగులు పోటెత్తారు. ఫలితంగా వరుస పరాజయం పాలయ్యారు. ఇక, 2014కు వచ్చేసరికి ఎట్టకేలకు పరుచూరు అశోక్బాబు వ్యూహంతో చంద్రబాబుకు మరోసారి ఉద్యోగులు చేరువ అయ్యారు. వారికి 43 శాతం ఫిట్మెంటు ఇవ్వడంతోపాటు.. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చి ఉద్యోగాలు చేసేవారికి భారీ ఎత్తున ప్రోత్సాహాలు కూడా ఇచ్చారు.
కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి చంద్రబాబు పాలన వచ్చింది. ఇటీవల ఆయన పదే పదే.. ఒక మాట చెబుతున్నారు. ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలి. మళ్లీ మీరు 1995 నాటి చంద్రబాబును చూస్తారు! అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంటే.. ఉద్యోగులపై నియంత్రణ పెరుగుతుందని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. సరిగా పనిచేయని వారిని తప్పిస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఒకరకంగా హడలిపోయాయి. ఇదే జరిగితే.. తమకు ఇబ్బందేనని భావించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మారిపోతున్నారని.. 1995 నాటికి సీఎం ఆయనలో కనిపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, హఠాత్తుగా మరోసారి చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గారు. సంఘాలకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గు చూపారు. అంతర్గత చర్చల్లో ఏం జరిగిందో ఏమో.. ఉద్యోగుల విషయంలో దూకుడుగా ఉంటే.. ఇబ్బందులు తప్పవని భావించిన చంద్రబాబు.. తాజాగా వారికి అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటాని పరోక్షంగా చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పినమేరకు బదిలీలు, ఇతరత్రా సౌకర్యాలు వారికి కల్పిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిని బట్టి ఉద్యోగుల విషయంలో చంద్రబాబు మార్కు ఇక లేనట్టేనని తెలుస్తోంది. ఏదేమైనా చంద్రబాబుకు మంచి చేయాలని ఉన్నా.. రాజకీయ ఒత్తిడిలు.. ఓటు బ్యాంకు వంటివి ప్రభావం చూపుతున్నాయని స్పష్టమైంది.
This post was last modified on August 23, 2024 3:21 pm
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…