ఉద్యోగుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మార్కు వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన డిమాండ్ల విషయంలోనూ ఆయన వ్యూహాలు వేరేగా ఉంటాయి. ఎంత సేపూ.. పని-పని-పని అంటూ.. ఉరుకులు పరుగులు పెట్టించడం చంద్రబాబు ప్రధాన పాలనా మంత్రాంగం. 1995-2004 వరకు కూడా చంద్రబాబు ఇలానే వ్యవహరించారు. దీంతో రాష్ట్రంలో పరిపాలన పరుగులు పెట్టింది. ఉద్యోగుల విషయంలో ప్రజలపై నమ్మకం కూడా పెరిగింది.
అయితే.. తర్వాత కాలంలో ఇది చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. 2004 ఎన్నికలకు వచ్చేసరికి చంద్ర బాబుకు వ్యతిరేకింగా ఉద్యోగులు పోటెత్తారు. ఫలితంగా వరుస పరాజయం పాలయ్యారు. ఇక, 2014కు వచ్చేసరికి ఎట్టకేలకు పరుచూరు అశోక్బాబు వ్యూహంతో చంద్రబాబుకు మరోసారి ఉద్యోగులు చేరువ అయ్యారు. వారికి 43 శాతం ఫిట్మెంటు ఇవ్వడంతోపాటు.. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చి ఉద్యోగాలు చేసేవారికి భారీ ఎత్తున ప్రోత్సాహాలు కూడా ఇచ్చారు.
కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి చంద్రబాబు పాలన వచ్చింది. ఇటీవల ఆయన పదే పదే.. ఒక మాట చెబుతున్నారు. ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలి. మళ్లీ మీరు 1995 నాటి చంద్రబాబును చూస్తారు! అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంటే.. ఉద్యోగులపై నియంత్రణ పెరుగుతుందని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. సరిగా పనిచేయని వారిని తప్పిస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఒకరకంగా హడలిపోయాయి. ఇదే జరిగితే.. తమకు ఇబ్బందేనని భావించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మారిపోతున్నారని.. 1995 నాటికి సీఎం ఆయనలో కనిపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, హఠాత్తుగా మరోసారి చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గారు. సంఘాలకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గు చూపారు. అంతర్గత చర్చల్లో ఏం జరిగిందో ఏమో.. ఉద్యోగుల విషయంలో దూకుడుగా ఉంటే.. ఇబ్బందులు తప్పవని భావించిన చంద్రబాబు.. తాజాగా వారికి అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటాని పరోక్షంగా చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పినమేరకు బదిలీలు, ఇతరత్రా సౌకర్యాలు వారికి కల్పిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిని బట్టి ఉద్యోగుల విషయంలో చంద్రబాబు మార్కు ఇక లేనట్టేనని తెలుస్తోంది. ఏదేమైనా చంద్రబాబుకు మంచి చేయాలని ఉన్నా.. రాజకీయ ఒత్తిడిలు.. ఓటు బ్యాంకు వంటివి ప్రభావం చూపుతున్నాయని స్పష్టమైంది.
This post was last modified on August 23, 2024 3:21 pm
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…
"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…
మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…
టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…
మహిళలు మీసాలు పెంచలేరని.. పురుషులు గర్భాన్ని దాల్చలేరని సామెత!. అయితే.. ఇటీవల కాలంలో రష్యాకు చెందిన ఓ మహిళ మీసాలు…