Political News

ఉద్యోగ సంఘాల‌పై బాబు మార్కు లేన‌ట్టే.. తాజా అప్డేట్‌!

ఉద్యోగుల విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు మార్కు వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల‌కు సంబంధించిన డిమాండ్ల విష‌యంలోనూ ఆయ‌న వ్యూహాలు వేరేగా ఉంటాయి. ఎంత సేపూ.. ప‌ని-ప‌ని-ప‌ని అంటూ.. ఉరుకులు ప‌రుగులు పెట్టించ‌డం చంద్ర‌బాబు ప్ర‌ధాన పాల‌నా మంత్రాంగం. 1995-2004 వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు ఇలానే వ్య‌వ‌హరించారు. దీంతో రాష్ట్రంలో ప‌రిపాల‌న ప‌రుగులు పెట్టింది. ఉద్యోగుల విష‌యంలో ప్ర‌జ‌ల‌పై న‌మ్మ‌కం కూడా పెరిగింది.

అయితే.. త‌ర్వాత కాలంలో ఇది చంద్ర‌బాబుకు ఇబ్బందిగా మారింది. 2004 ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి చంద్ర బాబుకు వ్య‌తిరేకింగా ఉద్యోగులు పోటెత్తారు. ఫ‌లితంగా వ‌రుస ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, 2014కు వ‌చ్చేస‌రికి ఎట్ట‌కేల‌కు పరుచూరు అశోక్‌బాబు వ్యూహంతో చంద్ర‌బాబుకు మ‌రోసారి ఉద్యోగులు చేరువ అయ్యారు. వారికి 43 శాతం ఫిట్‌మెంటు ఇవ్వ‌డంతోపాటు.. హైద‌రాబాద్ నుంచి ఏపీకి వ‌చ్చి ఉద్యోగాలు చేసేవారికి భారీ ఎత్తున ప్రోత్సాహాలు కూడా ఇచ్చారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి చంద్ర‌బాబు పాల‌న వ‌చ్చింది. ఇటీవ‌ల ఆయ‌న ప‌దే ప‌దే.. ఒక మాట చెబుతున్నారు. ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలి. మ‌ళ్లీ మీరు 1995 నాటి చంద్ర‌బాబును చూస్తారు! అంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అంటే.. ఉద్యోగుల‌పై నియంత్ర‌ణ పెరుగుతుంద‌ని చంద్ర‌బాబు చెప్ప‌క‌నే చెప్పారు. స‌రిగా ప‌నిచేయ‌ని వారిని త‌ప్పిస్తాన‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఒక‌ర‌కంగా హ‌డ‌లిపోయాయి. ఇదే జ‌రిగితే.. త‌మ‌కు ఇబ్బందేన‌ని భావించాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు మారిపోతున్నార‌ని.. 1995 నాటికి సీఎం ఆయ‌న‌లో క‌నిపిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, హ‌ఠాత్తుగా మ‌రోసారి చంద్ర‌బాబు ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గారు. సంఘాల‌కు అనుకూలంగానే నిర్ణ‌యాలు తీసుకునేందుకు మొగ్గు చూపారు. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఏం జ‌రిగిందో ఏమో.. ఉద్యోగుల విష‌యంలో దూకుడుగా ఉంటే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావించిన చంద్ర‌బాబు.. తాజాగా వారికి అనుకూల‌మైన నిర్ణ‌యాలే తీసుకుంటాని ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు.

ఈ క్ర‌మంలోనే ఉద్యోగ సంఘాల నాయ‌కులు చెప్పిన‌మేర‌కు బ‌దిలీలు, ఇత‌ర‌త్రా సౌక‌ర్యాలు వారికి క‌ల్పిస్తూ.. ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి ఉద్యోగుల విష‌యంలో చంద్ర‌బాబు మార్కు ఇక లేన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఏదేమైనా చంద్ర‌బాబుకు మంచి చేయాల‌ని ఉన్నా.. రాజ‌కీయ ఒత్తిడిలు.. ఓటు బ్యాంకు వంటివి ప్ర‌భావం చూపుతున్నాయ‌ని స్ప‌ష్ట‌మైంది.

This post was last modified on August 23, 2024 3:21 pm

Share

Recent Posts

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

6 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

7 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

20 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

1 hour ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago