Political News

ఉద్యోగ సంఘాల‌పై బాబు మార్కు లేన‌ట్టే.. తాజా అప్డేట్‌!

ఉద్యోగుల విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు మార్కు వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల‌కు సంబంధించిన డిమాండ్ల విష‌యంలోనూ ఆయ‌న వ్యూహాలు వేరేగా ఉంటాయి. ఎంత సేపూ.. ప‌ని-ప‌ని-ప‌ని అంటూ.. ఉరుకులు ప‌రుగులు పెట్టించ‌డం చంద్ర‌బాబు ప్ర‌ధాన పాల‌నా మంత్రాంగం. 1995-2004 వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు ఇలానే వ్య‌వ‌హరించారు. దీంతో రాష్ట్రంలో ప‌రిపాల‌న ప‌రుగులు పెట్టింది. ఉద్యోగుల విష‌యంలో ప్ర‌జ‌ల‌పై న‌మ్మ‌కం కూడా పెరిగింది.

అయితే.. త‌ర్వాత కాలంలో ఇది చంద్ర‌బాబుకు ఇబ్బందిగా మారింది. 2004 ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి చంద్ర బాబుకు వ్య‌తిరేకింగా ఉద్యోగులు పోటెత్తారు. ఫ‌లితంగా వ‌రుస ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, 2014కు వ‌చ్చేస‌రికి ఎట్ట‌కేల‌కు పరుచూరు అశోక్‌బాబు వ్యూహంతో చంద్ర‌బాబుకు మ‌రోసారి ఉద్యోగులు చేరువ అయ్యారు. వారికి 43 శాతం ఫిట్‌మెంటు ఇవ్వ‌డంతోపాటు.. హైద‌రాబాద్ నుంచి ఏపీకి వ‌చ్చి ఉద్యోగాలు చేసేవారికి భారీ ఎత్తున ప్రోత్సాహాలు కూడా ఇచ్చారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి చంద్ర‌బాబు పాల‌న వ‌చ్చింది. ఇటీవ‌ల ఆయ‌న ప‌దే ప‌దే.. ఒక మాట చెబుతున్నారు. ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలి. మ‌ళ్లీ మీరు 1995 నాటి చంద్ర‌బాబును చూస్తారు! అంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అంటే.. ఉద్యోగుల‌పై నియంత్ర‌ణ పెరుగుతుంద‌ని చంద్ర‌బాబు చెప్ప‌క‌నే చెప్పారు. స‌రిగా ప‌నిచేయ‌ని వారిని త‌ప్పిస్తాన‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఒక‌ర‌కంగా హ‌డ‌లిపోయాయి. ఇదే జ‌రిగితే.. త‌మ‌కు ఇబ్బందేన‌ని భావించాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు మారిపోతున్నార‌ని.. 1995 నాటికి సీఎం ఆయ‌న‌లో క‌నిపిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, హ‌ఠాత్తుగా మ‌రోసారి చంద్ర‌బాబు ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గారు. సంఘాల‌కు అనుకూలంగానే నిర్ణ‌యాలు తీసుకునేందుకు మొగ్గు చూపారు. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఏం జ‌రిగిందో ఏమో.. ఉద్యోగుల విష‌యంలో దూకుడుగా ఉంటే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావించిన చంద్ర‌బాబు.. తాజాగా వారికి అనుకూల‌మైన నిర్ణ‌యాలే తీసుకుంటాని ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు.

ఈ క్ర‌మంలోనే ఉద్యోగ సంఘాల నాయ‌కులు చెప్పిన‌మేర‌కు బ‌దిలీలు, ఇత‌ర‌త్రా సౌక‌ర్యాలు వారికి క‌ల్పిస్తూ.. ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి ఉద్యోగుల విష‌యంలో చంద్ర‌బాబు మార్కు ఇక లేన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఏదేమైనా చంద్ర‌బాబుకు మంచి చేయాల‌ని ఉన్నా.. రాజ‌కీయ ఒత్తిడిలు.. ఓటు బ్యాంకు వంటివి ప్ర‌భావం చూపుతున్నాయ‌ని స్ప‌ష్ట‌మైంది.

This post was last modified on August 23, 2024 3:21 pm

Share

Recent Posts

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

1 hour ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

2 hours ago

శర్వానంద్ రిలీజులకు కొత్త చిక్కుముడి

శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…

2 hours ago

ఊర్మిళను పెళ్లాడిన వర్మ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…

2 hours ago

భోగాపురం క్రెడిట్ కోసం వైసీపీ తంటాలు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏపీ ప్ర‌జ‌లు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఊద‌ర గొడుతోంది. అంతేకాదు.. గ‌త…

3 hours ago

స్పైడర్ మ్యాన్ సక్సెస్… ఏ పాఠం నేర్చుకోవాలి

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…

3 hours ago