Political News

ఉద్యోగ సంఘాల‌పై బాబు మార్కు లేన‌ట్టే.. తాజా అప్డేట్‌!

ఉద్యోగుల విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు మార్కు వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల‌కు సంబంధించిన డిమాండ్ల విష‌యంలోనూ ఆయ‌న వ్యూహాలు వేరేగా ఉంటాయి. ఎంత సేపూ.. ప‌ని-ప‌ని-ప‌ని అంటూ.. ఉరుకులు ప‌రుగులు పెట్టించ‌డం చంద్ర‌బాబు ప్ర‌ధాన పాల‌నా మంత్రాంగం. 1995-2004 వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు ఇలానే వ్య‌వ‌హరించారు. దీంతో రాష్ట్రంలో ప‌రిపాల‌న ప‌రుగులు పెట్టింది. ఉద్యోగుల విష‌యంలో ప్ర‌జ‌ల‌పై న‌మ్మ‌కం కూడా పెరిగింది.

అయితే.. త‌ర్వాత కాలంలో ఇది చంద్ర‌బాబుకు ఇబ్బందిగా మారింది. 2004 ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి చంద్ర బాబుకు వ్య‌తిరేకింగా ఉద్యోగులు పోటెత్తారు. ఫ‌లితంగా వ‌రుస ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, 2014కు వ‌చ్చేస‌రికి ఎట్ట‌కేల‌కు పరుచూరు అశోక్‌బాబు వ్యూహంతో చంద్ర‌బాబుకు మ‌రోసారి ఉద్యోగులు చేరువ అయ్యారు. వారికి 43 శాతం ఫిట్‌మెంటు ఇవ్వ‌డంతోపాటు.. హైద‌రాబాద్ నుంచి ఏపీకి వ‌చ్చి ఉద్యోగాలు చేసేవారికి భారీ ఎత్తున ప్రోత్సాహాలు కూడా ఇచ్చారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి చంద్ర‌బాబు పాల‌న వ‌చ్చింది. ఇటీవ‌ల ఆయ‌న ప‌దే ప‌దే.. ఒక మాట చెబుతున్నారు. ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలి. మ‌ళ్లీ మీరు 1995 నాటి చంద్ర‌బాబును చూస్తారు! అంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అంటే.. ఉద్యోగుల‌పై నియంత్ర‌ణ పెరుగుతుంద‌ని చంద్ర‌బాబు చెప్ప‌క‌నే చెప్పారు. స‌రిగా ప‌నిచేయ‌ని వారిని త‌ప్పిస్తాన‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఒక‌ర‌కంగా హ‌డ‌లిపోయాయి. ఇదే జ‌రిగితే.. త‌మ‌కు ఇబ్బందేన‌ని భావించాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు మారిపోతున్నార‌ని.. 1995 నాటికి సీఎం ఆయ‌న‌లో క‌నిపిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, హ‌ఠాత్తుగా మ‌రోసారి చంద్ర‌బాబు ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గారు. సంఘాల‌కు అనుకూలంగానే నిర్ణ‌యాలు తీసుకునేందుకు మొగ్గు చూపారు. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఏం జ‌రిగిందో ఏమో.. ఉద్యోగుల విష‌యంలో దూకుడుగా ఉంటే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావించిన చంద్ర‌బాబు.. తాజాగా వారికి అనుకూల‌మైన నిర్ణ‌యాలే తీసుకుంటాని ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు.

ఈ క్ర‌మంలోనే ఉద్యోగ సంఘాల నాయ‌కులు చెప్పిన‌మేర‌కు బ‌దిలీలు, ఇత‌ర‌త్రా సౌక‌ర్యాలు వారికి క‌ల్పిస్తూ.. ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి ఉద్యోగుల విష‌యంలో చంద్ర‌బాబు మార్కు ఇక లేన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఏదేమైనా చంద్ర‌బాబుకు మంచి చేయాల‌ని ఉన్నా.. రాజ‌కీయ ఒత్తిడిలు.. ఓటు బ్యాంకు వంటివి ప్ర‌భావం చూపుతున్నాయ‌ని స్ప‌ష్ట‌మైంది.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

23 minutes ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

55 minutes ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

1 hour ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

1 hour ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

3 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

4 hours ago