ఉద్యోగుల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మార్కు వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన డిమాండ్ల విషయంలోనూ ఆయన వ్యూహాలు వేరేగా ఉంటాయి. ఎంత సేపూ.. పని-పని-పని అంటూ.. ఉరుకులు పరుగులు పెట్టించడం చంద్రబాబు ప్రధాన పాలనా మంత్రాంగం. 1995-2004 వరకు కూడా చంద్రబాబు ఇలానే వ్యవహరించారు. దీంతో రాష్ట్రంలో పరిపాలన పరుగులు పెట్టింది. ఉద్యోగుల విషయంలో ప్రజలపై నమ్మకం కూడా పెరిగింది.
అయితే.. తర్వాత కాలంలో ఇది చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. 2004 ఎన్నికలకు వచ్చేసరికి చంద్ర బాబుకు వ్యతిరేకింగా ఉద్యోగులు పోటెత్తారు. ఫలితంగా వరుస పరాజయం పాలయ్యారు. ఇక, 2014కు వచ్చేసరికి ఎట్టకేలకు పరుచూరు అశోక్బాబు వ్యూహంతో చంద్రబాబుకు మరోసారి ఉద్యోగులు చేరువ అయ్యారు. వారికి 43 శాతం ఫిట్మెంటు ఇవ్వడంతోపాటు.. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చి ఉద్యోగాలు చేసేవారికి భారీ ఎత్తున ప్రోత్సాహాలు కూడా ఇచ్చారు.
కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి చంద్రబాబు పాలన వచ్చింది. ఇటీవల ఆయన పదే పదే.. ఒక మాట చెబుతున్నారు. ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలి. మళ్లీ మీరు 1995 నాటి చంద్రబాబును చూస్తారు! అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంటే.. ఉద్యోగులపై నియంత్రణ పెరుగుతుందని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. సరిగా పనిచేయని వారిని తప్పిస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఒకరకంగా హడలిపోయాయి. ఇదే జరిగితే.. తమకు ఇబ్బందేనని భావించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మారిపోతున్నారని.. 1995 నాటికి సీఎం ఆయనలో కనిపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, హఠాత్తుగా మరోసారి చంద్రబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గారు. సంఘాలకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గు చూపారు. అంతర్గత చర్చల్లో ఏం జరిగిందో ఏమో.. ఉద్యోగుల విషయంలో దూకుడుగా ఉంటే.. ఇబ్బందులు తప్పవని భావించిన చంద్రబాబు.. తాజాగా వారికి అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటాని పరోక్షంగా చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పినమేరకు బదిలీలు, ఇతరత్రా సౌకర్యాలు వారికి కల్పిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిని బట్టి ఉద్యోగుల విషయంలో చంద్రబాబు మార్కు ఇక లేనట్టేనని తెలుస్తోంది. ఏదేమైనా చంద్రబాబుకు మంచి చేయాలని ఉన్నా.. రాజకీయ ఒత్తిడిలు.. ఓటు బ్యాంకు వంటివి ప్రభావం చూపుతున్నాయని స్పష్టమైంది.
This post was last modified on August 23, 2024 3:21 pm
అభిమానులు భయపడినట్టే జరిగేలా ఉంది. మే 9 హరిహర వీరమల్లు వస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్…
థియేటర్లలో జనాలు లేక అలో లక్ష్మణా అంటూ అల్లాడిపోతున్న బయ్యర్లకు ఊరట కలిగించేందుకు ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు…
మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ…
మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…
ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…