రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల విషయంపై సర్వోత్రా చర్చ జరుగుతోంది. సాధారణంగా చంద్రబాబు అంటేనే విజన్ కు ప్రతిరూపం. భవిష్యత్తును ముందే ఆలోచించి రాబోయే 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ముందుగానే ఊహించి, ఆయన నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం ప్రభుత్వాన్ని నడిపిస్తారని పేరు ఉన్న విషయం తెలిసిందే. 2014లో విభజిత ఏపీలో తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు దీనిని దృష్టిలో పెట్టుకునే అమరావతి నిర్మాణం చేశారు.
అదేవిధంగా విశాఖపట్నంలో ఐటీ సంస్థలు ఏర్పాటు చేశారు. అనంతపురంలో కియా పరిశ్రమలు తీసుకొచ్చారు. చిత్తూరులో శ్రీ సిటీ వంటి ఇండస్ట్రియల్ ఏరియాను కూడా అభివృద్ధి పథంలో నడిపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు విజన్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం అన్నాక సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదా ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడం కామనే. కానీ చంద్రబాబు విషయానికి వచ్చేసరికి వీటికి భిన్నంగా ఆయన విజన్ అమలు చేస్తారనేది ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద ఆశ.
దీనిని ఎప్పుడు అమలు చేస్తారని చాలామంది ఎదురు చూస్తారు. ఇప్పుడు చంద్రబాబు ఆదిశగానే అడుగులు వేస్తున్నారు. గడిచిన 10 రోజులుగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఆహ్వానాలు పంపడం అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్లిపోయినటువంటి కొన్ని కంపెనీలను తిరిగి పిలిచి పెట్టుబడులు పెట్టండి అని పిలుపునివ్వటం అంటివి ఆసక్తిగా మారాయి. చంద్రబాబు విజన్ అదేవిధంగా ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అందిపుచ్చుకునేందుకు బడా పరిశ్రామిక వేత్తలు కూడా ఇప్పుడు క్యూ కడుతున్నారు.
తాజాగా జిందాల్ కంపెనీ అదేవిధంగా టాటా కంపెనీ ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. అదే విధంగా వైసిపి హయాంలో చిత్తూరు నుంచి వెళ్లిపోయి మరో కంపెనీని తెలంగాణలో ఏర్పాటుచేసిన అమరరాజా సంస్థ కూడా మళ్లీ ఏపీలో మరో సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక గత ఐదేళ్లలో విశాఖలో ఐటీ పరిశ్రమలు ఖాళీ అయిన నేపథ్యంలో వాటిని కూడా తిరిగి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే చంద్రబాబు విజన్ పెట్టుబడులకు బాగానే పనిచేస్తుందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో రాబోయే ఆరు మాసాల్లో పెట్టుబడులకు ఒక రూపం సంతరించుకుంటుందని భారీ ఎత్తున పెద్దపెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తద్వారా వేల మంది యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయిని తద్వారా సంపద సృష్టి జరుగుతుందని చంద్రబాబు కూడా భావిస్తూ ఉండడం విశేషం.
This post was last modified on August 22, 2024 10:14 am
ప్లాన్ చేసి చేశారో.. లేక క్షణికావేశంలో చేశారో కానీ.. కన్నడ కథానాయకుడు దర్శన్ తన అభిమానే అయిన రేణుక స్వామి…
ఇటీవలే ‘కల్కి’ సినిమాలో కాసేపు ప్రభాస్ కర్ణుడిగా కనిపిస్తే.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలిసిందే. మహాభారతంలో ఎన్నో…
తిరుమల లడ్డు వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ హిందువులు ఆచరించే సనాతన ధర్మం గురించి చాలా బలంగా గళాన్ని వినిపిస్తున్న…
తమిళంలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకడు.. లోకేష్ కనకరాజ్. మామూలుగా అతను చాలా కూల్గా కనిపిస్తాడు. అలాంటి దర్శకుడికి ఇప్పుడు…
1989 సంవత్సరం. అక్టోబర్ 5వ తేదీ. బ్రేక్ డాన్సులు, ఫైట్లు, భారీ సెట్ల హంగులు ఆర్భాటాలు, అవుట్ డోర్ లొకేషన్ల…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ…