రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల విషయంపై సర్వోత్రా చర్చ జరుగుతోంది. సాధారణంగా చంద్రబాబు అంటేనే విజన్ కు ప్రతిరూపం. భవిష్యత్తును ముందే ఆలోచించి రాబోయే 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ముందుగానే ఊహించి, ఆయన నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం ప్రభుత్వాన్ని నడిపిస్తారని పేరు ఉన్న విషయం తెలిసిందే. 2014లో విభజిత ఏపీలో తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు దీనిని దృష్టిలో పెట్టుకునే అమరావతి నిర్మాణం చేశారు.
అదేవిధంగా విశాఖపట్నంలో ఐటీ సంస్థలు ఏర్పాటు చేశారు. అనంతపురంలో కియా పరిశ్రమలు తీసుకొచ్చారు. చిత్తూరులో శ్రీ సిటీ వంటి ఇండస్ట్రియల్ ఏరియాను కూడా అభివృద్ధి పథంలో నడిపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు విజన్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం అన్నాక సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదా ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడం కామనే. కానీ చంద్రబాబు విషయానికి వచ్చేసరికి వీటికి భిన్నంగా ఆయన విజన్ అమలు చేస్తారనేది ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద ఆశ.
దీనిని ఎప్పుడు అమలు చేస్తారని చాలామంది ఎదురు చూస్తారు. ఇప్పుడు చంద్రబాబు ఆదిశగానే అడుగులు వేస్తున్నారు. గడిచిన 10 రోజులుగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఆహ్వానాలు పంపడం అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్లిపోయినటువంటి కొన్ని కంపెనీలను తిరిగి పిలిచి పెట్టుబడులు పెట్టండి అని పిలుపునివ్వటం అంటివి ఆసక్తిగా మారాయి. చంద్రబాబు విజన్ అదేవిధంగా ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అందిపుచ్చుకునేందుకు బడా పరిశ్రామిక వేత్తలు కూడా ఇప్పుడు క్యూ కడుతున్నారు.
తాజాగా జిందాల్ కంపెనీ అదేవిధంగా టాటా కంపెనీ ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. అదే విధంగా వైసిపి హయాంలో చిత్తూరు నుంచి వెళ్లిపోయి మరో కంపెనీని తెలంగాణలో ఏర్పాటుచేసిన అమరరాజా సంస్థ కూడా మళ్లీ ఏపీలో మరో సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక గత ఐదేళ్లలో విశాఖలో ఐటీ పరిశ్రమలు ఖాళీ అయిన నేపథ్యంలో వాటిని కూడా తిరిగి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే చంద్రబాబు విజన్ పెట్టుబడులకు బాగానే పనిచేస్తుందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో రాబోయే ఆరు మాసాల్లో పెట్టుబడులకు ఒక రూపం సంతరించుకుంటుందని భారీ ఎత్తున పెద్దపెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తద్వారా వేల మంది యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయిని తద్వారా సంపద సృష్టి జరుగుతుందని చంద్రబాబు కూడా భావిస్తూ ఉండడం విశేషం.
This post was last modified on August 22, 2024 10:14 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…