Political News

చంద్ర‌బాబు విజ‌న్ పాలిటిక్స్‌.. స‌క్సెస్ మంత్రం ఎంత‌.. ?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల విషయంపై సర్వోత్రా చర్చ జరుగుతోంది. సాధారణంగా చంద్రబాబు అంటేనే విజన్ కు ప్రతిరూపం. భవిష్యత్తును ముందే ఆలోచించి రాబోయే 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ముందుగానే ఊహించి, ఆయన నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం ప్రభుత్వాన్ని నడిపిస్తారని పేరు ఉన్న విషయం తెలిసిందే. 2014లో విభజిత ఏపీలో తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు దీనిని దృష్టిలో పెట్టుకునే అమరావతి నిర్మాణం చేశారు.

అదేవిధంగా విశాఖపట్నంలో ఐటీ సంస్థలు ఏర్పాటు చేశారు. అనంతపురంలో కియా పరిశ్రమలు తీసుకొచ్చారు. చిత్తూరులో శ్రీ సిటీ వంటి ఇండస్ట్రియల్ ఏరియాను కూడా అభివృద్ధి పథంలో నడిపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు విజన్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం అన్నాక సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదా ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడం కామనే. కానీ చంద్రబాబు విషయానికి వచ్చేసరికి వీటికి భిన్నంగా ఆయన విజన్ అమలు చేస్తారనేది ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద ఆశ.

దీనిని ఎప్పుడు అమలు చేస్తారని చాలామంది ఎదురు చూస్తారు. ఇప్పుడు చంద్రబాబు ఆదిశగానే అడుగులు వేస్తున్నారు. గడిచిన 10 రోజులుగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఆహ్వానాలు పంపడం అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్లిపోయినటువంటి కొన్ని కంపెనీలను తిరిగి పిలిచి పెట్టుబడులు పెట్టండి అని పిలుపునివ్వటం అంటివి ఆసక్తిగా మారాయి. చంద్రబాబు విజన్ అదేవిధంగా ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అందిపుచ్చుకునేందుకు బడా పరిశ్రామిక వేత్తలు కూడా ఇప్పుడు క్యూ కడుతున్నారు.

తాజాగా జిందాల్ కంపెనీ అదేవిధంగా టాటా కంపెనీ ఏపీలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. అదే విధంగా వైసిపి హయాంలో చిత్తూరు నుంచి వెళ్లిపోయి మరో కంపెనీని తెలంగాణలో ఏర్పాటుచేసిన అమరరాజా సంస్థ కూడా మళ్లీ ఏపీలో మరో సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక గత ఐదేళ్లలో విశాఖలో ఐటీ పరిశ్రమలు ఖాళీ అయిన నేపథ్యంలో వాటిని కూడా తిరిగి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తంగా చూస్తే చంద్రబాబు విజన్ పెట్టుబడులకు బాగానే పనిచేస్తుందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో రాబోయే ఆరు మాసాల్లో పెట్టుబడులకు ఒక రూపం సంతరించుకుంటుందని భారీ ఎత్తున పెద్దపెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తద్వారా వేల మంది యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయిని తద్వారా సంపద సృష్టి జరుగుతుందని చంద్రబాబు కూడా భావిస్తూ ఉండడం విశేషం.

This post was last modified on August 22, 2024 10:14 am

Share

Recent Posts

జోగి ఫ్యామిలీలో `కోడ‌లి` కుదుపు!

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫ్యామిలీలో కోడ‌లు చేసిన ఆరోప‌ణలు పెను కుదుపున‌కు…

38 minutes ago

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

1 hour ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

1 hour ago

రఘురామ వెరీ హ్యాపీ: ఆకివీడు రామాల‌యానికి సుప్రీం ఓకే!

ఏపీలో గ‌త 2 మాసాల కింద‌టి వ‌ర‌కు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయిన ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, ఉండి నియోజ‌క‌వ‌ర్గం…

1 hour ago

కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా?: సుప్రీంకోర్టు ఘాటు ప్ర‌శ్న‌

ప్ర‌జ‌లు, శాంతియుతంగా నిర‌స‌న చేస్తున్న‌వారిని కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా? అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…

2 hours ago

సొంత పార్టీ లేన‌ట్టే… సాయిరెడ్డి వెనుక‌డుగు రీజ‌నిదేనా?

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడ‌తాన‌ని కొన్నాళ్ల కింద‌టే ప్ర‌క‌టించారు.…

2 hours ago