తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ రైస్ లో మరో కొత్త పేరు వచ్చి చేరింది. నిన్న మొన్నటి వరకు సినిమా దర్శకులు, నిర్మాతలు పోటీపడుతున్నారనేది తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక టీవీ ఛానల్ అధినేతకు చంద్రబాబు నాయుడు చైర్మన్ పదవిని ఖరారు చేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇది అధికారికంగా కాదు. ప్రచారం అయితే బాగా జరిగింది. దీనిపై టిడిపి నాయకులు ఎవరూ కూడా స్పందించలేదు. ఇక ఇంకేముంది అయిపోయింది మరికొద్ది రోజుల్లో నామినేటెడ్ టీటీడీ బోర్డును నిర్మించేస్తున్నారని అనుకుంటున్న సమయంలో మరోసారి ఈ బోర్డు విషయంలో చంద్రబాబు నిర్ణయం మారినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్వి రమణ పేరు ఇప్పుడు టిటిడి చైర్మన్ రేస్ లో ముందంజలో ఉందని అంటున్నారు. ప్రస్తుతం అనధికారికంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని ఇటీవల అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ ముఖ్యమంత్రిని కోరారని దీనికైనా ప్రాథమికంగా అంగీకారం తెలిపారని అంటున్నారు. దీనిపై అనేక కోణాల్లో చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఎందుకంటే ఏడాది కిందటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణకు ఇప్పుడు అనూహ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తే న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా లేకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా అనే ఆలోచన చేస్తున్నారనేది ఒక భాగం. అయితే మరోవైపు ఈ పదవిని ఆశిస్తున్న వారిని సంతృప్తి పరచడం వారిని బుజ్జగించడం కూడా టైం పట్టే అవకాశం ఉందని మరో చర్చ నడుస్తుంది.
ఎలా చూసుకున్నా టిటిడి చైర్మన్ పదవి విషయంలో అనేకమంది పేర్లు తెరమీదకి రావడం వీరిలో పక్కన పెట్టలేని స్థాయిలో కొంతమంది ప్రయత్నాలు చేయడం వంటివి నిజానికి చాలా చర్చనీయాంశంగాను అలాగే టిటిడి చైర్మన్ పదవి ప్రాధాన్యాన్ని మరింత ఆసక్తిగాను మార్చాయి. చివరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జస్టిస్ ఎన్వి రమణ వ్యక్తిగతంగా చూసుకుంటే దైవ భక్తి ఉన్న మాజీ న్యాయమూర్తి. అదే విధంగా సౌమ్యుడు, వివాద రహితుడు, ఎట్లాంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వడానికి ఎవరూ తప్పు పట్టుకపోయినా కానీ పార్టీలోనూ ఇతర రంగాల్లోనూ ఈ పదవి కోసం ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్న నేపథ్యంలో జస్టిస్ ఎన్వి రమణకు ఎంత మేరకు చంద్రబాబు ముగ్గు చూపుతారు అనేది చూడాలి.
This post was last modified on August 21, 2024 12:31 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…