తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ రైస్ లో మరో కొత్త పేరు వచ్చి చేరింది. నిన్న మొన్నటి వరకు సినిమా దర్శకులు, నిర్మాతలు పోటీపడుతున్నారనేది తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక టీవీ ఛానల్ అధినేతకు చంద్రబాబు నాయుడు చైర్మన్ పదవిని ఖరారు చేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇది అధికారికంగా కాదు. ప్రచారం అయితే బాగా జరిగింది. దీనిపై టిడిపి నాయకులు ఎవరూ కూడా స్పందించలేదు. ఇక ఇంకేముంది అయిపోయింది మరికొద్ది రోజుల్లో నామినేటెడ్ టీటీడీ బోర్డును నిర్మించేస్తున్నారని అనుకుంటున్న సమయంలో మరోసారి ఈ బోర్డు విషయంలో చంద్రబాబు నిర్ణయం మారినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్వి రమణ పేరు ఇప్పుడు టిటిడి చైర్మన్ రేస్ లో ముందంజలో ఉందని అంటున్నారు. ప్రస్తుతం అనధికారికంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని ఇటీవల అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ ముఖ్యమంత్రిని కోరారని దీనికైనా ప్రాథమికంగా అంగీకారం తెలిపారని అంటున్నారు. దీనిపై అనేక కోణాల్లో చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఎందుకంటే ఏడాది కిందటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణకు ఇప్పుడు అనూహ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తే న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా లేకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా అనే ఆలోచన చేస్తున్నారనేది ఒక భాగం. అయితే మరోవైపు ఈ పదవిని ఆశిస్తున్న వారిని సంతృప్తి పరచడం వారిని బుజ్జగించడం కూడా టైం పట్టే అవకాశం ఉందని మరో చర్చ నడుస్తుంది.
ఎలా చూసుకున్నా టిటిడి చైర్మన్ పదవి విషయంలో అనేకమంది పేర్లు తెరమీదకి రావడం వీరిలో పక్కన పెట్టలేని స్థాయిలో కొంతమంది ప్రయత్నాలు చేయడం వంటివి నిజానికి చాలా చర్చనీయాంశంగాను అలాగే టిటిడి చైర్మన్ పదవి ప్రాధాన్యాన్ని మరింత ఆసక్తిగాను మార్చాయి. చివరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జస్టిస్ ఎన్వి రమణ వ్యక్తిగతంగా చూసుకుంటే దైవ భక్తి ఉన్న మాజీ న్యాయమూర్తి. అదే విధంగా సౌమ్యుడు, వివాద రహితుడు, ఎట్లాంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వడానికి ఎవరూ తప్పు పట్టుకపోయినా కానీ పార్టీలోనూ ఇతర రంగాల్లోనూ ఈ పదవి కోసం ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్న నేపథ్యంలో జస్టిస్ ఎన్వి రమణకు ఎంత మేరకు చంద్రబాబు ముగ్గు చూపుతారు అనేది చూడాలి.
This post was last modified on August 21, 2024 12:31 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…