తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ రైస్ లో మరో కొత్త పేరు వచ్చి చేరింది. నిన్న మొన్నటి వరకు సినిమా దర్శకులు, నిర్మాతలు పోటీపడుతున్నారనేది తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక టీవీ ఛానల్ అధినేతకు చంద్రబాబు నాయుడు చైర్మన్ పదవిని ఖరారు చేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇది అధికారికంగా కాదు. ప్రచారం అయితే బాగా జరిగింది. దీనిపై టిడిపి నాయకులు ఎవరూ కూడా స్పందించలేదు. ఇక ఇంకేముంది అయిపోయింది మరికొద్ది రోజుల్లో నామినేటెడ్ టీటీడీ బోర్డును నిర్మించేస్తున్నారని అనుకుంటున్న సమయంలో మరోసారి ఈ బోర్డు విషయంలో చంద్రబాబు నిర్ణయం మారినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్వి రమణ పేరు ఇప్పుడు టిటిడి చైర్మన్ రేస్ లో ముందంజలో ఉందని అంటున్నారు. ప్రస్తుతం అనధికారికంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని ఇటీవల అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ ముఖ్యమంత్రిని కోరారని దీనికైనా ప్రాథమికంగా అంగీకారం తెలిపారని అంటున్నారు. దీనిపై అనేక కోణాల్లో చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఎందుకంటే ఏడాది కిందటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణకు ఇప్పుడు అనూహ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తే న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా లేకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా అనే ఆలోచన చేస్తున్నారనేది ఒక భాగం. అయితే మరోవైపు ఈ పదవిని ఆశిస్తున్న వారిని సంతృప్తి పరచడం వారిని బుజ్జగించడం కూడా టైం పట్టే అవకాశం ఉందని మరో చర్చ నడుస్తుంది.
ఎలా చూసుకున్నా టిటిడి చైర్మన్ పదవి విషయంలో అనేకమంది పేర్లు తెరమీదకి రావడం వీరిలో పక్కన పెట్టలేని స్థాయిలో కొంతమంది ప్రయత్నాలు చేయడం వంటివి నిజానికి చాలా చర్చనీయాంశంగాను అలాగే టిటిడి చైర్మన్ పదవి ప్రాధాన్యాన్ని మరింత ఆసక్తిగాను మార్చాయి. చివరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జస్టిస్ ఎన్వి రమణ వ్యక్తిగతంగా చూసుకుంటే దైవ భక్తి ఉన్న మాజీ న్యాయమూర్తి. అదే విధంగా సౌమ్యుడు, వివాద రహితుడు, ఎట్లాంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వడానికి ఎవరూ తప్పు పట్టుకపోయినా కానీ పార్టీలోనూ ఇతర రంగాల్లోనూ ఈ పదవి కోసం ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్న నేపథ్యంలో జస్టిస్ ఎన్వి రమణకు ఎంత మేరకు చంద్రబాబు ముగ్గు చూపుతారు అనేది చూడాలి.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…