ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఉమ్మడి కృష్నాజిల్లాలోని గుడివాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్ను అధికారికంగా ప్రారంభించనున్నారు. క్యాంటీన్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి చెత్త చెదారం లేకుండా శుభ్రం చేశారు. క్యాంటీన్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు, క్యాంటీన్ కు ఎడం వైపున వేదిక, ర్యాంపు, నీడ కోసం షెడ్ నిర్మాణం, ఆవరణలో మొక్కలు నాటారు. క్యాంటీన్ ప్రారంభించాక.. సీఎం చంద్రబాబు తొలిసారి గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు.
వేదిక వద్ద అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్సులు, వైద్యులు, మందులు సిద్ధంగా ఉంచారు. వేదిక అలంకరణ, బ్యాక్ డ్రాప్ స్క్రీన్, సూచిక బోర్డుల ఏర్పాటు, విద్యుత్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా జనరేటర్ల ఏర్పాటు చేశారు. ఇక, కీలకమైన ముఖ్యమంత్రి రాకపోకల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లపై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కీలకమైన నియోజకవర్గం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గట్టి పోలీసు బందోబస్తు చేపట్టారు.
అసలు విషయంపైనే ఆసక్తి
అన్న క్యాంటీన్ ప్రారంభించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. అయితే.. ఈ నియోజకవర్గానికి, మిగిలిన నియోజకవర్గాలకు చాలా తేడాఉంది. గతంలో వైసీపీ మంత్రిగా ఉన్న ఇక్కడి ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని పరుషంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఎట్టి పరిస్థితిలోనూ ఓడించాలన్న సంకల్పంతో చంద్రబాబు ఎన్నారై వెనిగండ్ల రాముకు ఈ టికెట్ ఇచ్చారు. మొత్తానికి ఓడించారు.
ఈ నేపథ్యంలో తాజా సమావేశంలో చంద్రబాబు ఏం చెబుతారు? కొడాలికి ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? ఆయన హయాంలో కేసినో.. పేకాట క్లబ్బులకు ఆలవాలంగా మారిన గుడివాడలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలను చేపట్టేందుకు శ్రీకారం చుడతారన్న చర్చ జోరుగా సాగుతోంది. అదేవిధంగా చంద్రబాబు గెలిస్తే.. తాను ఆయన బూట్లు తుడుస్తూ.. ఆయన పాదాల దగ్గరే పడి ఉంటానని గతంలో కొడాలి శపథం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ఆ శపథాన్ని గుర్తు చేస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
This post was last modified on August 15, 2024 10:04 am
ఎక్కడ ఏ రాష్ట్రంలో షూటింగ్ చేసినా అదో పెద్ద సంచలనంగా మారిపోయిన ఎస్ఎస్ఎంబి 29 గురించి రాజమౌళి ఇప్పటిదాకా అధికారికంగా…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి వచ్చిన ఓ ప్రకటన ఈ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది మార్చి…
ఏపీలో విపక్షం వెనుక ఓ పక్కా ప్రణాళికతో వేసే ప్రతి అడుగును ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ వేయించే…
హీరోగా విలన్ గా తెరమీద కనిపించడం బాగా తగ్గించేసిన దగ్గుబాటి రానా తండ్రి సురేష్ బాబు బాటలోనే ప్రొడక్షన్ ని…
ఒక పెద్ద నటుడి కుటుంబం నుంచి ఒకరు నటనలోకి వస్తే.. ఆటోమేటిగ్గా వాళ్లు ఫేమస్ అయిపోతారు. కానీ కొందరు మాత్రం…