ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఉమ్మడి కృష్నాజిల్లాలోని గుడివాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్ను అధికారికంగా ప్రారంభించనున్నారు. క్యాంటీన్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి చెత్త చెదారం లేకుండా శుభ్రం చేశారు. క్యాంటీన్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు, క్యాంటీన్ కు ఎడం వైపున వేదిక, ర్యాంపు, నీడ కోసం షెడ్ నిర్మాణం, ఆవరణలో మొక్కలు నాటారు. క్యాంటీన్ ప్రారంభించాక.. సీఎం చంద్రబాబు తొలిసారి గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు.
వేదిక వద్ద అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్సులు, వైద్యులు, మందులు సిద్ధంగా ఉంచారు. వేదిక అలంకరణ, బ్యాక్ డ్రాప్ స్క్రీన్, సూచిక బోర్డుల ఏర్పాటు, విద్యుత్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా జనరేటర్ల ఏర్పాటు చేశారు. ఇక, కీలకమైన ముఖ్యమంత్రి రాకపోకల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లపై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కీలకమైన నియోజకవర్గం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గట్టి పోలీసు బందోబస్తు చేపట్టారు.
అసలు విషయంపైనే ఆసక్తి
అన్న క్యాంటీన్ ప్రారంభించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. అయితే.. ఈ నియోజకవర్గానికి, మిగిలిన నియోజకవర్గాలకు చాలా తేడాఉంది. గతంలో వైసీపీ మంత్రిగా ఉన్న ఇక్కడి ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని పరుషంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఎట్టి పరిస్థితిలోనూ ఓడించాలన్న సంకల్పంతో చంద్రబాబు ఎన్నారై వెనిగండ్ల రాముకు ఈ టికెట్ ఇచ్చారు. మొత్తానికి ఓడించారు.
ఈ నేపథ్యంలో తాజా సమావేశంలో చంద్రబాబు ఏం చెబుతారు? కొడాలికి ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? ఆయన హయాంలో కేసినో.. పేకాట క్లబ్బులకు ఆలవాలంగా మారిన గుడివాడలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలను చేపట్టేందుకు శ్రీకారం చుడతారన్న చర్చ జోరుగా సాగుతోంది. అదేవిధంగా చంద్రబాబు గెలిస్తే.. తాను ఆయన బూట్లు తుడుస్తూ.. ఆయన పాదాల దగ్గరే పడి ఉంటానని గతంలో కొడాలి శపథం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ఆ శపథాన్ని గుర్తు చేస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
This post was last modified on August 15, 2024 10:04 am
ఎయిర్పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…