ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీసింది. తనపై కేసు పెట్టిన వారిని ఊరుకునేది లేదని నాగేందర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అధికారులకు ప్రవిలేజ్(శాసన సభా హక్కులు ఉల్లంఘించడం) నోటీసులు ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
అసలు ఏం జరిగింది?
గత శనివారం.. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీహిల్స్ డివిజన్లో ఉన్న నందగిరిహిల్స్లో పార్క్ గోడను స్థానికులు కొందరు కూలగొట్టారు. అయితే.. దీనిని సీరియస్గా తీసుకున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. గోడకూల్చివేసిన ఘటన వెనుక ఎమ్మెల్యే ప్రోద్బలం ఉందని గుర్తించారు. ఎమ్మెల్యే దూకుడు కారణంగానే స్థానికులు కొందరు పార్కు స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలోనే పార్కు గోడను కూలదోశారని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.
ఈ క్రమంలో స్థానికులు సహా ఎమ్మెల్యే దానం నాగేందర్పై జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పార్కు ఆక్రమణదారులను కావాలని రెచ్చగొట్టారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన నాగేందర్.. జీహెచ్ఎంసీ అధికారులపై నిప్పులు చెరిగారు. గోడ కూల్చివేత, తనపై నమోదైన కేసు అంశంపై ఆయన ఫైరయ్యారు. సంబంధిత అధికారులకు ప్రివిలైజ్ నోటీస్ ఇస్తానని హెచ్చరించారు. అసలు ఏం జరిగిందో తెలుసా? అని ప్రశ్నించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా అధికారులు కళ్లు మూసుకుని పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించిన దానం.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. “నందగిరిహిల్స్లో పార్కు గోడ కారణంగా స్థానికులు ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. దీంతో నేను అక్కడకు వెళ్లా. ఇది నా నియోజకవర్గం. నేను వెళ్లే హక్కు నాకుంది. నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికీ లేదు. ప్రజాప్రతి నిధిగా ప్రజల సమస్యలు తీర్చడమే నా బాధ్యత” అని దానం అన్నారు. అంతేకాదు.. ఇలాంటి కేసులు తనకు కొత్తకాదని, ఎన్నో చూశానని చెప్పుకొచ్చారు.
This post was last modified on August 13, 2024 5:11 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…