ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీసింది. తనపై కేసు పెట్టిన వారిని ఊరుకునేది లేదని నాగేందర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అధికారులకు ప్రవిలేజ్(శాసన సభా హక్కులు ఉల్లంఘించడం) నోటీసులు ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
అసలు ఏం జరిగింది?
గత శనివారం.. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీహిల్స్ డివిజన్లో ఉన్న నందగిరిహిల్స్లో పార్క్ గోడను స్థానికులు కొందరు కూలగొట్టారు. అయితే.. దీనిని సీరియస్గా తీసుకున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. గోడకూల్చివేసిన ఘటన వెనుక ఎమ్మెల్యే ప్రోద్బలం ఉందని గుర్తించారు. ఎమ్మెల్యే దూకుడు కారణంగానే స్థానికులు కొందరు పార్కు స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలోనే పార్కు గోడను కూలదోశారని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.
ఈ క్రమంలో స్థానికులు సహా ఎమ్మెల్యే దానం నాగేందర్పై జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పార్కు ఆక్రమణదారులను కావాలని రెచ్చగొట్టారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన నాగేందర్.. జీహెచ్ఎంసీ అధికారులపై నిప్పులు చెరిగారు. గోడ కూల్చివేత, తనపై నమోదైన కేసు అంశంపై ఆయన ఫైరయ్యారు. సంబంధిత అధికారులకు ప్రివిలైజ్ నోటీస్ ఇస్తానని హెచ్చరించారు. అసలు ఏం జరిగిందో తెలుసా? అని ప్రశ్నించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా అధికారులు కళ్లు మూసుకుని పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించిన దానం.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. “నందగిరిహిల్స్లో పార్కు గోడ కారణంగా స్థానికులు ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. దీంతో నేను అక్కడకు వెళ్లా. ఇది నా నియోజకవర్గం. నేను వెళ్లే హక్కు నాకుంది. నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికీ లేదు. ప్రజాప్రతి నిధిగా ప్రజల సమస్యలు తీర్చడమే నా బాధ్యత” అని దానం అన్నారు. అంతేకాదు.. ఇలాంటి కేసులు తనకు కొత్తకాదని, ఎన్నో చూశానని చెప్పుకొచ్చారు.
This post was last modified on August 13, 2024 5:11 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…