ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీసింది. తనపై కేసు పెట్టిన వారిని ఊరుకునేది లేదని నాగేందర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అధికారులకు ప్రవిలేజ్(శాసన సభా హక్కులు ఉల్లంఘించడం) నోటీసులు ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
అసలు ఏం జరిగింది?
గత శనివారం.. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీహిల్స్ డివిజన్లో ఉన్న నందగిరిహిల్స్లో పార్క్ గోడను స్థానికులు కొందరు కూలగొట్టారు. అయితే.. దీనిని సీరియస్గా తీసుకున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. గోడకూల్చివేసిన ఘటన వెనుక ఎమ్మెల్యే ప్రోద్బలం ఉందని గుర్తించారు. ఎమ్మెల్యే దూకుడు కారణంగానే స్థానికులు కొందరు పార్కు స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలోనే పార్కు గోడను కూలదోశారని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.
ఈ క్రమంలో స్థానికులు సహా ఎమ్మెల్యే దానం నాగేందర్పై జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పార్కు ఆక్రమణదారులను కావాలని రెచ్చగొట్టారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన నాగేందర్.. జీహెచ్ఎంసీ అధికారులపై నిప్పులు చెరిగారు. గోడ కూల్చివేత, తనపై నమోదైన కేసు అంశంపై ఆయన ఫైరయ్యారు. సంబంధిత అధికారులకు ప్రివిలైజ్ నోటీస్ ఇస్తానని హెచ్చరించారు. అసలు ఏం జరిగిందో తెలుసా? అని ప్రశ్నించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా అధికారులు కళ్లు మూసుకుని పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించిన దానం.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. “నందగిరిహిల్స్లో పార్కు గోడ కారణంగా స్థానికులు ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. దీంతో నేను అక్కడకు వెళ్లా. ఇది నా నియోజకవర్గం. నేను వెళ్లే హక్కు నాకుంది. నన్ను అడ్డుకునే అధికారం ఏ అధికారికీ లేదు. ప్రజాప్రతి నిధిగా ప్రజల సమస్యలు తీర్చడమే నా బాధ్యత” అని దానం అన్నారు. అంతేకాదు.. ఇలాంటి కేసులు తనకు కొత్తకాదని, ఎన్నో చూశానని చెప్పుకొచ్చారు.
This post was last modified on August 13, 2024 5:11 pm
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…