రాష్ట్రంలో చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. ఈ నెల 12(సోమవారం)కు రెండు మాసాలు పూర్తవుతాయి. జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. మరి ఈ రెండు మాసాల కాలంలో చంద్రబాబు తనదైన మార్కు, మార్పు చూపించారా? అంటే.. చూపిస్తున్నారనే చెప్పాలి. ఒకే రోజు మార్పు సాకారం కాదు. సో.. ఈ రెండు మాసాల్లో చంద్రబాబు వేసిన అడుగులు చూస్తే.. వచ్చే రెండేళ్లకు కావాల్సిన వనరులను ఆయన ఎలా సమకూర్చుకుంటున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
ఒక వైపు అభివృద్ధి-మరో వైపు సంక్షేమం ఈ రెండు అంశాలను ప్రధానంగా తీసుకుని చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. రాజధాని అమరావతికి సంబంధించి ఇప్పటికే జంగిల్ క్లియరన్స్కు ఆదేశాలు ఇచ్చారు. ఇది ప్రస్తుతం కొనసాగుతోంది. ఇదేసమయంలో కేంద్రం నుంచి రూ.15 వేల కోట్ల చొప్పున రుణం ఇప్పించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కాకుండా.. మరో 15 వేల కోట్ల అప్పు కోసం. ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును అభ్యర్థించింది.
దీంతోప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా తాజాగా అమరావతిలో పర్యటించారు. ఇక్కడ జరుగుతున్న, నిలిపివేసిన పనులను కూడా వారు పరిశీలించారు. దీంతో అమరావతి ఒక కొలిక్కి వచ్చింది. ఇక, పోలవరం విషయాన్ని కేంద్రానికి వదిలిపెట్టారు. అది కూడా సాకారం కానుంది. మరోవైపు ప్రజల నైపుణ్యాలను తెలుసుకునేందుకు, వారికి ఉపాధి, ఉద్యోగాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నైపుణ్య గణను కూడా చేపట్టారు. ఇది కొంత వరకు మేలు చేస్తుంది. దీనికి తోడు డీఎస్సీ వేశారు. ఇలా.. అభివృద్ధి పరంగా ముందుకు సాగుతున్నారు.
మరోవైపు.. సంక్షేమాన్ని తీసుకుంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పెంచిన ఫించన్లను ప్రతి నెలా 1నే ఠంచనుగా అందిస్తున్నారు. ఇక, మిగిలిన వాటిలో కీలకమైన.. అన్న క్యాంటీన్లను మరో రెండు రోజుల్లోనే ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా ఇవి ఏర్పాటు కానున్నాయి. మరోవైపు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించేందుకు అధ్యయనం జరుగుతోంది. ఇలా.. ఇటు సంక్షేమాన్ని కూడా రెండో చేత్తోముందుకు తీసుకు వెళ్తున్నారు.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…