రాష్ట్రంలో చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. ఈ నెల 12(సోమవారం)కు రెండు మాసాలు పూర్తవుతాయి. జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. మరి ఈ రెండు మాసాల కాలంలో చంద్రబాబు తనదైన మార్కు, మార్పు చూపించారా? అంటే.. చూపిస్తున్నారనే చెప్పాలి. ఒకే రోజు మార్పు సాకారం కాదు. సో.. ఈ రెండు మాసాల్లో చంద్రబాబు వేసిన అడుగులు చూస్తే.. వచ్చే రెండేళ్లకు కావాల్సిన వనరులను ఆయన ఎలా సమకూర్చుకుంటున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
ఒక వైపు అభివృద్ధి-మరో వైపు సంక్షేమం ఈ రెండు అంశాలను ప్రధానంగా తీసుకుని చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. రాజధాని అమరావతికి సంబంధించి ఇప్పటికే జంగిల్ క్లియరన్స్కు ఆదేశాలు ఇచ్చారు. ఇది ప్రస్తుతం కొనసాగుతోంది. ఇదేసమయంలో కేంద్రం నుంచి రూ.15 వేల కోట్ల చొప్పున రుణం ఇప్పించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కాకుండా.. మరో 15 వేల కోట్ల అప్పు కోసం. ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును అభ్యర్థించింది.
దీంతోప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కూడా తాజాగా అమరావతిలో పర్యటించారు. ఇక్కడ జరుగుతున్న, నిలిపివేసిన పనులను కూడా వారు పరిశీలించారు. దీంతో అమరావతి ఒక కొలిక్కి వచ్చింది. ఇక, పోలవరం విషయాన్ని కేంద్రానికి వదిలిపెట్టారు. అది కూడా సాకారం కానుంది. మరోవైపు ప్రజల నైపుణ్యాలను తెలుసుకునేందుకు, వారికి ఉపాధి, ఉద్యోగాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నైపుణ్య గణను కూడా చేపట్టారు. ఇది కొంత వరకు మేలు చేస్తుంది. దీనికి తోడు డీఎస్సీ వేశారు. ఇలా.. అభివృద్ధి పరంగా ముందుకు సాగుతున్నారు.
మరోవైపు.. సంక్షేమాన్ని తీసుకుంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా పెంచిన ఫించన్లను ప్రతి నెలా 1నే ఠంచనుగా అందిస్తున్నారు. ఇక, మిగిలిన వాటిలో కీలకమైన.. అన్న క్యాంటీన్లను మరో రెండు రోజుల్లోనే ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా ఇవి ఏర్పాటు కానున్నాయి. మరోవైపు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించేందుకు అధ్యయనం జరుగుతోంది. ఇలా.. ఇటు సంక్షేమాన్ని కూడా రెండో చేత్తోముందుకు తీసుకు వెళ్తున్నారు.
This post was last modified on August 12, 2024 11:08 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…