ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో కీలక నేతగా చక్రం తిప్పుతున్న మాజీ ఎంపీ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం, విస్తృత పరిచయాలు ఉన్న మాగంటి కుటుంబంలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయా యి. ఆయన సైకిల్ దిగుతున్నారనే ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకున్నా.. అలాంటివన్నీ.. బూటకమని, వెబ్ మీడియాకు పనీపాటా లేకుండా రాతలు రాస్తోందని ఈసడించుకున్న టీడీపీలోని ఓ వర్గం.. తాజాగా వెలువడుతున్న సంకేతాలతో షాక్కు గురవుతోంది. అజాత శతృవుగా పేరు తెచ్చుకున్న మాగంటి బాబు.. టీడీపీకి పెద్ద ఎస్సర్టే అనడంలో సందేహం లేదు.
ఆయన రాజకీయంగా దూకుడు చూపించడంలోను, కార్యకర్తలనుకలుపుకొని పోవడంలోనూ తనదైన శైలిని ప్రదర్శించారు. ఎన్నికల సమయంలోనూ ఆర్థికంగా పార్టీకి అండగా నిలిచేవారు. అయితే, ఆయన గత కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు చెందిన వ్యాపారానికి అనుమతులు ఇచ్చే విషయం సహా.. తన కుమారుడి రాజకీయ భవితవ్యంపైనా ఆయన దిగులు పెట్టుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా.. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే తన వ్యాపార విస్తరణకు అనుమతి ఇవ్వాలని ఒత్తిడి చేసినా.. రేపు చూద్దాం.. మాపు చూద్దాం.. అంటూ దాటవేశారు. తీరా ఎన్నికలు అయ్యాక… వైసీపీ అధికారంలోకి వచ్చింది.
పోనీ. వ్యాపారాలను పక్కన పెడితే..కుమారుడు రాంజీ విషయాన్నయినా పట్టించుకుని హామీ ఇవ్వాలని ఆయన బాబు ను కోరారు. ఈ విషయంలోనూ బాబు మౌనంగానే ఉన్నారు. మరో పక్క, మాగంటి ఆరోగ్యం కూడా ఇబ్బందిగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన అసంతృప్తిని గమనించిన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాగంటి మిత్రుడు.. ఒకరు మా పార్టీలోకి వచ్చెయ్.. అంతా సీఎం చూసుకుంటారు. అని హామీ ఇచ్చారని, దీంతో మాగంటి ఫ్యామిలీ పార్టీ మారేందుకు రెడీ అయిందని అంటున్నారు. దీనికి పార్టీ కూడా ఓకే చెప్పిందని తెలిసింది. ఇక.. వీటిని బలపరుస్తున్నాయా? అన్నట్టుగా.. కొన్ని సంకేతాలు వెలుగు చూశాయి.
రెండు రోజుల కిందటి వరకు మాగంటి ఇంటిపై ఎగిరిన… టీడీపీ జెండా మాయమైంది. అదేవిధంగా ఏలూరులోని ఆయన నివాసానికి అర కిలోమీటరు పరిధిలో ఏర్పాటు చేసిన ఫెక్సీలు కూడా తీసేశారు. ఇదిలావుంటే, ఆయన కుమారుడు నిత్యం ఏలూరులోని మంత్రి ఆళ్లనాని నివాసానికి చక్కర్లు కొడుతున్నారని తెలుస్తోంది. ఈ సంకేతాలను గమనిస్తే… మాగంటి పార్టీ మార్పు ఖాయమేనని… ఇది పుకారు కాదని పరిశీలకులు చెబుతున్నారు. చిత్రం ఏంటంటే.. ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు మౌనం పాటించడం. ఇప్పటి వరకు వెళ్లిపోయిన నాయకుల విషయంలోనూ ఇలానే చేతులుకాలే వరకు బాబు ఎదురు చూశారని.. ఇప్పుడు కూడా ఇంతేనని అంటున్నారు.
This post was last modified on September 26, 2020 1:16 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…