ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో కీలక నేతగా చక్రం తిప్పుతున్న మాజీ ఎంపీ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం, విస్తృత పరిచయాలు ఉన్న మాగంటి కుటుంబంలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయా యి. ఆయన సైకిల్ దిగుతున్నారనే ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకున్నా.. అలాంటివన్నీ.. బూటకమని, వెబ్ మీడియాకు పనీపాటా లేకుండా రాతలు రాస్తోందని ఈసడించుకున్న టీడీపీలోని ఓ వర్గం.. తాజాగా వెలువడుతున్న సంకేతాలతో షాక్కు గురవుతోంది. అజాత శతృవుగా పేరు తెచ్చుకున్న మాగంటి బాబు.. టీడీపీకి పెద్ద ఎస్సర్టే అనడంలో సందేహం లేదు.
ఆయన రాజకీయంగా దూకుడు చూపించడంలోను, కార్యకర్తలనుకలుపుకొని పోవడంలోనూ తనదైన శైలిని ప్రదర్శించారు. ఎన్నికల సమయంలోనూ ఆర్థికంగా పార్టీకి అండగా నిలిచేవారు. అయితే, ఆయన గత కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు చెందిన వ్యాపారానికి అనుమతులు ఇచ్చే విషయం సహా.. తన కుమారుడి రాజకీయ భవితవ్యంపైనా ఆయన దిగులు పెట్టుకున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా.. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే తన వ్యాపార విస్తరణకు అనుమతి ఇవ్వాలని ఒత్తిడి చేసినా.. రేపు చూద్దాం.. మాపు చూద్దాం.. అంటూ దాటవేశారు. తీరా ఎన్నికలు అయ్యాక… వైసీపీ అధికారంలోకి వచ్చింది.
పోనీ. వ్యాపారాలను పక్కన పెడితే..కుమారుడు రాంజీ విషయాన్నయినా పట్టించుకుని హామీ ఇవ్వాలని ఆయన బాబు ను కోరారు. ఈ విషయంలోనూ బాబు మౌనంగానే ఉన్నారు. మరో పక్క, మాగంటి ఆరోగ్యం కూడా ఇబ్బందిగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన అసంతృప్తిని గమనించిన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాగంటి మిత్రుడు.. ఒకరు మా పార్టీలోకి వచ్చెయ్.. అంతా సీఎం చూసుకుంటారు. అని హామీ ఇచ్చారని, దీంతో మాగంటి ఫ్యామిలీ పార్టీ మారేందుకు రెడీ అయిందని అంటున్నారు. దీనికి పార్టీ కూడా ఓకే చెప్పిందని తెలిసింది. ఇక.. వీటిని బలపరుస్తున్నాయా? అన్నట్టుగా.. కొన్ని సంకేతాలు వెలుగు చూశాయి.
రెండు రోజుల కిందటి వరకు మాగంటి ఇంటిపై ఎగిరిన… టీడీపీ జెండా మాయమైంది. అదేవిధంగా ఏలూరులోని ఆయన నివాసానికి అర కిలోమీటరు పరిధిలో ఏర్పాటు చేసిన ఫెక్సీలు కూడా తీసేశారు. ఇదిలావుంటే, ఆయన కుమారుడు నిత్యం ఏలూరులోని మంత్రి ఆళ్లనాని నివాసానికి చక్కర్లు కొడుతున్నారని తెలుస్తోంది. ఈ సంకేతాలను గమనిస్తే… మాగంటి పార్టీ మార్పు ఖాయమేనని… ఇది పుకారు కాదని పరిశీలకులు చెబుతున్నారు. చిత్రం ఏంటంటే.. ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు మౌనం పాటించడం. ఇప్పటి వరకు వెళ్లిపోయిన నాయకుల విషయంలోనూ ఇలానే చేతులుకాలే వరకు బాబు ఎదురు చూశారని.. ఇప్పుడు కూడా ఇంతేనని అంటున్నారు.
This post was last modified on September 26, 2020 1:16 pm
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…