తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి దూకుడు మామూలుగా లేదని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఆయన టికెట్ దక్కించుకుని పోటీకి రెడీ అయినప్పుడు.. అనేక విమర్శలు వచ్చాయి. ఆయన ఇక్కడ ఉండరని.. ఢిల్లీలోనో.. బెంగళూరులోనో.. హైదరాబాద్లోనో మకాం వేస్తారని.. నియోజకవర్గం ప్రజలు తమ కష్టాలు చెప్పుకొనేందుకు ఫ్లైట్లు బుక్ చేసుకోవాలని వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా జనసేన మాజీ నాయకుడు పోతిన మహేష్ అయితే మరింత ఎక్కువగా విమర్శలు గుప్పించారు. సుజనా చౌదరిని కార్నర్ చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే.. ఆ విమర్శలకు చెక్ పెడుతూ.. సుజనా తన దూకుడు కొనసాగిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. తొలి నెలలో అంటే.. జూన్ 5- జూలై 5 మధ్య కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలోని కీలక సెంటర్లలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తాను ఈ నెల రోజుల కాలంలో ఏం చేశానో.. చూడండి! అంటూ.. నియోజకవర్గం ప్రజలకు సుజనా చౌదరి వివరించారు. దీంతో అప్పటి వరకు విమర్శలుచేసిన వారికి ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పేశా రు. ఇక, ఇప్పుడు రెండో నెలకు వచ్చేసరికి.. ఈ రెండో నెలలో కూడా తాను నియోజకవర్గానికి చేసిన మేళ్లను వివరిస్తూ..ప్లెక్సీల రూపంలో వివరించారు. ప్రధాన కూడళ్లలో వాటిని ఏర్పాటు చేశారు. దీనికి తోడు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
అదే.. జాబ్ మేళా! ఈ నెల 10న నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఆయన ప్రచారం చేస్తున్నారు. సుజనా ఫౌండేషన్ తరఫున పలు కంపెనీలను ఆహ్వానించినట్టు తెలిపారు. యువతీ యువకులు.. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుజనా కోరారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా.. ఇది కొనసాగుతుందని వివరించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. సుజనా ఇక్కడ ఉండడు… ఆయనను గెలిపిస్తే ఫ్లైట్ బుక్ చేసుకోవాలని.. విమర్శించిన వారికి సుజనా బలంగానే సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది.
This post was last modified on August 10, 2024 11:04 am
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…