వైసీపీ ఎమ్మెల్సీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు, ప్రస్తుతం కుటుంబ వివాదాలతో తెరమీదికి వచ్చి.. నెటిజన్లతో ముద్దుల మొగుడుగా ట్రోల్ అవుతున్న దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం బిగ్ ట్విస్ట్ తెరమీదికి వచ్చింది.
వివాదానికి కేంద్ర బిందువుగా దువ్వాడ సతీమణి వాణి, ఆయన కుమార్తెలు చెబుతున్న మరో మహిళ, దువ్వాడతో సహజీవనం చేస్తున్న దివ్వెల మాధురి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
‘దువ్వాడే నా సర్వస్వం’ అని ఒక్కమాటతో తేల్చి పారేశారు. తమది అక్రమ సంబంధం కాదని తెలిపారు. క్యారెక్టర్ లేని మహిళగా తనను ప్రచారం చేస్తున్నారని కానీ ఎవరికి క్యారెక్టర్ లేదో ఆలోచిం చుకోవాలని వ్యాఖ్యానించారు.
తమ తండ్రి వేరే మహిళతో ఉంటున్నాడంటూ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు గురువారం రాత్రి ఆయన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇది ప్రధాన మీడియాలోనూ జోరుగా వైరల్ అయింది. దీనికి కౌంటర్గా మాధురి మీడియా ముందుకు వచ్చారు.
ఈ క్రమంలో దువ్వాడ సతీమణి వాణిపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. “అసలు భర్తను వద్దనుకున్నదే వాణి. తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తే చాలనుకుంది. భర్త కన్నా ఆమెకు అసెంబ్లీ సీటే ఎక్కువైంది” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీనివాస్ ఎంతో ఆదుకున్నారని కూడా తెలిపారు. “నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ సందర్భంలో శ్రీనివాస్ అండగా ఉన్నారు” అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. దువ్వాడ తనకు ‘ఓ ఫ్రెండ్, ఫీలాసపర్.. ఇంకా అన్నీ’ అంటూ మాధురి కన్నీరు పెట్టుకున్నారు. దువ్వాడ అత్యంత నిజాయితీ పరుడని పేర్కొన్నారు. తాను ఎలాంటి ట్రాప్ చేయలేదని.. అయినా దువ్వాడ దగ్గర ఎలాంటి ఆస్తులు లేవని, ప్రస్తుతం ఆయన అప్పుల్లో ఉన్నారని మాధురి చెప్పారు. “ఆయనకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబానికి రాసిచ్చారు. నేను ఏం ఆశించి ట్రాప్ చేస్తాను” అని మాధురి ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దువ్వాడ కోసం తానే భారీగా డబ్బులు ఖర్చు చేసినట్టు ఆమె చెప్పారు. ఈ విషయం వైసీపీ వారికి కూడా తెలుసునన్నారు. “సహజీవనం చేసే హక్కు నాకుంది. మాది అక్రమ వ్యవహారం కాదు. వాణి నా పై నోరు పారేసుకోవడం సరికాదు” అని వార్నింగ్ ఇచ్చారు.
This post was last modified on August 10, 2024 6:16 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…