టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ దూకుడును, వైసీపీ నేతల వేధింపులను కూడా తట్టుకుని పార్టీ కోసం పనిచేసిన వారిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక నాయకుల సంగతి ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో జెండాలు మోసిన వారు.. పోలీసు దెబ్బలు తిన్నవారు..చాలా మందే ఉన్నారు. ఒక్కొక్కరిపై 20-30 కేసులు నమోదైన వారు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక సహజంగానే వీరి మేలు కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశం వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే “మాకేంటి?” అని క్షేత్రస్థాయిలో కీలక నాయకుల చెవిలో రొద పెడుతున్నారు. ఇది తప్పుకాదు. పార్టీ కోసం పనిచేశారు కాబట్టి.. తమకు కూడా మేలు చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. అయితే.. లెక్కకు మిక్కిలిగా ఉండడంతోనే చంద్రబాబుకు వీరిని ఏం చేయాలన్న ఆలోచన పెరిగింది. ఈ క్రమంలోనే లేదనుకున్న జన్మభూమి-2 ను తీసుకువస్తున్నారు. తద్వారా మెజారిటీ కార్యకర్తలకు ఈ కమిటీల్లో చోటు కల్పించనున్నారు. దీంతో స్థానికంగా వారు కొంత పార్టీ తరఫున గౌరవంగా ప్రజల మధ్యకువెళ్తారు.
రెండో కీలక నిర్ణయం.. ఇప్పటికీ ఆవాసాలు లేని కార్యకర్తలను గుర్తించి.. వారిని టిడ్కో పథకంలో లబ్ధి దారులుగా చేర్చడం, లేదా.. కొత్తగా తీసుకువస్తున్న ఇళ్ల పథకంలో మేలు జరిగేలా చూడడం. ఈ రెండింటలో కార్యకర్తలు ఏది కోరుకుంటే అది ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా వారి కుటుంబాలను ఆదుకునేందుకు కూడా చంద్రబాబు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా కార్యకర్తలు ఎవరైనా ప్రమాదాల్లో చిక్కుకుంటే రూ.5 లక్షలకు తగ్గకుండా వారికి ఇవ్వనున్నారు.
అదేసమయంలో కార్యకర్తలను కోల్పోయిన కుటుంబాల్లో ఇప్పటికే వెలుగులు నింపే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వారి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా దత్తత తీసుకుని చదివిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు. అదేవిధంగా కార్యకర్తల కుటుంబాలకు కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులను కూడా అందించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. మొత్తంగా చూస్తే.. కార్యకర్తలకు చంద్రబాబు మంచి ప్రియార్టీ ఇస్తున్నారనే చెప్పాలి.
This post was last modified on August 9, 2024 11:56 am
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…