Political News

కార్య‌క‌ర్త‌ల‌కు జై కొడుతున్న చంద్ర‌న్న‌..!

టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు కార్య‌క‌ర్త‌ల‌కు పెద్ద‌పీట వేస్తున్నారు. గ‌త ఐదేళ్ల‌లో వైసీపీ దూకుడును, వైసీపీ నేత‌ల వేధింపుల‌ను కూడా త‌ట్టుకుని పార్టీ కోసం ప‌నిచేసిన వారిని కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కీల‌క నాయ‌కుల సంగ‌తి ఎలా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో జెండాలు మోసిన వారు.. పోలీసు దెబ్బ‌లు తిన్న‌వారు..చాలా మందే ఉన్నారు. ఒక్కొక్క‌రిపై 20-30 కేసులు న‌మోదైన వారు కూడా క‌నిపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక స‌హ‌జంగానే వీరి మేలు కోసం ఏదైనా చేయాల‌న్న ఉద్దేశం వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే “మాకేంటి?” అని క్షేత్ర‌స్థాయిలో కీల‌క నాయ‌కుల చెవిలో రొద పెడుతున్నారు. ఇది త‌ప్పుకాదు. పార్టీ కోసం ప‌నిచేశారు కాబ‌ట్టి.. త‌మ‌కు కూడా మేలు చేయాల‌న్న ఉద్దేశంతో వారు ఉన్నారు. అయితే.. లెక్క‌కు మిక్కిలిగా ఉండ‌డంతోనే చంద్ర‌బాబుకు వీరిని ఏం చేయాల‌న్న ఆలోచ‌న‌ పెరిగింది. ఈ క్ర‌మంలోనే లేద‌నుకున్న జ‌న్మ‌భూమి-2 ను తీసుకువ‌స్తున్నారు. త‌ద్వారా మెజారిటీ కార్య‌క‌ర్త‌ల‌కు ఈ క‌మిటీల్లో చోటు క‌ల్పించ‌నున్నారు. దీంతో స్థానికంగా వారు కొంత పార్టీ త‌ర‌ఫున గౌర‌వంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువెళ్తారు.

రెండో కీల‌క నిర్ణ‌యం.. ఇప్ప‌టికీ ఆవాసాలు లేని కార్య‌క‌ర్త‌ల‌ను గుర్తించి.. వారిని టిడ్కో ప‌థ‌కంలో ల‌బ్ధి దారులుగా చేర్చ‌డం, లేదా.. కొత్త‌గా తీసుకువ‌స్తున్న ఇళ్ల ప‌థ‌కంలో మేలు జ‌రిగేలా చూడ‌డం. ఈ రెండింట‌లో కార్య‌క‌ర్త‌లు ఏది కోరుకుంటే అది ఇవ్వ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా వారి కుటుంబాల‌ను ఆదుకునేందుకు కూడా చంద్ర‌బాబు ప్ర‌త్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా కార్య‌క‌ర్త‌లు ఎవ‌రైనా ప్ర‌మాదాల్లో చిక్కుకుంటే రూ.5 ల‌క్ష‌ల‌కు త‌గ్గ‌కుండా వారికి ఇవ్వ‌నున్నారు.

అదేస‌మ‌యంలో కార్య‌క‌ర్త‌లను కోల్పోయిన కుటుంబాల్లో ఇప్ప‌టికే వెలుగులు నింపే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. వారి పిల్ల‌ల‌ను ఎన్టీఆర్ ట్ర‌స్టు ద్వారా దత్త‌త తీసుకుని చ‌దివిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకువెళ్ల‌నున్నారు. అదేవిధంగా కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు కేంద్రం అమ‌లు చేస్తున్న ఆయుష్మాన్ భార‌త్ కార్డుల‌ను కూడా అందించాల‌ని చంద్ర‌బాబు తాజాగా నిర్ణ‌యించారు. మొత్తంగా చూస్తే.. కార్య‌క‌ర్త‌ల‌కు చంద్ర‌బాబు మంచి ప్రియార్టీ ఇస్తున్నార‌నే చెప్పాలి.

This post was last modified on August 9, 2024 11:56 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

4 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

4 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

5 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

6 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

6 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

6 hours ago