టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ దూకుడును, వైసీపీ నేతల వేధింపులను కూడా తట్టుకుని పార్టీ కోసం పనిచేసిన వారిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలక నాయకుల సంగతి ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో జెండాలు మోసిన వారు.. పోలీసు దెబ్బలు తిన్నవారు..చాలా మందే ఉన్నారు. ఒక్కొక్కరిపై 20-30 కేసులు నమోదైన వారు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక సహజంగానే వీరి మేలు కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశం వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే “మాకేంటి?” అని క్షేత్రస్థాయిలో కీలక నాయకుల చెవిలో రొద పెడుతున్నారు. ఇది తప్పుకాదు. పార్టీ కోసం పనిచేశారు కాబట్టి.. తమకు కూడా మేలు చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. అయితే.. లెక్కకు మిక్కిలిగా ఉండడంతోనే చంద్రబాబుకు వీరిని ఏం చేయాలన్న ఆలోచన పెరిగింది. ఈ క్రమంలోనే లేదనుకున్న జన్మభూమి-2 ను తీసుకువస్తున్నారు. తద్వారా మెజారిటీ కార్యకర్తలకు ఈ కమిటీల్లో చోటు కల్పించనున్నారు. దీంతో స్థానికంగా వారు కొంత పార్టీ తరఫున గౌరవంగా ప్రజల మధ్యకువెళ్తారు.
రెండో కీలక నిర్ణయం.. ఇప్పటికీ ఆవాసాలు లేని కార్యకర్తలను గుర్తించి.. వారిని టిడ్కో పథకంలో లబ్ధి దారులుగా చేర్చడం, లేదా.. కొత్తగా తీసుకువస్తున్న ఇళ్ల పథకంలో మేలు జరిగేలా చూడడం. ఈ రెండింటలో కార్యకర్తలు ఏది కోరుకుంటే అది ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా వారి కుటుంబాలను ఆదుకునేందుకు కూడా చంద్రబాబు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా కార్యకర్తలు ఎవరైనా ప్రమాదాల్లో చిక్కుకుంటే రూ.5 లక్షలకు తగ్గకుండా వారికి ఇవ్వనున్నారు.
అదేసమయంలో కార్యకర్తలను కోల్పోయిన కుటుంబాల్లో ఇప్పటికే వెలుగులు నింపే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వారి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా దత్తత తీసుకుని చదివిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు. అదేవిధంగా కార్యకర్తల కుటుంబాలకు కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులను కూడా అందించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. మొత్తంగా చూస్తే.. కార్యకర్తలకు చంద్రబాబు మంచి ప్రియార్టీ ఇస్తున్నారనే చెప్పాలి.
This post was last modified on August 9, 2024 11:56 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…