ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నా పోటీ చేయవచ్చన్న కొత్త నిబంధనను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.
ఇక, దేశంలో తొలిసారిగా ఏపీలో నైపుణ్య గణన చేపట్టాలని, జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇక, టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు.
ఈ సమావేశంలో పేదరిక నిర్మూలనపై చర్చ జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రభుత్వానికి ఇస్తున్న సమయం అంత పార్టీకి కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు, ఎన్టీయే పార్టీలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పైరవీలకు తావులేకుండా, కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులలో ప్రాధాన్యతనిస్తామన్నారు. కూటమిలో సభ్యులకు కూడా నామినేటెడ్ పోస్టులు ఉంటాయన్నారు.
This post was last modified on August 8, 2024 6:33 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…