ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నా పోటీ చేయవచ్చన్న కొత్త నిబంధనను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.
ఇక, దేశంలో తొలిసారిగా ఏపీలో నైపుణ్య గణన చేపట్టాలని, జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇక, టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు.
ఈ సమావేశంలో పేదరిక నిర్మూలనపై చర్చ జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రభుత్వానికి ఇస్తున్న సమయం అంత పార్టీకి కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు, ఎన్టీయే పార్టీలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పైరవీలకు తావులేకుండా, కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులలో ప్రాధాన్యతనిస్తామన్నారు. కూటమిలో సభ్యులకు కూడా నామినేటెడ్ పోస్టులు ఉంటాయన్నారు.
This post was last modified on August 8, 2024 6:33 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…