ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నా పోటీ చేయవచ్చన్న కొత్త నిబంధనను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.
ఇక, దేశంలో తొలిసారిగా ఏపీలో నైపుణ్య గణన చేపట్టాలని, జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇక, టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు.
ఈ సమావేశంలో పేదరిక నిర్మూలనపై చర్చ జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రభుత్వానికి ఇస్తున్న సమయం అంత పార్టీకి కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు, ఎన్టీయే పార్టీలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందనలు తెలుపుతూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పైరవీలకు తావులేకుండా, కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులలో ప్రాధాన్యతనిస్తామన్నారు. కూటమిలో సభ్యులకు కూడా నామినేటెడ్ పోస్టులు ఉంటాయన్నారు.
This post was last modified on August 8, 2024 6:33 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…