తాజాగా రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 12 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిపికేషన్ ఇచ్చింది. దీనిలో తెలంగాణకు చెందిన కే. కేశవరావు(కేకే) కూడా ఉన్నారు.
అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ, జాతీయ పార్టీల నాయకులు కూడా ఉన్నారు. కేకే మినహా మిగిలిన 11 మంది కూడా.. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. దీంతో ఆయా సీట్లు ఖాళీ అయ్యాయి. వీటిలో కాంగ్రెస్, బీజేపీ, బీజేడీ(ఒడిశా) సహా పలు పార్టీల నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 9 రాష్ట్రాలకు చెందిన ఈ 12 స్థానాలకు కూడా సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఇవీ ఖాళీ అయిన సీట్లు
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద్ సోనోవాల్, జ్యోతిరాదిత్య సిందియాలు.. లోక్సభకు ఎన్నికయ్యారు. అంతకు ముందు వీరు రాజ్యసభ సభ్యులు. తెలంగాణకు చెందిన కేకే.. బీఆర్ ఎస్ నుంచి సొంత గూడు కాంగ్రెస్లోకి వచ్చారు.
ఒడిశాలోని బీజేడీకి చెందిన మమతా మోహంతా ఆ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలోకి చేరారు. దీంతో ఈ సీటు ఖాళీ అయింది. అదేవిధంగా లోక్సభకు ఎన్నికైన వారిలో కామాఖ్య ప్రసాద్(బీజేపీ, మిశా భారతి(ఆర్జేడీ) వివేక్ ఠాకూర్(బీజేపీ, దీపేందర్ సింగ్ హుడా(కాంగ్రెస్, ఉదయన్రాజే భోస్లే(బీజేపీ, కేసీ వేణుగోపాల్(కాంగ్రెస్, బిప్లవ్ కుమార్ దేవ్(బీజేపీ) ఉన్నారు.
ఆయా స్థానాలకు ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. 21న నామినేషన్లను తీసుకుంటారు. ఈ క్రమంలో సెప్టెంబరు 3న ప్రత్యేక ఎన్నికలు నిర్వహించి.. అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు. ఇక, కేకే విషయాన్ని తీసుకుంటే.. ఆయన స్థానాన్ని వేరేవారికి ఇచ్చే ఉద్దేశం లేదు. ఈ నేపథ్యంలో తిరిగి కేకేనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్కు బలం ఉన్న నేపథ్యంలో ఆయన గెలుపు నల్లేరుపై నడకే కానుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 8, 2024 10:57 am
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…