Political News

మేం టీఆర్ఎస్ లా కాదు…హరీశ్ కు బాలినేని కౌంటర్

కేంద్రం చేపట్టిన విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విద్యుత్ సంస్కరణలకు ఏపీ వంటి కొన్ని రాష్ట్రాలు సుముఖంగా ఉండగా తెలంగాణతోపాటు మరి కొన్ని రాష్ట్రాలు విముఖంగా ఉన్నాయి. ఆ సంస్కరణలకు అనుగుణంగా ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకుగాను స్మార్ట్ మీటర్లు బిగించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలోనే ఆ విషయంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇస్తామన్న రూ.4 వేల కోట్లకు ఆశపడి మీటర్లు బిగించేందుకు ఏపీ సర్కార్ సమ్మతించిందని హరీశ్ ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం ఇస్తాననన్న రూ.2,500 కోట్లు తాము వదులుకున్నామని, ఆ డబ్బులకు కక్కుర్తి పడి రైతుల మెడకు ఉరితాడు బిగించలేమని హరీశ్ షాకింగ్ కామెంట్లు చేశారు. హరీశ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు.

తమ ప్రభుత్వం… టీఆర్ఎస్ ప్రభుత్వంలా కాదని, కేంద్రంతో ఒక రోజు మంచిగా ఉండి…మరో రోజు గొడవ పడడం వంటివి చేయమని బాలినేని చురకలంటించారు. కేంద్రంతో ఏపీ సఖ్యతగా ఉంటే తప్పేమిటని బాలినేని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ఉండడం తప్పెలా అవుతుందని బాలినేని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే రూ.4 వేల కోట్ల నిధులను ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామని, ఆ డబ్బులు ఎవరి జేబుల్లో వేసుకోబోమని బాలినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల బిల్లులకు సంబంధించి డిస్కంలకు చెల్లించవలసిన మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తామని, ఇందులో అనుమానించాల్సిందేమీ లేదని హరీశ్ వ్యాఖ్యలకు బాలినేని కౌంటర్ ఇచ్చారు. ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం ద్వారా రైతులకు గతంలో మాదిరిగానే ఉచిత విద్యుత్ అందిస్తామని, ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని ఏపీ సర్కార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకంపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే.

This post was last modified on September 26, 2020 10:45 am

Share
Show comments
Published by
satya

Recent Posts

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

32 mins ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

49 mins ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

1 hour ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

2 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

2 hours ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

2 hours ago