Categories: Political News

జగన్ వచ్చారు.. వార్నింగ్ ఇచ్చారు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే కూలిపోతుంద‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌శ్నించ‌కూడ‌ద‌న్న ధోర‌ణితో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, అందుకే అంద‌రినీ భ‌య పెట్టి పాల‌న చేస్తు న్నార‌ని మండిప‌డ్డారు. ఇదే కొన‌సాగితే.. చంద్ర‌బాబు స‌హా కూట‌మి ప్ర‌భుత్వం బంగాళా ఖాతంలో కూలిపోవ‌డం ఖాయ‌మ‌నం జ‌గ‌న్‌ వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు భ‌య‌పెట్టి పాల‌న సాగించాల‌ని అనుకుంటున్నాడు. ఇదే చేస్తే.. ఇలాంటి ప‌నులే కొన‌సాగిస్తే.. చంద్ర‌బాబును, టీడీపీని కూడా ప్ర‌జ‌లు బంగాళాఖాతంలో క‌లిపేసే ప‌రిస్థితులు వ‌స్తాయి అని జ‌గ‌న్ అన్నారు.

సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో విర‌క్తి ఏర్ప‌డింద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. స‌హ‌జంగా ఒక ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌చ్చేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని… కానీ, చంద్ర‌బాబుస‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో అత్యంత స్వ‌ల్ప కాలంలోనే విర‌క్తి వ‌చ్చింద‌ని జ‌గ‌న్ చెప్పారు. ఎన్నిక‌ల‌కు ముందు ఊరూ వాడా ట‌ముకేసి మ‌రీ చెప్పిన ప‌థ‌కాల‌ను చంద్ర‌బాబు ఇప్పుడు మ‌రిచిపోయాడ‌న్నారు. రైతు భ‌రోసా, త‌ల్లికి వంద‌నం వంటి ప‌థ‌కాల‌ను ఆయ‌న ఎప్పుడో మ‌రిచిపోయాడ‌ని, దీంతో రైతులు, విద్యార్థుల త‌ల్లులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు.

మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌.. ఇక్క‌డ ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్య‌క‌ర్త‌ను ఆయ‌న ప‌రామర్శించారు. అనంత‌రం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌శ్నిస్తే.. కేసులు పెడుతున్నార‌ని.. భ‌య‌పెడుతున్నార‌ని చెప్పారు. ప్ర‌శ్నించే వారిపై దాడులు చేయ‌డం త‌ప్పుడు సంప్ర‌దాయ‌మ‌ని జ‌గ‌న్ చెప్పారు. దీనిని త‌క్ష‌ణ‌మే నిలుపుదల చేయాల‌న్నారు. రాష్ట్రంలో సాధార‌ణ ప్ర‌జ‌లు జీవించ‌లేని ప‌రిస్థితులు వ‌చ్చాయ‌న్న ఆయ‌న‌.. శాంతి భ‌ద్ర‌త‌లు ఎక్క‌డున్నాయ‌ని నిల‌దీశారు. వైసీపీ కార్యకర్తలు సహా మహిళలపైన కూడా అఘాయిత్యాలు పెరిగిపోయాయని దుయ్య‌బ‌ట్టారు.

దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌

రాష్ట్రంలో జ‌రుగుతున్న దారుణాల‌పైనా.. దాడుల‌పైనా దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. ఇటీవ‌ల నంద్యాల‌లో దారుణ హ‌త్య‌కు గురైన సుబ్బ‌రాయుడు కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తాన‌ని చెప్పారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న దారుణాల‌పై తాను హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి పోరాడతామని జగన్ చెప్పారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మార‌ణ కాండ‌పై గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

Share

Recent Posts

అమ్మాయిల ప్రైవేటు పార్ట్స్ మీద కొడితే సారి చెప్పరా

జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళన విరమించినప్పటికీ అది సృష్టించిన తుఫాన్ కొనసాగుతుంది. సద్దుమణిగిందనుకున్న విషయాన్ని శుక్రవారం…

29 minutes ago

హ్యాట్రిక్ ముద్ర కోసం ఫ్లాపుని మర్చిపోవాలా

చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్…

1 hour ago

నాగార్జున అసలు పాయింట్ మిస్సయ్యారు

ఆ మధ్య జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున ఒక మాట అన్నారు. ది ఒడిస్సి లాంటి…

1 hour ago

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

6 hours ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

6 hours ago

సూర్యతో కూడా… హడావుడి లేని అట్లూరి

సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది.…

7 hours ago