జగన్ వచ్చారు.. వార్నింగ్ ఇచ్చారు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే కూలిపోతుంద‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌శ్నించ‌కూడ‌ద‌న్న ధోర‌ణితో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, అందుకే అంద‌రినీ భ‌య పెట్టి పాల‌న చేస్తు న్నార‌ని మండిప‌డ్డారు. ఇదే కొన‌సాగితే.. చంద్ర‌బాబు స‌హా కూట‌మి ప్ర‌భుత్వం బంగాళా ఖాతంలో కూలిపోవ‌డం ఖాయ‌మ‌నం జ‌గ‌న్‌ వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు భ‌య‌పెట్టి పాల‌న సాగించాల‌ని అనుకుంటున్నాడు. ఇదే చేస్తే.. ఇలాంటి ప‌నులే కొన‌సాగిస్తే.. చంద్ర‌బాబును, టీడీపీని కూడా ప్ర‌జ‌లు బంగాళాఖాతంలో క‌లిపేసే ప‌రిస్థితులు వ‌స్తాయి అని జ‌గ‌న్ అన్నారు.

సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో విర‌క్తి ఏర్ప‌డింద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. స‌హ‌జంగా ఒక ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌చ్చేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని… కానీ, చంద్ర‌బాబుస‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో అత్యంత స్వ‌ల్ప కాలంలోనే విర‌క్తి వ‌చ్చింద‌ని జ‌గ‌న్ చెప్పారు. ఎన్నిక‌ల‌కు ముందు ఊరూ వాడా ట‌ముకేసి మ‌రీ చెప్పిన ప‌థ‌కాల‌ను చంద్ర‌బాబు ఇప్పుడు మ‌రిచిపోయాడ‌న్నారు. రైతు భ‌రోసా, త‌ల్లికి వంద‌నం వంటి ప‌థ‌కాల‌ను ఆయ‌న ఎప్పుడో మ‌రిచిపోయాడ‌ని, దీంతో రైతులు, విద్యార్థుల త‌ల్లులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు.

మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌.. ఇక్క‌డ ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్య‌క‌ర్త‌ను ఆయ‌న ప‌రామర్శించారు. అనంత‌రం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌శ్నిస్తే.. కేసులు పెడుతున్నార‌ని.. భ‌య‌పెడుతున్నార‌ని చెప్పారు. ప్ర‌శ్నించే వారిపై దాడులు చేయ‌డం త‌ప్పుడు సంప్ర‌దాయ‌మ‌ని జ‌గ‌న్ చెప్పారు. దీనిని త‌క్ష‌ణ‌మే నిలుపుదల చేయాల‌న్నారు. రాష్ట్రంలో సాధార‌ణ ప్ర‌జ‌లు జీవించ‌లేని ప‌రిస్థితులు వ‌చ్చాయ‌న్న ఆయ‌న‌.. శాంతి భ‌ద్ర‌త‌లు ఎక్క‌డున్నాయ‌ని నిల‌దీశారు. వైసీపీ కార్యకర్తలు సహా మహిళలపైన కూడా అఘాయిత్యాలు పెరిగిపోయాయని దుయ్య‌బ‌ట్టారు.

దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌

రాష్ట్రంలో జ‌రుగుతున్న దారుణాల‌పైనా.. దాడుల‌పైనా దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. ఇటీవ‌ల నంద్యాల‌లో దారుణ హ‌త్య‌కు గురైన సుబ్బ‌రాయుడు కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తాన‌ని చెప్పారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న దారుణాల‌పై తాను హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి పోరాడతామని జగన్ చెప్పారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మార‌ణ కాండ‌పై గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago