Political News

క‌రోనాపై జ‌గ‌న్ తాజా ఆణిముత్యాలు

క‌రోనా వైర‌స్‌కు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఎప్ప‌టిక‌ప్పుడు చేసిన వ్యాఖ్య‌లు ఎంత‌గా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయో తెలిసిందే. ఆ వైర‌స్ గురించి మొద‌ట్నుంచి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు ఏపీ సీఎం. క‌రోనా విష‌యంలో జ‌నాలు బెంబేలెత్తిపోకుండా ఉండ‌టానికి ధైర్య‌వ‌చ‌నాలు చెప్ప‌డం మంచిదే కానీ.. వైర‌స్ గురించి మ‌రీ తేలిక చేసి మాట్లాడ‌టంతోనే వ‌చ్చింది స‌మ‌స్య‌. వ‌రుస‌గా ప్రెస్ మీట్ల‌లో జ‌గ‌న్ మీడియాకు దొరికేస్తుండ‌టం.. ఆయ‌న అవ‌గాహ‌న లేమి అంతా బ‌య‌ట‌ప‌డిపోవ‌డం.. దీనిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు రావ‌డం, సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌ర‌గ‌డంతో ఒక ద‌శ దాటాక లైవ్ ప్రెస్ మీట్లు ఆగిపోయాయి. త‌ర్వాత త‌న సందేశాన్ని రికార్డ్ చేసి మీడియాకు రిలీజ్ చేయిస్తున్నారు జ‌గ‌న్. అయితే అందులోనూ జ‌గ‌న్ వ్యాఖ్య‌లు విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాయి.

క‌రోనా గురించి తాను చేసిన తేలిక‌పాటి వ్యాఖ్య‌లు ఎంత‌గా విమ‌ర్శ‌ల పాల‌వుతున్నా.. జ‌గ‌న్ మాత్రం త‌న వైఖ‌రి మార్చుకోవ‌ట్లేదు. తాజాగా రిలీజ్ చేసిన మ‌రో రికార్డెడ్ వీడియోలోనూ క‌రోనా గురించి ఆయ‌న లైట్ అన్న‌ట్లే మాట్లాడారు. రాబోయే రోజుల్లో క‌రోనాతో క‌లిసి జీవించాల్సి ఉంటుంది. క‌రోనా కూడా స్వైన్ ఫ్లూ త‌ర‌హాలోనిదే. జాగ్ర‌త్త‌లు తీసుకుంటే న‌యం అవుతుంది. ఇది జ్వ‌రం కంటే ఎక్కువ కాదు అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఐతే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2 నెల‌ల వ్య‌వ‌ధిలో 2 ల‌క్ష‌ల మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోతే.. ఇప్ప‌టికీ అది జ‌స్ట్ జ్వ‌రం లాంటిదే అంటూ తేలిగ్గా మాట్లాడ‌టం.. రాబోయే రోజుల్లో క‌రోనాతో క‌లిసి జీవించాల్సి ఉంటుంది అని కామెంట్ చేయ‌డంతో జ‌గ‌న్‌ను మ‌రోసారి నెటిజ‌న్లు ఆటాడేసుకుంటున్నారు. ఈ వ్యాఖ్య‌ల సంగ‌త‌లా ఉంచితే దేశంలోనే అత్య‌ధిక క‌రోనా టెస్టులు చేస్తున్న‌ది ఆంధ్ర‌ప్ర‌దేశే అని.. ప‌ది ల‌క్ష‌ల మందికి 1396 చొప్పున టెస్టులు చేశామ‌ని.. దేశ స‌గ‌టు క‌రోనా పాజిటివ్ రేటు 4 శాతం ఉంటే ఏపీలో అది 1.61 శాతం మాత్ర‌మే అని జ‌గ‌న్ అన్నారు.

suman

Recent Posts

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

3 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

3 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

3 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

3 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

4 hours ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

4 hours ago