Political News

క‌రోనాపై జ‌గ‌న్ తాజా ఆణిముత్యాలు

క‌రోనా వైర‌స్‌కు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఎప్ప‌టిక‌ప్పుడు చేసిన వ్యాఖ్య‌లు ఎంత‌గా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయో తెలిసిందే. ఆ వైర‌స్ గురించి మొద‌ట్నుంచి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు ఏపీ సీఎం. క‌రోనా విష‌యంలో జ‌నాలు బెంబేలెత్తిపోకుండా ఉండ‌టానికి ధైర్య‌వ‌చ‌నాలు చెప్ప‌డం మంచిదే కానీ.. వైర‌స్ గురించి మ‌రీ తేలిక చేసి మాట్లాడ‌టంతోనే వ‌చ్చింది స‌మ‌స్య‌. వ‌రుస‌గా ప్రెస్ మీట్ల‌లో జ‌గ‌న్ మీడియాకు దొరికేస్తుండ‌టం.. ఆయ‌న అవ‌గాహ‌న లేమి అంతా బ‌య‌ట‌ప‌డిపోవ‌డం.. దీనిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు రావ‌డం, సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌ర‌గ‌డంతో ఒక ద‌శ దాటాక లైవ్ ప్రెస్ మీట్లు ఆగిపోయాయి. త‌ర్వాత త‌న సందేశాన్ని రికార్డ్ చేసి మీడియాకు రిలీజ్ చేయిస్తున్నారు జ‌గ‌న్. అయితే అందులోనూ జ‌గ‌న్ వ్యాఖ్య‌లు విమ‌ర్శ‌ల పాల‌వుతున్నాయి.

క‌రోనా గురించి తాను చేసిన తేలిక‌పాటి వ్యాఖ్య‌లు ఎంత‌గా విమ‌ర్శ‌ల పాల‌వుతున్నా.. జ‌గ‌న్ మాత్రం త‌న వైఖ‌రి మార్చుకోవ‌ట్లేదు. తాజాగా రిలీజ్ చేసిన మ‌రో రికార్డెడ్ వీడియోలోనూ క‌రోనా గురించి ఆయ‌న లైట్ అన్న‌ట్లే మాట్లాడారు. రాబోయే రోజుల్లో క‌రోనాతో క‌లిసి జీవించాల్సి ఉంటుంది. క‌రోనా కూడా స్వైన్ ఫ్లూ త‌ర‌హాలోనిదే. జాగ్ర‌త్త‌లు తీసుకుంటే న‌యం అవుతుంది. ఇది జ్వ‌రం కంటే ఎక్కువ కాదు అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఐతే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2 నెల‌ల వ్య‌వ‌ధిలో 2 ల‌క్ష‌ల మంది క‌రోనా వ‌ల్ల ప్రాణాలు కోల్పోతే.. ఇప్ప‌టికీ అది జ‌స్ట్ జ్వ‌రం లాంటిదే అంటూ తేలిగ్గా మాట్లాడ‌టం.. రాబోయే రోజుల్లో క‌రోనాతో క‌లిసి జీవించాల్సి ఉంటుంది అని కామెంట్ చేయ‌డంతో జ‌గ‌న్‌ను మ‌రోసారి నెటిజ‌న్లు ఆటాడేసుకుంటున్నారు. ఈ వ్యాఖ్య‌ల సంగ‌త‌లా ఉంచితే దేశంలోనే అత్య‌ధిక క‌రోనా టెస్టులు చేస్తున్న‌ది ఆంధ్ర‌ప్ర‌దేశే అని.. ప‌ది ల‌క్ష‌ల మందికి 1396 చొప్పున టెస్టులు చేశామ‌ని.. దేశ స‌గ‌టు క‌రోనా పాజిటివ్ రేటు 4 శాతం ఉంటే ఏపీలో అది 1.61 శాతం మాత్ర‌మే అని జ‌గ‌న్ అన్నారు.

suman

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

4 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

4 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

4 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

4 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

6 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

7 hours ago