Political News

తిరుప‌తిలో ఇలా చేద్దాం.. చంద్ర‌బాబు అదిరిపోయే ఐడియా!

రాష్ట్రంలో ఉప ఎన్నిక‌కు అవ‌కాశం ఉన్న తిరుప‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో టీడీపీ ఎలా ముందుకు సాగుతుంది? ఏ నిర్ణ‌యం తీసుకుంటుంది? ఎవ‌రికి అవ‌కాశం ఇస్తుంది? అనే విష‌యాలు ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రి పోరు సాగించాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. ఈ సీటును సీనియ‌ర్ నాయ‌కురాలు, కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మికి ఇచ్చారు చంద్ర‌బాబు. అయితే, ఆమె ఓడిపోయారు. ఇక‌.. ఇప్పుడు ఏం చేయాలి? అనే ఆలోచ‌న వ‌స్తే.. ఈ ప‌రిస్థితిని పార్టీకి, వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు కూడా సానుకూలంగా మార్చుకునేలా అదిరిపోయే ఐడియా వేశార‌ని టీడీపీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

గ‌త కొన్నాళ్ల ప‌రిస్థితిని తీసుకుంటే.. తిరుపతి అసెంబ్లీ నియోజ‌వ‌క‌ర్గంలో టీడీపీకి బ‌లం ఉన్నా.. పార్ల‌మెంటు స్థాయిలో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఇక్క‌డ ఇటీవ‌లకాలంలో టీడీపీ త‌ర‌ఫున గెలుపు గుర్రం ఎక్కుతున్న నాయ‌కుడు ఎవ‌రూ లేరు. పైగా ఎప్పుడు అవ‌కాశం వ‌స్తే.. అప్పుడు పొత్తులో ఉన్న పార్టీకి చంద్ర‌బాబు ఈ టికెట్‌ను ఇచ్చేసి చేతులు దులుపు కొంటున్నారు. గ‌త ఏడాది ఎవ‌రితోనూ పొత్తు లేక‌పోవ‌డంతో పోటీకి దిగారు. ఇక‌, ఇప్పుడు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీంతో టికెట్ త‌మ‌కంటే.. త‌మ‌కంటూ.. ఇద్ద‌రు నాయ‌కులు ముందుకు వ‌చ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

కానీ, చంద్ర‌బాబు ఈ ప‌రిణామాన్ని రెండు విధాల ల‌బ్ధి పొందేందుకు ఉప‌యోగించుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఒక‌టి సెంటిమెంటు రూపంలో రాజ‌కీయాల‌ను పండించ‌డం. రెండు.. కేంద్రంలోని బీజేపీకి ద‌గ్గ‌ర కావ‌డం. సిట్టింగ్ నేత ఎవ‌రైనా మృతి చెందితే.. వారి కుటుంబంలోని వారికి టికెట్ ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. దీనికి ఇత‌ర ప‌క్షాలు కూడా దూరంగా ఉంటున్నాయి. రాజ‌కీయ వైర‌ధ్యాలు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీలు ఈ విష‌యంలో క‌లిసి ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎలాగూ త‌మ‌కు బ‌లం లేదు కాబ‌ట్టి.. పోటీ పెట్ట‌డం మానేసి.. సెంటిమెంటుకు వాల్యూ ఇస్తున్నాం.. అని చంద్ర‌బాబు ప్ర‌క‌టించుకునేందుకు ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంది.

అదే స‌మ‌యంలో ఎలాగూ అంతో ఇంతో త‌మ‌కు ఊపు ఉంద‌ని భావిస్తున్న బీజేపీ అభ్య‌ర్థిని నిల‌బెడితే..(గ‌తంలో బీజేపీ అభ్య‌ర్థులు గెలిచారు) వారికి లోపాయికారీగా .. టీడీపీ నుంచి స‌పోర్టు చేయాల‌ని బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అంటే.. ఇటు సెంటిమెంటు ద్వారా సింప‌తి సంపాయించుకునేందుకు, అటు లోపాయికారీగా .. బీజేపీకి మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా.. ఆ పార్టీకి చేరువ అయ్యేలా సంకేతాలు పంపేందుకు ఇది దోహ‌ద ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని టీడీపీలో గుస‌గుస వినిపిస్తోంది. అంటే.. ఒకే ఉప ఎన్నిక‌ను త‌న‌కు అనుకూలంగా రెండు విధాలా వాడుకునేందుకు బాబు వేసిన ఐడియా బాగుంద‌నే అంటున్నారు త‌మ్ముళ్లు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on September 26, 2020 9:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

8 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

8 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

11 hours ago